Reverse Death: అంత్యక్రియలొద్దు.. మాకివ్వండి.. ఏదో ఒక రోజు ప్రాణం పోస్తాం..!
వైద్య రంగం సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందుతోన్న నేపథ్యంలో చనిపోయిన వారికి భవిష్యత్తులో ప్రాణం పోసే (Resurrect Humans) అవకాశాలు లేకపోలేదని జర్మనీకి చెందిన ఓ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో క్రయోప్రిజర్వేషన్ (Cryopreservation) పద్ధతిలో ఇప్పటికే పది మృతదేహాలను భద్రపరచినట్లు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: చనిపోయిన వారికి పునర్జన్మ అనే మాట వింటూనే ఉంటాం. కానీ, శాస్త్రీయంగా అది సాధ్యం కాదని వైద్యరంగం శాస్త్రీయ ఆధారాలతో రుజువు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో చనిపోయిన వారికి పునర్జన్మ (Resurrect Humans) కల్పించడంపై ఓ జర్మన్ వైద్య బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని మృతదేహాలను అత్యంత శీతల వాతావరణంలో (Cryopreservation) భద్రపరుస్తోంది. భవిష్యత్లో వైద్య విజ్ఞానం మరింత అభివృద్ధి చెంది వ్యక్తుల మరణానికి గల కారణం తెలుసుకొని, చికిత్స చేస్తే వారిని మళ్లీ బతికించవచ్చని చెప్పడంతో వందల సంఖ్యలో దాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం.
వైద్యరంగంపై ఆశలు..
ప్రాణం పోయిన తర్వాత అవయవాలను తిరిగి పునరుద్ధరించడం వంటి పరిశోధనలు అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకోసం మృతదేహాలను దానం చేయడం ఐరోపాలో క్రమంగా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. జర్మనీలోని బెర్లిన్కు చెందిన టుమారో బయోస్టాసిస్ (Tomorrow Biostasis) స్టార్టప్ సంస్థ కూడా ఇదే చేస్తోంది. వైద్య రంగంలో సాంకేతికత అభివృద్ధి చెందుతోన్న నేపథ్యంలో భవిష్యత్తులో పరిశోధనలు ఫలిస్తే.. ఇలా భద్రపరచిన మృతదేహాలకు ఏదో ఒకరోజు పునర్జన్మ కల్పించడం సాధ్యమని చెబుతోంది. ఈ క్రమంలో వైద్య రంగంలో పురోగతి సాధించిన తర్వాత వారి మరణానికి కారణాలకు అనుగుణంగా చికిత్స చేసి తిరిగి మునుపటిలా జీవించేలా చేయాలన్నది తమ ప్రయత్నమని పేర్కొంది. ఇందుకోసం మృతదేహాలను అత్యంత శీతల వాతావరణం ఉండే క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరుస్తోంది.
పెరుగుతోన్న దాతలు..
సుదీర్ఘ కాలం నిల్వ చేసేందుకు స్విట్జర్లాండ్లోని రాఫ్జ్ పట్టణంలోని ఉన్న యూరోపియన్ బయోస్టాసిస్ ఫౌండేషన్కు తరలిస్తోంది. శిక్షణ, పరిశోధన కోసం ఇప్పటికే పది మృతదేహాలను క్రయోప్రిజర్వేషన్ విధానంలో భద్రపరచినట్లు సంస్థ ప్రతినిధి కెండ్జయోరా పేర్కొన్నారు. ఇంకా వందల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారని.. తమ క్లయింట్లలో సరాసరి 36ఏళ్ల వయసున్న వారే ఎక్కువని చెప్పారు. వీరిలో మెదడును భద్రపరచుకోవాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోందని.. భవిష్యత్తులో 3డీ ప్రింటెడ్ శరీరాన్ని రూపొందించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఏమిటీ క్రయోప్రిజర్వేషన్..?
శరీర అవయవాలను తిరిగి ఉపయోగించేందుకు వీలుగా అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచే విధానాన్ని క్రయోప్రిజర్వేషన్గా వ్యవహరిస్తారు. క్రయోప్రిజర్వేషన్ విధానంలో కణాలు, కణజాలంతోపాటు మెదడును కూడా భద్రపరచడం సాధ్యమే. అవయవాలను తొలుత మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరుస్తారు. అనంతరం ద్రవ నైట్రోజెన్తో కూడిన ఇన్సులేటెడ్ ట్యాంకులో ఉంచి భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని వినియోగించడం లేదా పరిశోధనకు ఉపయోగిస్తారు. అయితే, ఈ విధానంలో శరీర అవయవాలను భద్రపరచడం సాధ్యమే అయినప్పటికీ.. జీవంలేని అవయవాలను ఎలా పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాకుండా మృతదేహానికి తిరిగి ప్రాణం పోయడమనే విషయంపైనా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?