శునకాలు కరోనా రోగుల్ని పసిగట్టగలవా?
మనిషి మచ్చిక చేసుకున్న జంతువుల్లో శునకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా ఇళ్లల్లో వీటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. భారత్లాంటి దేశాల్లో కాలభైరవ స్వరూపంగా ఆరాధిస్తారు. కాలం గడిచే కొద్దీ శునకాలు మనుషుల్ని ఎంత ప్రేమిస్తాయో? ఎంత విశ్వాసం చూపిస్తాయో....
గతంలో మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ను గుర్తింపు
గంటకు 750 మందిని స్క్రీనింగ్ చేయగల సామర్థ్యం!
మనిషి మచ్చిక చేసుకున్న జంతువుల్లో శునకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా ఇళ్లల్లో వీటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. భారత్లాంటి దేశాల్లో కాలభైరవ స్వరూపంగా ఆరాధిస్తారు. కాలం గడిచే కొద్దీ శునకాలు మనుషుల్ని ఎంత ప్రేమిస్తాయో? ఎంత విశ్వాసం చూపిస్తాయో? ఎలా రక్షిస్తాయో ప్రత్యక్షంగా చూశాం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా వైరస్. మరి ఈ మహమ్మారి నుంచి బయట పడేందుకు శునకాలేమైనా సహాయం చేయగలవా?
పరీక్షలకు శునక సాయం
ఒక వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నమూనాలను పరీక్షించడం. వైరస్ సోకిన 20% మందిలోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. అందులోనూ తీవ్రత ఎక్కువుంటేనే ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం వంటివి తెలుస్తున్నాయి. మిగతా 80% మందిలో లక్షణాలేమీ కనిపించడం లేదు. అంటే వీరు గుప్త వాహకులుగా మారే ప్రమాదముంది. వైరస్ లేదని బయటే తిరిగితే వారి నుంచి ఇతరులకు సోకుతుంది. అత్యంత జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు మాత్రం ఎందరిని పరీక్షిస్తాయి? ఎందరి నమూనాలను ప్రయోగశాలలకు పంపిస్తాయి? ప్రజా రవాణా ఆరంభమయ్యాక స్ర్కీనింగ్ చేసినా ఇండోనేసియా నుంచి వచ్చిన యాత్రికుల్లాగా పారాసిటమాల్తో ఏమార్చరని హామీ ఏముంది? అందుకే నావెల్ కరోనా వైరస్ ఉన్న వ్యక్తుల్ని శునకాలు గుర్తిస్తే వారిని నేరుగా ఆస్పత్రికి తరలించి ఆర్టీ పీసీఆర్ వంటి టెస్టుల ద్వారా పక్కాగా నిర్ధారణ చేసుకోవచ్చు. బ్రిటన్లోని రెండు విద్యాసంస్థలు ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాయి.
మలేరియాను గుర్తించాయి
పోలీసు శునకాలు వాసన ద్వారా నేరస్థులను గుర్తించడం మనకు తెలిసిందే. ఇదే ఇవిధంగా మరి కరోనా వైరస్ అతిథేయులను అవి గుర్తించగలవా? అనే లక్ష్యంతో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ దుర్హమ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. గతంలో మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ బాధితులను శునకాలు గుర్తించాయి. ఈ పరిశోధన వివరాలు సైతం లాన్సెట్లో ప్రచురించారు. ఏదైనా వ్యాధి సోకినప్పుడు మానవుల శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ప్రత్యేకమైన వాసన జనిస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధుల్లో ప్రత్యేకమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ సోకినప్పుడూ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఊపిరితిత్తులపైనే వైరస్ ప్రభావం ఉంటుంది. శ్వాస సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ వైరస్ అతిథేయులను శునకాలు గుర్తిస్తాయో లేదో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అషర్, జాస్పర్, డిగ్బీ, నార్మన్, స్టోర్మ్ వంటి చురుకైన, తెలివైన శునకాలతో ప్రయోగాలు చేపట్టారు.
కొవిడ్-19పై శిక్షణ
ఈ ప్రయోగాల్లో కొవిడ్-19 బాధితుల మాస్క్లను వాసన చూసేలా శునకాలకు శిక్షణనిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పరికరంలో మాస్క్లు ఉంచుతారు. శునకాలతో పదేపదే వాసన చూపిస్తారు. కరోనా అతిథేయుల్లో ప్రత్యేకమైన వాసన ఏదైనా జనించిందా అని గమనిస్తున్నారు. ప్రయోగాలకు కొన్ని వారాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి కరోనా అతిథేయుల్లో ప్రత్యేక వాసన జనించిందో లేదో ఇంకా తెలియదని వారు చెబుతున్నారు. ఒకవేళ ఉంటే మాత్రం శునకాలు కచ్చితంగా గుర్తిస్తాయని విశ్వాసంగా ఉన్నారు. అప్పుడు కొవిడ్-19 కట్టడి, వైద్యంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.
గంటకు 750 మంది స్ర్కీనింగ్
‘ఇప్పటికే శునకాలు ఎన్నో విజయాలు సాధించాయి. శిక్షణ ద్వారా అవి కొవిడ్-19 గుర్తిస్తాయని నా నమ్మకం’ అని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ సీఈవో క్లెయిర్ గెస్ట్ అంటున్నారు. గంటకు 750 మందిని స్ర్కీనింగ్ చేయగల సామర్థ్యం శునకాలకు ఉంటుందని పేర్కొన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రజా రవాణా కేంద్రాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో వీటి అవసరం ఎంతో ఉంటుందన్నారు. కరోనా వైరస్ మాస్క్ల నుంచి శునకాలను జాగ్రత్తగా కాపాడుకోవడమే తమ ముందున్న సవాల్గా తెలిపారు. ఈ ప్రయోగాల్లో శునకాలు విజయం సాధిస్తే ర్యాపిడ్ టెస్టుల అవసరం భారీగా తగ్గుతుంది. జనసమూహంలో ఉన్న అతిథేయులను గుర్తించేందుకు వీలవుతుంది. సమాజంలో వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందో అవగాహన వస్తుంది.
-ఇంటర్నెట్డెస్క్
చదవండి: వీధి కుక్కల్లో వింత ప్రవర్తన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ