కరోనాపై ఆందోళన వద్దు.. అతిగా కొనొద్దు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలంతా జాగ్రత్త పడుతున్నారు. దీంతో మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇది మంచి పరిణామమే.. కానీ కరోనా వ్యాప్తిపై సరైన అవగాహన లేక.. సోషల్మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు చూసి కొందరు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇది మంచి పరిణామమే.. కానీ, కరోనా వ్యాప్తిపై సరైన అవగాహన లేక.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు చూసి కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ మాస్కులకు బదులు ఎన్-95 మాస్కులు వాడుతున్నారు.. సొంత వైద్యం, సొంత శానిటైజర్ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అతిగా ఖర్చు చేస్తున్నారు. కరోనా భయంతో ఇలాంటి వాటిపై ఖర్చులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్-95 మాస్కులు సాధారణ వ్యక్తులకు కాదు
కరోనా సోకకుండా మాస్కులు వాడమని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ఎన్-95, సర్జికల్ మాస్కులు కొనుక్కొని వాడుతున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఆ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఈ మాస్కులు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి ఉత్పత్తి.. సరఫరా చాలా తక్కువగా ఉంది. అందుకే వీటిని వైద్య సిబ్బందికే ఇవ్వడం మంచిది. మనం సాధారణ మాస్కులు, ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు, అవీ సాధ్యం కాకపోతే చేతి రుమాలను వాడితే సరిపోతుంది.
గ్లౌజులు ఎల్లవేళలా అవసరమా...
కరోనా దెబ్బకు మనంతా ఇంట్లోనే క్వారంటైన్లో ఉండిపోయాం. రోజూ చేసిన పనులే చేస్తుంటాం. మరి ఇంట్లో గ్లౌజులు వాడటం ఎందుకు? ఒకవేళ బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే సమయంలో గ్లౌజులు వాడొచ్చు. అయితే వాటిని రీయూజ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. చేతులకు ఎలా వైరస్ అంటుకుంటుందో.. గ్లౌజులకు అలాగే అంటుకుంటుంది. కాబట్టి సర్జికల్ గ్లౌజులు వాడకుండా, సింగిల్ యూజ్ గ్లౌజ్లు వాడటం, ఏదైనా పని చేసినప్పుడు వెంటనే చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవడం మంచిది. వైద్య సిబ్బందికి ఆ గ్లౌజులు తప్పనిసరి. వాటిని వారికే ఉండనిద్దాం.
అవసరానికి మించి కొనొద్దు..
కరోనా సంక్షోభం.. హోం క్వారంటైన్ కారణంగా దుకాణాల్లో సరకులు నిండుకుంటాయని, ధరలు పెరుగుతాయని చాలా మంది భ్రమపడి అవసరానికి మించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఏ సూపర్ మార్కెట్కి వెళ్లినా ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. నిజానికి నిత్యావసరాల ఉత్పత్తి.. సరఫరా ఎక్కడా నిలిచిపోలేదు. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు వస్తువులు కొనుగోలు చేయండి. అవసరం లేకపోయినా.. పడుంటాయిలే అని తెగ కొనేయకుండా... అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి.
శానిటైజర్ కొనేముందు జాగ్రత్త
ప్రస్తుతం శానిటైజర్లకు చాలా డిమాండ్ ఉంది. దీంతో కొన్ని నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కనీసం 60 శాతం ఇథనాల్ లేదా 70 శాతం ఐసోప్రొపైల్ లేని శానిటైజర్లు వైరస్ను చంపలేవని సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. అందుకే శానిటైజర్ కొనే ముందు ఆల్కాహాల్ శాతాన్ని చెక్ చేయండి. నకిలీ శానిటైజర్లు కొని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి.
విటమిన్ ట్యాబ్లెట్లపై ఆధారపడకండి
కరోనాను ఎదుర్కొనేందుకు కొంతమంది విటమిన్స్ ఉన్న మందులను వేసుకుంటున్నారు. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వారికి ఈ విటమిన్స్ ఎలాంటి అదనపు లాభాన్ని చేకూర్చవు. ఇవి కేవలం పౌష్టికాహారం లోపం ఉన్నవారికే ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనవసరంగా విటమిన్ టాబ్లెట్లు మందులు వేసుకోవద్దు. వాటికి బదులు రోగనిరోధక శక్తి పెంచే పండ్లు కొని తినండి. అలాగే కొందరు యాంటీ బయోటిక్స్ మందులు వాడుతున్నారు. ఇవి కేవలం బ్యాక్టీరియాలను మాత్రమే చంపుతాయి.. వైరస్ని కాదని గుర్తుంచుకోండి.
శుభ్రత కోసం అధిక ఖర్చులొద్దు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరముంది. అయితే దీనికోసం ప్రత్యేక క్లీనర్స్ను కొనాల్సిన పనిలేదు. నిత్యం మనం ఉపయోగించే వస్తువులను సాధారణ క్లీనర్లతోనే శుభ్రపర్చుకోవచ్చు. ముఖ్యంగా తలుపులకు, డ్రాలకు ఉండే హ్యాండిల్స్, బ్యాగ్స్, వేసుకునే బట్టలు తదితర వస్తువులను ప్రతి రోజు శుభ్రం చేయాలి.
జుట్టు, ముఖంపై సొంత ప్రయోగాలు వద్దు
లాక్డౌన్తో సెలూన్ షాపులు, బ్యూటీ పార్లర్లు మూతపడ్డాయి. దీంతో హోం క్వారంటైన్లో ఉంటున్న చాలా మందికి జుట్టు పెరిగిపోయి, ముఖంలో మెరుపు తగ్గిపోయి ఉండొచ్చు. దీంతో కొంత మంది దుకాణాల్లో దొరికే సాధారణ నూనె, ఫేస్ క్రీమ్లతో ఇంట్లోనే జుట్టు, ముఖంపై ప్రయోగాలు చేస్తున్నారట. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి లాక్డౌన్ ఎత్తివేసే వరకు వేచి ఉండండి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?