ఉత్తర కొరియాలో నిషేధం కొత్త కాదు
ఉత్తర కొరియా.. ఓ నియంత పాలనలో నలిగిపోతున్న దేశం. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ వేదం. స్వీయ రక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలనైన తీసుకునే కిమ్.. దేశం, దేశ పౌరులు పరాయి దేశం వల్ల ప్రభావితం కావడాన్ని అసలు సహించడు. ఇటీవల కాలంలో దక్షిణ కొరియాకు
ఉత్తర కొరియా.. ఓ నియంత పాలనలో నలిగిపోతున్న దేశం. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ వేదం. స్వీయ రక్షణ కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలనైనా తీసుకునే కిమ్.. దేశం, దేశ పౌరులు పరాయి దేశం వల్ల ప్రభావితం కావడాన్ని అసలు సహించరు. ఇటీవల కాలంలో దక్షిణ కొరియాకు చెందిన కొందరు కిమ్కు వ్యతిరేకంగా కరపత్రాలను గాలిబుడగలకు కట్టి వదులుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశంలో తనపై వ్యతిరేకత పెరిగే అవకాశముందని గ్రహించిన కిమ్.. దక్షిణ కొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇకపై దక్షిణ కొరియాతో సమాచార మార్పిడిని నిషేధిస్తూ కిమ్ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో దక్షిణకొరియాతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా తన దేశ పౌరులపై ఇతర దేశాల సంస్కృతీ ప్రభావం పడకూడదని ఇప్పటికే దేశంలో అనేక నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. అవేంటో మీరే చదవండి..
టీవీ.. ఫారెన్ రేడియో
విదేశీ వార్తలు.. సంస్కృతి దేశంలోకి రాకుండా టీవీ, ఫారెన్ రేడియోలపై కిమ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మధ్య కాలంలో చాలా మందికి టీవీ చూసే వెసులుబాటు లభించింది. అయితే ఉత్తర కొరియా మీడియా వార్తలు మాత్రమే వారు చూడాలి. అలా కాకుండా విదేశీ వార్తలు, సినిమాలు చూసినా.. ఫారెన్ రేడియోను విన్నా చట్టరీత్య అవి నేరం.
పాశ్చాత్య దుస్తులు
ఉత్తర కొరియాలో ప్రజలు పాశ్చాత్య దుస్తులు ధరించడం నిషేధం. బ్లూజీన్స్, డిజైనర్ షూస్, షార్ట్ స్కర్ట్స్ వంటివి వేసుకోవడం నేరంగా భావిస్తారు. చైనాకు సరిహద్దుగా ఉన్న ఉత్తర కొరియా ప్రావిన్స్లు నార్త్ హమ్యాంగ్, యాంగాంగ్పై చైనా ప్రభావం ఎక్కువగా పడుతుందట. అక్కడి వారికి చైనా సంస్కృతి, విదేశాల సమాచారం ఎక్కువగా తెలుస్తుంటాయట. అందుకే దేశంలో ఈ పాశ్చాత్య దుస్తులను కిమ్ ప్రభుత్వం నిషేధించింది.
కోక కోలా.. దొరకదు అన్ని చోట్లా
కొకకోలా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమ్ముడయ్యే శీతల పానీయం. కానీ ఉత్తర కొరియాలో ఈ కూల్డ్రింక్ అమ్మకాలపై నిషేధించారు. విదేశీ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించడానికి కిమ్ ఇష్టపడరు. అందుకే దేశంలో కొకకోలాని నిషేధించారు. దీని ప్రత్యమ్నాయంగా ర్యాంగ్జిన్ కోలా పేరుతో శీతలపానీయాన్ని అమ్ముతున్నారు. కొన్ని చోట్ల కొకకోలాను దొంగచాటుగా అమ్ముతుంటారు.
కిమ్ చెప్పిందే హెయిర్స్టైల్
ప్రపంచదేశాల్లో కాలంతోపాటు హెయిర్ స్టైల్స్ మారుతూ వస్తున్నాయి. ఓ దేశంలో పుట్టిన హెయిర్స్టైల్ మరో దేశంలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు హెయిర్స్టైల్ చేసుకునే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఉత్తర కొరియాలో విదేశీ హెయిర్స్టైల్స్ పూర్తిగా నిషేధం.. దేశంలో జుట్టు పెంచుకోవడంపై నిబంధనలు ఉన్నాయి. ఆడవాళ్లు జుట్టును ఎప్పుడు చిన్నగా కత్తిరించుకోవాలి. మగవాళ్లు జుట్టును రెండు అంగుళాలకు మించి పెంచకూడదు. కిమ్ ఆమోదించిన కొన్ని రకాల హెయిర్స్టైల్స్నే పౌరులు చేయించుకోవాలి.
కండోమ్స్ వాడితే.. నేరమే
గర్భనిరోధక సాధనాలు వినియోగించడం ఉత్తరకొరియాలో నిషేధం. దేశంలో కుటుంబ నియంత్రణ అనేది లేదు. పౌరులు ఎక్కువ మందిని పిల్లలను కనడం ద్వారా దేశ జనాభా పెరగడంతోపాటు.. కార్మికుల సంఖ్య పెరుగుతుందని కిమ్ యోచన.
నో మ్యాగజైన్స్
దేశంలో మీడియా ప్రచురించే ప్రతి వార్తను ప్రభుత్వం, ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది. పౌరులపై పాశ్చత్య దేశాల ప్రభావం పడకుండా విదేశీ లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్లను నిషేధించారు. దేశంలో కొన్ని స్థానిక మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. అయితే అవి కేవలం విద్య, దేశీయ రాజకీయ అంశాలను మాత్రమే ప్రచురిస్తాయి.
విదేశీ ఆహారానికి అనుమతి లేదు
స్టార్బక్స్.. మెక్ డొనాల్డ్స్ వంటి ప్రముఖ కాఫీ, ఫుడ్ స్టోర్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. కానీ వీటికి ఉత్తర కొరియాలో అనుమతి లేదు. వీటినే కాదు.. విదేశీ ఫుడ్కోర్ట్లు వేటినీ దేశంలో ఏర్పాటు కానివ్వలేదు. అయితే ఆ దేశంలో ర్యాంగ్వాంగ్ పేరుతో కాఫీ కెఫెలో అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఈ కాఫీ ఫేమస్.
లోకల్ ఐపాడ్లే కొనాలి
విదేశాల్లో తయారయ్యే హైటెక్ డివైజ్ల అమ్మకాలపై ఉత్తర కొరియాలో ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా యాపిల్ ప్రొడెక్ట్స్పై నిషేధముంది. యాపిల్ ఐపాడ్కు ప్రత్ర్యామ్నాయంగా ఆ దేశంలో ట్యాబ్లెట్ పీసీ పేరుతో ఐపాడ్లను తీసుకొచ్చారు.
ఇంటర్నెట్.. విదేశీ కాల్స్ కట్
ప్రపంచాన్ని ఏకం చేసే ఇంటర్నెట్, అంతర్జాతీయ కాల్స్ ఉత్తర కొరియాలో నిషేధం. విదేశీ సమాచారాలు ఎక్కడా కనిపించకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్ కంట్రోల్ ఇంటర్నెట్’ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీనిని మాత్రమే వాడుకోవాలి. దేశంలో అతి తక్కువ మందికి మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఫోన్లో వాడే 3జీ ఇంటర్నెట్పై కూడా ఆంక్షలు ఉన్నాయి. పర్యాటకులు ఆ దేశానికి వెళ్తే అక్కడ ప్రత్యేకంగా ఓ సిమ్ కొని అంతర్జాతీయ కాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
విదేశీ సంగీతం వద్దు.. దేశీయమే ముద్దు
అంతర్జాతీయంగా పాప్ సంగీతానికి ఎంతో ఆదరణ ఉంటుంది. దక్షిణ కొరియాలో కే-పాప్ మ్యూజిక్ కన్సర్ట్స్ సంగీత ప్రియులను ఊర్రూతలూగిస్తాయి. కానీ ఇలాంటి పాప్ సంగీతాన్ని ఉత్తర కొరియా దగ్గరకు కూడా రానివ్వద్దు. అయితే దేశీయంగా మొరన్బ్యాంగ్ అనే బ్యాండ్ వినోదాన్ని పంచుతోంది. ఆ బ్యాండ్లో ఆడి.. పాడే అమ్మాయిలను స్వయంగా ఆ దేశాధ్యక్షుడు కిమ్ ఎంపిక చేస్తాడట.
విదేశీ యాత్రలు నిషేధం
దేశ పౌరులకు విదేశీ సంస్కృతే తెలియకుండా చేసిన కిమ్ ప్రభుత్వం.. ఇక విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తుందా? అక్కడి పౌరులు విదేశీ యాత్రలకు వెళ్లడం పూర్తిగా నిషేధం. అక్కడి ప్రజలు ఆ దేశం దాటి ఎక్కడికి వెళ్లకూడదు. కేవలం దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే దేశంలో బానిసత్వం భరించలేక కొందరు సొరంగ, రహస్య మార్గాల ద్వారా దక్షిణ కొరియా, చైనాకు పారిపోతుంటారు.
ఇవే కాదు.. పర్యాటకులు కొన్ని ప్రదేశాలను ఫొటో తీయడం, స్థానిక కరెన్సీ నోట్లను కలిగి ఉండటం కూడా నిషేధం. ఎవరైనా కిమ్పై వ్యంగ్యంగా మాట్లాడటం. బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడటం, చెవులకు పోగులు పెట్టుకోవడం వంటివి దేశంలో నేరంగా భావిస్తారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు