వీటిని ‘గూగుల్’ చేస్తే .. మీకు ట్రబుల్!
జిజ్ఞాస.. ఈ పదం వింటే కొంచెం కొత్తగానే ఉంటుంది. ఈ డిజిటల్ యుగంలో తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. ఇలా తెలుసుకోవాలనే తపననే జిజ్ఞాస అంటారు.
ఇంటర్నెట్డెస్క్: స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ మనకు అందుబాటులోకి రాకముందు బామ్మలు చెప్పే కథలు, గురువులు చెప్పే పాఠాలు వింటూ జ్ఞానాన్ని సంపాదించేవాళ్లం. ఏ మాత్రం సందేహమొచ్చిన ఒకటికి పదిసార్లు అడిగి తెలుసుకోవటం అప్పటి అలవాటు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. మనకు కావాల్సిన అన్ని విషయలూ అరచేతిలోని స్మార్ట్ఫోన్లోనే సాక్షాత్కారిస్తున్నాయి. ఏదైనా కొత్త విషయం తెలియకపోయినా, సందేహం కలిగిన వెంటనే సెర్చ్ ఇంజన్ గూగుల్లో వెతకాల్సిందే. కానీ కొన్ని విషయాలను తెలుసుకోవాలనే మీ జిజ్ఞాస మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి..
బాంబ్ తయారీ.. మీపై గురి
బాణసంచా, పేలుడు పదార్థాల తయారీ గురించి కొందరికి అమితాసక్తి ఉంటుంది. అవి ఎలా పనిచేస్తాయి? వాటిలో వాడే పదార్థాలేంటి.. ఇలా ఇతరత్ర విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ చేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. సెర్చ్ ఇంజన్ గూగుల్లో కొన్ని పదాలను సెర్చ్ చేస్తే వారిపై సైబర్ డిపార్ట్మెంట్ ఓ కన్ను వేసి ఉంచుతుంది. ఎందుకంటే బాంబులు, పేలుడు పదార్థాలను ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతుంటారు. కొందరు తెలివిగా సైబర్ పోలీసులకు చిక్కకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని గూగుల్ నుంచి తస్కరిస్తుంటారు. ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలానే బాంబుల తయారీ గురించే తెగ వెతికాడు. చివరికి పోలీసుల వలలో పడ్డాడు. ఇలాంటి ప్రమాదంలో మీరూ పడకండి.
మహిళల ప్రసవం..
ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా మహిళల ప్రసవానికి సంబంధించిన సన్నివేశాలు కనపడుతున్నాయి. కథా పరంగా ఆ సన్నివేశం అనివార్యం కావచ్చు. అయితే అదే సందర్భంలో కొందరు మహిళల ప్రసవానికి సంబంధించిన విషయాలను తెగ గూగుల్ చేస్తున్నారట. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదే. కానీ కొన్ని విషయాలను అతిగా పట్టించుకోకూడదు. అది మీకు మానసికంగా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ప్రసవ సమయంలో మహిళ పడే వేదన మాటల్లో వర్ణించలేం. అంతటి ఇబ్బందికరమైన విషయాన్ని గూగుల్ చేసి మీ మానసిక స్థితిపై ఒత్తిడి పెంచుకోకండి.
మాదక ద్రవ్యాలు.. మారేను మీ గమ్యాలు
పెద్దలు హంసలాంటి గుణాన్ని పెంపొందించుకోవాలని పిల్లలకు చెబుతుంటారు. హంస పాలను నీళ్లను వేరు చేస్తుందంటారు. అలానే హంసలాగా చెడును వదిలి మంచిని అలవరుచుకుంటేనే సంఘంలో గౌరవంతోపాటు ఇబ్బందులు లేని జీవితం సొంతమవుతుంది. ప్రస్తుతం యువత పెడదోవ పట్టడానికి ఒక కారణం మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వాడకం. డ్రగ్స్ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే కొందరు డ్రగ్స్ తయారీ విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ను ఆశ్రయించి చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ తయారీ గురించి గూగుల్లో తెలుసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే అనవసర విషయాలపై సెర్చింగ్ ఒక్కోసారి మీ జీవిత గమ్యాలను కూడా తారుమారు చేస్తుంది.
మరికొన్ని..
పై విషయాలతోపాటు మరికొన్ని పదాలను గూగుల్లో సెర్చ్ చేయకపోవడమే మంచిది. అవేంటంటే బెడ్ బగ్స్, బెల్లీ బటన్ బగ్స్, హంట్స్మ్యాన్ స్పైడర్, బ్లూ వాఫెల్, క్రొకొడిల్, జిగ్గర్స్, మౌత్ లార్వా, బాట్ప్లై రిమూవల్ వంటి వాటిని గూగుల్లో వెతకకండి. ఎందుకంటే ఇవి చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. ఆసక్తి మంచిదే కానీ కొన్నిసార్లు అమితాసక్తి మంచిదికాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ సందేహమొచ్చిన గూగుల్ చేసే ఈ రోజుల్లో కొన్ని విషయాల సెర్చింగ్ చేయాలంటే మాత్రం కాస్త ఆలోచించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్