ఈ బూట్లు ధరిస్తే.. సామాజిక దూరం పాటించినట్లే!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో వైరస్ను అరికట్టేందుకు మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా సామాజిక దూరం కూడా పాటిస్తున్నాం. అయితే కొందరు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. దుకాణాలు
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో వైరస్ను అరికట్టేందుకు మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా సామాజిక దూరం కూడా పాటిస్తున్నాం. అయితే కొందరు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. దుకాణాలు వద్ద కొంత మంది సామాజిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగా నిలుచుంటున్నారు. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు రొమానియాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న బూట్లు రూపొందించాడు. ఇవి వేసుకున్న వ్యక్తులు కచ్చితంగా సామాజిక దూరం పాటించేస్తారు.
గ్రిగొర్ లుప్ ఓ చెప్పుల వ్యాపారి. లాక్డౌన్కు ముందు వరకు థియేటర్ ఆర్టిస్టులు, జానపద కళాకారులు తదితరులు ఆయన వద్దకు వచ్చి పెద్ద ఎత్తున చెప్పులు, బూట్లు ఆర్డిరిచ్చేవాళ్లు. దీంతో ఆయన వ్యాపారం బ్రహ్మండంగా సాగేది. అయితే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఆయన దుకాణం మూతపడింది. వ్యాపారమూ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ కేవలం నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారట. అయితే లాక్డౌన్ నిబంధన ప్రకారం నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలి. కానీ అక్కడి ప్రజలు ఆ నిబంధనను పాటించకపోవడం లుప్కి ఆందోళన కలిగించింది. దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని భావించిన లుప్ తన వృత్తి నైపుణ్యానికి పని చెప్పాడు. యూరప్ బూట్ల కనీసం సైజు 40 (24సె.మీ) కాగా.. వాటి సైజును 75 (46 సె.మీ)కి పెంచాడు. అంటే బూటు మొదలు భాగాన్ని పొడిగించాడు. దాని వల్ల ఆటోమేటిక్గా ఇద్దరు వ్యక్తలు మధ్య దూరం పెరుగుతుంది. తాజాగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ బూట్లు వైరల్గా మారాయి. ఈ ఒక జత బూట్లు తయారు చేసేందుకు లుప్కి రెండ్రోజులు పడుతోందట. ఇప్పటికే లుప్కి ఈ పొడవాటి బూట్లు కావాలని ఐదు ఆర్డర్లు వచ్చాయి. వీటి ధర 115 డాలర్లు (సుమారు రూ. 9 వేలు)అని లుప్ చెప్పుకొచ్చాడు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్