నీరో నిజంగానే ఫిడేల్ వాయించాడా?
‘‘రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఈ వ్యాఖ్యని ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యను కొందరు దేశాధినేతలకు ఆపాదిస్తూ విమర్శలు
‘‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యను కొందరు దేశాధినేతలకు ఆపాదిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నియంత్రణకు అనేక దేశాలు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంటే అమెరికా, రష్యా, పాకిస్థాన్, చైనా వంటి పలు దేశాలు అసలు మా దేశంలో కరోనా లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయట. ఆయా దేశాల్లో కేసులు పెరిగి, పౌరులు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్రాన్ ఖాన్, జిన్ పింగ్.. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. వీరి గురించి అటుంచితే అసలు రోమ్ తగలబడుతుంటే నిజంగానే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చొన్నాడా? కాల క్రమంలో ఒక జాతీయంగా మారిపోయిన ఈ వ్యాఖ్యలో నిజమెంతా? ఓ సారి చూద్దాం..
రోమ్ రాజ్యం తగలబడటం నిజం.. క్రీస్తుశకం 64 జులై 18 అర్ధరాత్రి చిన్నగా చెలరేగిన మంటలు రోమ్ మొత్తం దావానలంలా వ్యాపించాయి. వారంపాటు కొనసాగిన దావానలం రోమ్లో ఉన్న 14 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఏడు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, భవంతులు, పాకలు అన్ని ధ్వంసమయ్యాయి. వందల మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రోమ్లో దాదాపు సగం జనాభా నిరాశ్రయులయ్యారు. రోమ్లో ఇంత జరుగుతుంటే నీరో చక్రవర్తి స్పందించలేదని అప్పటి ప్రజలు భావించారు. వారు అలా అనుకోవడంలో తప్పు లేదు. నీరో.. అనేక మంది ప్రాణాలు తీసిన చెడ్డ చక్రవర్తి. ఆయనపై అప్పట్లో ఎవరికీ సదాభిప్రాయం లేదు. దీంతో రోమ్ కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చుకున్నాడు అని అందరూ వ్యంగ్యంగా అనుకున్నారు.
ఫిడేల్ కాదు.. సితార
అయితే రోమ్ కాలిపోతున్నప్పుడు నీరో ఏం చేస్తున్నాడనే దానిపై పలు వాదనలు ఉన్నాయి. నిజానికి ఫిడేల్ ఆ కాలంలో లేదు. ఇది 11వ శతాబ్దంలో ఆవిష్కరించబడిన సంగీత వాయిద్యం. కాబట్టి నీరో చక్రవర్తి ఫిడేల్ను కాదు. సితార వంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఉండొచ్చని.. కాలక్రమంలో దాన్ని ఫిడేల్గా పలికి ఉంటారని కొందరు చెబుతున్నారు. లేదు.. లేదు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించలేదు.. ట్రాయ్ (ఇప్పటి టర్కీలోని హిసర్లిక్) నగరం కాలిపోవడంపై రచించిన ఓ పాట పాడుతూ కూర్చుకున్నాడు అని మరికొందరు పేర్కొంటున్నారు. మరికొందరైతే నీరో చక్రవర్తే రోమ్కు నిప్పంటించాడని, ఇళ్లన్ని నేలమట్టం అయిన తర్వాత తన గోల్డెన్ హౌస్ (డోమస్ అరియా)ను నిర్మించుకున్నాడని వాదించారు. అందుకే ప్రజలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చొన్నాడు’అని వ్యాఖ్యానించేవారట. అయితే అసలు నిజాన్ని ఆధారాలతో నిరూపించలేకపోయినా ఈ జాతీయం మాత్రం జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
ఫిడేల్ వాయించలేదు.. పాట పాడలేదు
కానీ ప్రముఖ రోమన్ చరిత్రకారుడు టాసిటస్ చెప్పిన ప్రకారం.. రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో రోమ్కు 35 కి.మీ దూరంలో ఉన్న అంటియమ్లోని తన భవంతిలో ఉన్నాడట. అగ్నిప్రమాదం గురించి తెలుసుకొని వెంటనే రోమ్కు వెళ్లి సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నాడట. మంటలు అదుపులోకి వచ్చాక నిరాశ్రయులైన వారందరికి తన రాజ భవనాల్లో ఆశ్రయం కల్పించాడని టాసిటస్ పేర్కొన్నారు. ఫిడేల్ వాయించాడు అనడానికి గానీ, పాట పాడాడు అనడానికి గానీ ఎలాంటి సాక్ష్యాలు లేవని టాసిటస్ అన్నారు. మంటలకు భవనాలు నేలమట్టమైన ప్రాంతంలో నీరో.. డోమస్ అరియా పేరుతో పెద్ద భవన సముదాయాన్ని నిర్మించాడు. రోమ్లో ఇప్పటికీ డోమస్ అరియా కట్టడం ధ్వసంమైన స్థితిలో కనిపిస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు