లాక్డౌన్ 4.0: బయట భద్రమేనా?
లాక్డౌన్ 4.0 చాలా భిన్నంగా ఉంటుంది’- ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాట. భిన్నమంటే ఏంటి? గతానికి ఇప్పటికీ తేడా ఏం ఉంటుంది? ఆంక్షలను మరింత సడలిస్తారా? ప్రజా రవాణా మొదలవుతుందా? అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇస్తారా? అన్ని రకాల దుకాణాలు తెరవొచ్చా? అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.....
ఆరడుగుల దూరం, మాస్క్తో శ్రీరామ రక్ష
జనాల్ని కలవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది
‘లాక్డౌన్ 4.0 చాలా భిన్నంగా ఉంటుంది’- ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాట. భిన్నమంటే ఏంటి? గతానికి ఇప్పటికీ తేడా ఏం ఉంటుంది? ఆంక్షలను మరింత సడలిస్తారా? ప్రజా రవాణా మొదలవుతుందా? అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇస్తారా? అన్ని రకాల దుకాణాలు తెరవొచ్చా? అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
వైరస్ ప్రభావమైతే తగ్గలేదు. మరలాంటప్పుడు ఆంక్షలు సడలిస్తే వ్యాప్తి పెరగదా? 100 మంది మన పక్కనుంచే వెళ్తే భౌతిక దూరం పనిచేస్తుందా? జనాలు కిటకిటలాడే సూపర్ మార్కెట్లలో మాస్క్లు మేలు చేస్తాయా? పక్కనే కిరాణా దుకాణానికి వెళ్తే సురక్షితమా? మాస్క్ లేకుండా ఆరడుగల దూరం పాటిస్తే భయం లేదా? అని అందరిలోనూ సందేహాలు తలెత్తున్నాయి. మరి వీటికి జవాబులు తెలిసేదెలా??
గణాంక మోడల్
కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు దాంతో కలిసి జీవించక తప్పదు. ఈ విషయం తెలిశాక ప్రభుత్వాలు వ్యూహాలు మారుస్తున్నాయి. సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడంతో పైన పేర్కొన్న సందేహాలే అందరికీ వస్తున్నాయి. ఎంఐటీలో అంటువ్యాధుల గొలుసుపై పరిశోధనలో పాలుపంచుకున్న ఎలీనా పొలొజొవో ఓ గణాంక మోడల్ ద్వారా వీటికి సమాధానలు ఇచ్చేందుకు ప్రయత్నించారు.
ప్రమాణాలివీ..
ఇంట్లో క్వారంటైన్లో ఉన్నప్పుడు ఇతరులను కలిసేందుకు వీలవ్వదు. భౌతిక దూరం, ఆరడుగుల దూరం పాటించేందుకు కుదిరింది. జన సమూహాలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఆంక్షలు సడలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎలీనా చెప్పాలనుకున్నారు. మన పక్క నుంచి నాలుగు అడుగుల దూరంలోనే మరొకరు వెళ్తే ఏంటి? సమావేశం సమయాన్ని బట్టి వైరస్ రిస్క్ ఎంత ఉంటుంది? ఒక భారీ సూపర్ మార్కెట్, పక్కనే కిరణా షాపులో ఏది ప్రమాదకరం? మాస్క్ వేసుకున్నప్పుడు ప్రమాదతీవ్రతలో మార్పు ఉంటుందా? వైరస్ ఉన్న ఒక ఉపరితలం ముట్టుకొని ముఖాన్ని స్పర్శిస్తే? ఒక కొవిడ్ రోగి మీ పక్కనుంచి వెళ్తూ నిశ్వాసిస్తే ఉండే తుంపర్ల విస్తరణ, గాల్లోని అణువుల ఫ్లూయిడ్ డైనమిక్స్ తీసుకొని పెద్ద, చిన్న గదుల్లో పరిస్థితులను ఆమె ప్రమాణాలుగా ఎంచుకున్నారు.
సగం తీవ్రత తగ్గినట్టే
మీరున్న ప్రాంతంలో వైరస్ తీవ్రత రెండు రెట్లు ఉంటే మీరు బయటకు వెళ్లినప్పుడు ఉండే రిస్క్ రెండు రెట్లని ఎలీనా అంటున్నారు. మీరు నడుస్తున్నప్పుడు పక్కనే నడిచే జనాలు సగం మంది తగ్గితే సగం ప్రమాదం తగ్గినట్టే. ఉపరితలాలను ఎక్కువ సార్లు శానిటైజ్ చేస్తే రిస్క్ ఇంకా తగ్గుతుంది. సర్జికల్ మాస్క్ ద్వారా 90 శాతం వైరల్ పదార్థాలను నివారించొచ్చు. ఇది 10 రెట్లు రక్షణ కారకం అవుతుంది. అదే టీషర్ట్ మాస్కైతే 70% పదార్థాలను తగ్గిస్తుంది. ఆరడుగులు/రెండు గజాల దూరం ఎప్పటికీ సురక్షితంగా ఉంచుతుంది. మీరు నడుస్తున్నప్పుడు పక్కన వెళ్లేవారు 4 అడుగుల దూరంలో ఉంటే తీవ్రత ఎక్కువ. అలా ఎందరు వెళ్తే అంత ప్రమాదం ఉంటుంది. అదే మాస్క్ వేసుకొని అందరూ వెళ్తే భద్రత ఎక్కువ.
పక్క నుంచి నడిస్తే
మన పక్కనున్న వారు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటారన్న అంశంపై ప్రమాదం తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అవతలి వారు రెండుసార్లు శ్వాస తీసుకుంటారని అనుకుంటే 10, 30, 100.. ఎంత మంది మన పక్కనుంచి వెళ్తే అంత ప్రమాదం అన్నమాట. ఆరు కన్నా నాలుగు అడుగు దూరంలోని వారు మాస్క్ లేకుండా దగ్గినా, తుమ్మినా రిస్క్ ఎక్కువ. అంటే 4 అడుగుల దూరంలో 100 మంది వెళ్తే అందరూ దగ్గితే కొవిడ్ సోకే అవకాశం 19% ఉంటుంది. అదే 6 అడుగులైతే ఇది 0.8 శాతానికి పడిపోతుంది. అంటే ఆరడుగులు, మాస్క్ ఇచ్చే రక్షణ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు.
సమావేశమైతే
సమావేశమైనప్పుడు అవతలి వారి శ్వాసను దగ్గినట్టుగా పరిగణించి లేదా కేవలం మాట్లాడితే కరోనా సోకే అవకాశం ఎంత ఉంటుందో ఎలీనా లెక్కించింది. ఒక మనిషి నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటాడని ఆమె అంచనా వేసింది. 100 మంది మాస్కుల్లేకుండా అదే పనిగా దగ్గుతున్నారనుకుందాం. అప్పుడు 15 నిమిషాలతో పోలిస్తే గంట తర్వాత ప్రమాదం తీవ్రత 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే ఎంత తక్కువ సమయం కలిస్తే అంత మంచిది. అదే ఆరడుగల దూరం ఉండి మాస్క్ ధరించి దగ్గకుండా మాట్లాడితే 30 సెకన్లు అయినా 3 గంటలైనా రక్షణ ఒకేలా ఉంటుంది.
కిరాణం-సూపర్ మార్కెట్
ఎందరు వస్తున్నారు? ఎన్ని వస్తువులను ముట్టుకుంటున్నారు? మాస్క్ ధరించారా లేదా? తరచూ శానిటైజ్ చేశారా అన్న అంశాలపై ఆధారపడి చిన్న కిరాణం లేదా సూపర్ బజార్లో ఏది సురక్షితమో చెప్పొచ్చని ఎలీనా అంటోంది. భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మంది మధ్యలో ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో బాగాలేని వారు ముట్టుకున్నా, దగ్గినా తీవ్రత ఎక్కువే. ఎలా చూసినా పెద్ద స్టోర్లకే జనం ఎక్కువ వెళ్తారు కాబట్టి రిస్క్ ఎక్కువ. అయితే శానిటైజ్తో ఆ ప్రమాదం తగ్గించొచ్చు. ఈ గణాంక మోడల్లో కొన్ని సహేతుకంగా అనిపించకపోవచ్చని ఎలీనా తెలిపింది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రజలకు తెలియాలి. అందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని ఆమె ఉద్దేశం. ఏ విధంగా చూసినా ఆరడుగుల దూరం, మాస్క్ చేసే మేలు అంతా ఇంతా కాదని ఆమె నొక్కి చెబుతోంది.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!