ఇండియన్ టిక్టాక్ ‘మిత్రోన్’ కహానీ
కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు సినిమాలు, వినోదం, పర్యాటకానికి దూరమయ్యారు. అదే సమయంలో చిన్న నిడివి గల వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’కు బాగా ఆకర్షితులయ్యారు. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో ఉన్న సినిమాలను చూసేయడం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు సినిమాలు, వినోదం, పర్యాటకానికి దూరమయ్యారు. అదే సమయంలో చిన్న నిడివి గల వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’కు బాగా ఆకర్షితులయ్యారు. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో ఉన్న సినిమాలను చూసేయడం.. కొత్త సినిమాలు రాకపోవడంతో చాలా మంది టిక్టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకూ టిక్టాక్ వీడియోలు చేయడంలో మునిగి తేలిపోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టిక్టాక్కు భారత్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి ఒక కారణం టిక్టాక్ చైనాకు చెందిన యాప్ కావడం. భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, స్వదేశీ వస్తువులను వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు వంటివి మరో కారణాలు. ఇదే సమయంలో టిక్టాక్ను పోలిన ‘మిత్రోన్’ అనే యాప్ తెరమీదకొచ్చింది. యాప్నకు యూజర్లు క్రమంగా పెరుగుతున్నారు. అంతలోనే ‘మిత్రోన్’ గూగుల్ ప్లేస్టోర్లో మాయమైంది. ఈ నేపథ్యంలో ‘మిత్రోన్’ కహానీ గురించి చర్చ మొదలైంది.
టిక్టాక్కు డూప్లికేట్లా ‘మిత్రోన్’
గత కొన్ని రోజులుగా మిత్రోన్ యాప్నకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి విపరీతంగా డౌన్లోడ్లు పెరిగాయి. దీనికి కారణం మిత్రోన్ను ఒక ఐఐటీ విద్యార్థి అభివృద్ధి చేశాడని తెలియడం. అయితే దీని వెనుక చాలా స్టోరీనే ఉంది. మిత్రోన్ యాప్లో వాడే సోర్స్ కోడ్ పాకిస్థాన్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ క్యూబాక్స్ చెందినది. ఈ కంపెనీ అచ్చం టిక్టాక్ను పోలిన యాప్ ‘టిక్టిక్’ను అభివృద్ధి చేసింది. అనంతరం టిక్టిక్ యాప్లో ఉపయోగించిన సోర్స్ కోడ్ను అమ్మకానికి పెట్టింది. దీంతో ఆ ఐఐటీ విద్యార్థి సోర్స్ కోడ్ను కొని ‘మిత్రోన్’ అనే పేరుతో యాప్ను అభివృద్ధి చేశాడు. ఇది సేమ్ టిక్టాక్ యాప్నకు డూప్లికేట్లా ఉండడం.. అవే ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఇందులోనూ ఉండడంతో యువతను ఇట్టే ఆకర్షించింది. దీనికి తోడు స్వదేశీ ఉత్పత్తులను వాడాలని మోదీ కోరడం.. చైనాపై వ్యతిరేకత కారణంగా అనతికాలంలోనే మిత్రోన్ పేరు మారుమోగింది.
యాప్ ప్రైవసీలో లోటుపాట్లు
టిక్టాక్కు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న మిత్రోన్కు ఆదిలోనే చిక్కులు ఎదురయ్యాయి. యాప్నకు సంబంధించి సోర్స్ కోడ్ పాకిస్థాన్లో అభివృద్ధి కావడం.. యాప్ ప్రైవసీలో లొసుగులు ఉండడం ప్రతికూలంగా మారాయి. దీనికి తోడు మిత్రోన్ యాప్ ద్వారా భారతీయుల వ్యక్తిగత సమాచారం దొంగిలించే వీలుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యూజర్లు డైలమాలో పడ్డారు. ఫలితంగా ఫుల్ స్వింగ్లో ఉన్న మిత్రోన్కు ఓ స్పీడ్ బ్రేకర్ బ్రేక్ వేసినట్లయింది. టిక్టాక్తో పోలిస్తే మిత్రోన్లో భద్రతా పరమైన అంశాలు సరిగా లేవని తేలడంతో లోపాన్ని సరిదిద్దుకునేందుకు మిత్రోన్ చర్యలు మొదలుపెట్టింది.
అంతలోనే ప్లేస్టోర్లో మాయం
మిత్రోన్ తన లోటుపాట్లను సరిచేసుకునే క్రమంలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాయమైంది. టిక్టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మిత్రోన్ ప్లేస్టోర్లో లేకపోవడంతో యూజర్లు ఒకింత షాక్కు గురయ్యారు. మళ్లీ టిక్టాక్కు యూజర్లు రూటు మార్చుకున్నారు. తన రూల్స్కు వ్యతిరేకంగా మిత్రోన్ యాప్ ఉందంటూ దీన్ని ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో ఓ వెలుగు వెలుగుపోతుందనుకున్న మిత్రోన్ కథ అంతలోనే ముగిసిపోయింది. మరోవైపు కరోనా వైరస్కు కారణం చైనా అంటూ ప్రపంచమంతా కోడై కూయడం, ఇండియన్ మేడ్ వస్తువులను వాడాలంటూ ప్రచారం జోరుగా సాగతున్న తరుణంలో ‘రిమూవ్ చైనా యాప్స్’ పేరిట మరో యాప్ పుట్టుకొచ్చింది. దీంతో ఈ యాప్కు కూడా విపరీతంగా డౌన్లోడ్లు పెరిగాయి. మళ్లీ తన పాలసీకి ‘రిమూవ్ చైనా యాప్స్’ అప్లికేషన్ విరుద్ధంగా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గూగుల్ డిలీట్ చేసేసింది. అలా ‘మిత్రోన్’, ‘రిమూవ్ చైనా యాప్స్’ అప్లికేషన్ల కథ కంచికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..