Sahayata Wheelchair: స్మార్ట్ వీల్ఛైర్తో రూ.కోటి ఫండింగ్.. తమిళనాడు యువతి సత్తా
బ్యాటరీతో పని చేసే ఓ వీల్ ఛైర్ను శ్రుతి బాబు అనే మహిళ రూపొందించారు. వయో వృద్ధులు, వికలాంగులకు ఈ ‘సహాయత ఛైర్’ (Sahayata Wheelchair) బాగా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 27 ఏళ్ల శ్రుతి బాబు తన వినూత్న ఆవిష్కరణతో సత్తా చాటింది. వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారికి, మరుగుదొడ్డికి వెళ్లలేక ఇబ్బంది పడేవారికి అన్ని విధాలుగా సహాయపడేలా ‘సహాయత’ పేరుతో స్మార్ట్ వీల్ఛైర్ (Sahayata Wheelchair)ను రూపొందించి రూ.కోటి ఫండింగ్ గెల్చుకుంది. ఉత్తమ అంకుర సంస్థల ఆలోచనలకు నిధులు అందించి అండగా నిలిచే ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ (Sharktank India) కార్యక్రమంలో తన ఆవిష్కరణను ప్రదర్శించి మెప్పించింది.
బయో మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చదివిన శ్రుతి 2018లో మెడికల్ కోడర్గా పనిచేసేది. ఓ సామాజిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెలోషిప్ చేసే అవకాశం ఆమెకు వచ్చింది. అందులో భాగంగా ఓసారి కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన ఓ దృశ్యం ఆమెను వెంటాడింది. పక్షవాతం బారిన పడిన ఓ వ్యక్తి స్ట్రెచర్పైనే మల విసర్జన చేశాడు. ఆ సమయంలో అతడికి తోడుగా తన ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. తనను శుభ్రం చేసుకోవడానికి వీలు కాక అతడు సహాయం కోసం కుమార్తెల వైపు చూశాడు. అప్పుడు ఆ అమ్మాయిల ఇబ్బందికర పరిస్థితి, అది చూసి వారి తండ్రి ముఖంలో అవమాన భారం, ఈ పరిస్థితి రావడం కన్నా చావడం మేలంటూ అతడు కన్నీళ్లు పెట్టుకోవడం శ్రుతి గమనించింది.
నడవడానికి వీలుకాని ఎంతోమంది నిత్యం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను, అవమానాలను ఎదుర్కొంటూ జీవిస్తున్న విషయం ఆమెను ఆలోచింపజేసింది. వారు గౌరవంగా జీవించగలిగేలా ఏం చేయొచ్చని అన్వేషించింది. అదే స్మార్ట్ వీల్ఛైర్ ఆవిష్కరణకు నాంది పలికింది. సులువుగా వినియోగించగలిగే, సౌకర్యవంతమైన చక్రాల కుర్చీని రూపొందించడానికి ఎంతో పరిశోధన చేసింది. మెకానికల్ ఇంజినీర్ అయిన తన తండ్రి కె.కె.బాబు సహాయం కూడా తీసుకుంది. చివరకు 118 నమూనాల తర్వాత తాను అనుకున్న స్మార్ట్ వీల్ఛైర్కు రూపం ఇచ్చింది. ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికే కాదు, అవసరమైతే స్టెచర్లా, మలమూత్ర విసర్జనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యంత్రం సహాయంతో శుభ్రమయ్యే టాయిలెట్ సౌకర్యమున్న ఈ వీల్ఛైర్కు ‘సహాయత’ అని శ్రుతి పేరు పెట్టింది.
ఎలా పనిచేస్తుంది?
ఈ వీల్ఛైర్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బటన్ నొక్కితే సీటు మధ్య భాగం పక్కకు జరిగి కమోడ్లా మారుతుంది. కింద భాగంలో అమర్చిన ఓ కప్పు లాంటి పాత్రలోకి మానవ వ్యర్థాలు వెళ్లే ఏర్పాటు ఉంది. ఆ పాత్రను కూర్చున్నవారికి ఇబ్బంది కలగకుండానే చక్రాల కుర్చీ వెనుక నుంచి బయటకు తీయొచ్చు. అనంతరం మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా శుభ్రం చేయడానికి వీలుగా ఓ నీటి నిల్వ పాత్రను, యంత్రాన్ని అనుసంధానం చేశారు. ఇందుకోసం ‘బైడెట్’ అనే జపనీస్ విధానాన్ని పాటించారు. ఈ చక్రాల కుర్చీ వల్ల మరుగుదొడ్డి వరకూ వెళ్లాల్సిన ఇబ్బంది, సహాయకుల అవసరం తప్పుతుంది. దీంతోపాటు స్ట్రెచర్లా మారే సదుపాయం ఉండటం వల్ల రోగులు దీనిపై నుంచి బెడ్ మీదకు సులువుగా మారొచ్చని శ్రుతి చెబుతోంది. ఈ వీల్ఛైర్కున్న బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు నెల రోజులు పనిచేస్తుందని చెప్పింది.
షార్క్ ట్యాంక్లో అనూహ్య స్పందన
ఓ ఛానల్లో ప్రసారమైన ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ రెండో సీజన్లో ఆమె ఇటీవల తన ‘సహాయత’ స్మార్ట్ వీల్ఛైర్ను ప్రదర్శించింది. న్యాయనిర్ణేతలైన వ్యాపారవేత్తలు అమిత్ జైన్, అమన్ గుప్తా, అనుపమ్ మిత్తల్ తదితరులు ఆ ఆవిష్కరణ చూసి ఆశ్చర్యపోయారు. శ్రుతి ఆలోచన నచ్చి వీల్ ఛైర్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు 10 శాతం ఈక్విటీలో రూ.కోటి పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. శ్రుతి తన సొంత వెబ్సైట్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో ఆ వీల్ఛైర్లను విక్రయిస్తోంది. స్ట్రెచర్ సౌకర్యమున్న వీల్ ఛైర్ను రూ.39,900కు వినియోగదారులకు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ