..రెక్కలు విచ్చుకొని ఎగరాలంటే!
కరోనా.. కనిపించని శత్రువు. చైనాలోని వుహాన్లో పురుడు పోసుకున్న ఈ వైరస్ నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎందరి జీవితాలనో చిదిమేసింది. ఎన్నో వ్యాపారాలను చిధ్రం చేసింది. కొవిడ్-19 కొట్టిన దెబ్బకు రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది విమానయాన పరిశ్రమ. సంస్థలకు ఆదాయం లేదు.....
ప్రయాణికులకు వైద్య ధ్రువపత్రం అవసరం?
ఒకే బ్యాగుకు అనుమతి.. ఇంకా మరెన్నో మార్పులు
కరోనా.. కనిపించని శత్రువు. చైనాలోని వుహాన్లో పురుడు పోసుకున్న ఈ వైరస్ నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎందరి జీవితాలనో చిదిమేసింది. ఎన్నో వ్యాపారాలను చిధ్రం చేసింది. కొవిడ్-19 కొట్టిన దెబ్బకు రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది విమానయాన పరిశ్రమ. సంస్థలకు ఆదాయం లేదు. ఉద్యోగులకు జీతాల్లేవు. లాక్డౌన్ ఎత్తేశాక ఈ రంగం ఎన్నో మార్పులను సంతరించుకోనుంది.
ఎంత నష్టం.. ఎంత కష్టం
లాక్డౌన్ అమల్లోకి వచ్చాక లోహ విహంగాలు రెక్కలు తెగిన పక్షుల్లా మారాయి. గాల్లోకి ఎగరలేదు. కేవలం సరకు రవాణా, ప్రత్యేక విమానాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్న తరుణంలోనే కరోనా వైరస్ ముప్పుగా పరిణమించింది. దీంతో విమానాలన్నీ విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి చాలా సంస్థలు రుణాలు తీసుకొనే వ్యాపారాలు చేస్తున్నాయి. ఊహించని రీతిలో ఆదాయం పడిపోవడంతో ఉద్యోగులకు జీతాల చెల్లింపే కష్టంగా మారింది. భారత వైమానిక రంగం జీడీపీకి 72 బిలియన్ డాలర్లు అందిస్తుంది. 25% రాబడి తగ్గితే దాదాపు 1.5-2 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతుంది. ప్రస్తుత పరిస్థితులు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఇకపై ఒక్క బ్యాగే!
లాక్డౌన్ ఎత్తేయగానే వైమానిక రంగానికి జవసత్వాలు కల్పించాలని సంస్థలు కంకణం కట్టుకున్నాయి! విమానాల లోపల, విమానాశ్రయంలో, అనుబంధ పరిశ్రమలో విపరీతమైన మార్పులు రానున్నాయి. వైరస్ ముప్పు పొంచే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇకపై విమానాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు వేర్వేరు ద్వారాలు ఉపయోగిస్తారని తెలిసింది. ప్రయాణికులు తమ విమానం ఎగిరేందుకు రెండు, మూడు గంటల ముందే రావాల్సి ఉంటుంది. ఒకరికొకరు కనీసం 1.5మీటర్ల దూరం నిలబడాలి. థర్మల్ స్కానింగ్ చేస్తారు. బహుశా ప్రయాణికులకు ఇకపై ఒకే ఒక్క బ్యాగునే అనుమతిస్తారు. ఎక్కువ బ్యాగేజ్ ఉంటే వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువని భావిస్తున్నారు.
వైద్య ధ్రువపత్రం తప్పదేమో?
విమానంలో ప్రయాణించాలంటే వైద్య ధ్రువీకరణ పత్రాలు తెమ్మని సంస్థలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశంపై అన్ని కంపెనీలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిసింది. విమానాశ్రయంలోని రాగానే మాస్క్, గ్లోవ్స్ అందజేయాలని అనుకుంటున్నాయి. ఆరోగ్యశాఖతో చర్చించి పౌర విమానయాన శాఖ త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది. టేకాఫ్కు రెండు గంటల ముందే ప్రయాణికులు రావాలని, గంట ముందుగానే సెక్యూరిటీ గేట్లు మూసేయాలని ప్రభుత్వానికి సీఐఎస్ఎఫ్ ప్రతిపాదించిందని సమాచారం. సోషల్ డిస్టెన్స్ కోసం విమానాల్లో ఎకానమీ తరగతిలో సీట్ల మధ్య ఖాళీ వదులుతారని తెలిసింది.
విమానాశ్రయంలోనే క్వారంటైన్ కేంద్రం
విమానాశ్రయాల్లోనూ మార్పులు రానున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే దిల్లీ విమానాశ్రయంలో అన్ని బ్యాగులను శానిటైజ్ చేసేందుకు అతినీల లోహిత కిరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక టన్నెల్ ద్వారా ట్రాలీలన్నీ వెళ్తాయని తెలుస్తోంది. పెద్ద ఎయిర్ పోర్టులున్న నగరాల్లోనే ఎక్కువ కేసులు ఉండటంతో జాగ్రత్తలు కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్లో ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ద్వారాలు, చెకిన్ కౌంటర్లు, స్వీయ తనిఖీ కియోస్కులు, సెక్యూరిటీ చెక్పాయింట్లు, ఆహార శాలలు, లాంజ్, బోర్డింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తారు. అందులోనే ప్రయాణికులు నిలబడాలి. ముంబయి విమానాశ్రయంలో ఏకంగా క్వారంటైన్ కేంద్రాలే ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపిస్తే అక్కడే ఉంచేస్తారు. ప్రయాణికులను తరలించేందుకు వీలున్నచోట బస్సులు కాకుండా ఎయిరోబ్రిడ్జిలు ఉపయోగిస్తారు. ఇలాంటి మార్పులు ఇంకా మరెన్నో మనం చూడబోతున్నాం!
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి