కరోనా వైరస్ను మొదట కనిపెట్టింది ఆమేనట!
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పుట్టింది చైనాలో గత డిసెంబర్లో అన్నది అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఇదే కరోనా వైరస్ 56 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. పెద్దగా చదువుకోని ఓ సాధారణ మహిళ ఈ మహమ్మారి ఉనికిని బయటపెట్టింది. స్కాట్లాండ్కు
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్- 19 వైరస్ పుట్టింది చైనాలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. గతంలోనూ ఈ కుటుంబానికి చెందిన కొన్ని వైరస్లు వచ్చాయి. అయితే తొలి కరోనా వైరస్ 56 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. పెద్దగా చదువుకోని ఓ సాధారణ మహిళ ఈ మహమ్మారి ఉనికిని బయటపెట్టిందంటే నమ్ముతారా? స్కాట్లాండ్కు చెందిన జూన్ అల్మీదా కనుగొన్న వైరస్ను అప్పుడు శాస్త్రవేత్తలు పట్టించుకోలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థలు తాజాగా అల్మీదా గురించి కొన్ని కథనాలు రాశాయి. వాటి ప్రకారం... తొలి కరోనా లెక్క ఇదీ!
అల్మీదా.. పదో తరగతి వరకే చదువుకుంది. ఆర్థిక పరిస్థితులు సరిగాలేక లేబొరేటరీ టెక్నీషియన్గా చేరి.. మైక్రోస్కోపీపై పట్టు సాధించింది. వైరస్ల ఆకృతులు సుస్పష్టంగా కనిపించే విధానాన్ని కనిపెట్టిన అల్మీదా వైరాలజీ విభాగంలో మంచి గుర్తింపు పొందింది. అయితే 1964లో లండన్కు వెళ్లి సెయింట్ థామస్ ఆస్పత్రిలో పనిచేస్తూ.. డేవిడ్ టిర్రెల్ అనే డాక్టర్తో కలిసి సాధారణ జలుబుకు కారణాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టెర్రెల్ ఓ చిన్నారి ముక్కు నుంచి తీసిన నమూనాలో బీ814 అనే వైరస్ను కనుగొన్నారు. ఈ వైరస్ను మైక్రోస్కోప్లో చూసినప్పుడు సాధారణ ఇన్ఫ్ల్యూఎంజాలాగే కనిపించినా కాస్త భిన్నంగా ఉన్నట్లు అల్మీదా గుర్తించింది. మరింత లోతుగా పరిశీలిస్తే.. ఆ వైరస్కు కొమ్ములు.. వాటి మీద కిరీటం లాంటి ఆకృతి ఉండటాన్ని గమనించారు.
వైరస్ చూడటానికి కొత్తగా ఉండటంతో అల్మీదా, టిర్రెల్, మరో వైద్యుడు కలిసి దీనికి.. కరోనా వైరస్ అని పేరు పెట్టారు. అంతేకాదు.. ఈ వైరస్ చిత్రాలు, వివరాలను మెడికల్ జర్నల్స్కు పంపితే.. నిర్వాహకులు అల్మీదా కనిపెట్టింది వైరస్ కాదంటూ కొట్టిపారేశారు. అది ఇన్ఫ్లూఎంజా వైరస్లోని ఓ భాగమని.. చిత్రం సరిగా తీయకపోవడంతో అలా కనిపిస్తుందని తేల్చారు. అయితే 1965లో బీ814 వైరస్పై జర్నల్స్లో ప్రచురించారు. ఆ తర్వాత రెండేళ్లు అల్మీదా తీసిన చిత్రాన్ని వైరాలజీకి సంబంధించిన జర్నల్స్లో పెట్టారు. అలా ఈ కరోనా వైరస్ గురించి తొలిసారి వైద్యశాస్త్రానికి తెలిసింది. ఆ తర్వాత దాని ఉనికి లేకపోయినా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తూ ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది.
అల్మీదా కెనడాలోని ఒంటారియా కేన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పుడు కంటికి కనిపించని వైరస్లను మైక్రోస్కోపీలో సులభంగా చూడగలిగేలా ‘ఇమ్యూన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’ పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో వైరస్లను మనిషి లేదా జంతువు యాంటీబాడీలతో కలిపేస్తారు. అప్పుడు వైరస్లు మైక్రోస్కోప్లో బాగా కనిపిస్తాయి. అలా అల్మీదా అనేక వైరస్ల ఆకృతిని ప్రపంచానికి చూపించింది. ఆమె కృషి వల్లే ఇప్పుడు వైరస్ ఆకృతులను మనం చూడగలుతున్నాం. అంతేకాదు.. పెద్ద చదువులు లేకున్నా ఎన్నో వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు సహ రచయితగా పనిచేశారు. వాటిలో ఎక్కువగా వైరస్ ఆకృతుల గురించే ఉన్నాయి. అల్మీదా రాసిన పుస్తకాలకు గుర్తింపుగా 1970లో డాక్టరేట్ ఇచ్చారు. కొంతకాలం మైక్రోస్కోపీలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తించి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చిన అల్మీదా యోగా శిక్షకురాలిగానూ కొన్నాళ్లు పనిచేసింది. 2007లో గుండెపోటుతో అల్మీదా(77) మరణించారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్