ఆ ఒక్కడే లేకపోతే..మూడో ప్రపంచయుద్ధమే!
ఒక్కోసారి పొరపాటున తీసుకున్న నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతాయ్. రెండు దేశాల మధ్య స్నేహం నశించి.. శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తే అగమ్యగోచరమయ్యే ప్రమాదముందనడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన...
ఒక్కోసారి దూకుడుగా తీసుకొనే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే నిర్ణయాలు తీసుకొనే ముందు ఆచీతూచీ వ్యవహరించమని చెబుతారు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తే అగమ్యగోచరమయ్యే ప్రమాదముందనడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఓ ఘటనే ఉదాహరణ..!
రెండో ప్రపంచం యుద్ధం మొదట్లో అమెరికా తటస్థంగా ఉండిపోయింది. కానీ చివర్లో ఇంగ్లాండ్, సోవియట్యూనియన్... తదితర దేశాలతో కలిసి అక్షకూటమిపై పోరాడింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య దూరం పెరిగింది. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమెరికా సమీపంలో ఉన్న క్యూబాపై పట్టు సాధించాలని రెండు అగ్రరాజ్యాలూ ప్రయత్నిస్తుండేవి. అయితే క్యూబా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది.
అది 1962 అక్టోబర్ 27.. సోవియట్ యూనియన్కు చెందిన బి-29 జలాంతర్గామి క్యూబాకు సమీపంలోకి వెళ్లింది. అందులో సీనియర్ ఆఫీసర్గా అలెగ్జాండ్రోవిచ్ అర్కిపోవ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జలాంతర్గామి క్యూబాకు సమీపంలోకి వచ్చిందన్న విషయం అమెరికా సేనలకు తెలిసింది. దానిని నీటి తరంగాల ఒత్తిడికి గురిచేసి ఉపరితలంపైకి తెప్పించేందుకు డెప్త్ఛార్జర్లు (హైడ్రాలిక్ షాక్ సృష్టించేవి) వేసి బెదిరించడం మొదలుపెట్టారు. అంతే.. అందులో ఉన్న అలెగ్జాండ్రోవిచ్ అర్కిపోవ్, మరోసీనియర్ అధికారి వేలింటిన్ సావింట్స్కై, జలాంతర్గామి కెప్టెన్ ముగ్గురూ అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఎదురుదాడికి దిగొచ్చని సోవియట్ ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు కూడా జారీ చేసింది.
దీంతో అందులో ఉన్న ఇద్దరు అధికారులు ఎదురుదాడికి సిద్ధమైపోయారు. మూడో ప్రపంచయుద్ధం తమతోనే మొదలవుతుందని భావించారు. కానీ, వాళ్లతో సమాన హోదాలో ఉన్న అలెగ్జాండ్రోవిచ్ అర్కిపోవ్ మాత్రం ఇందుకు నిరాకరించాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరనిదే ఆపరేషన్లో ముందుకెళ్లడం సాధ్యంకాదు. దీంతో జలాంతర్గామి కెప్టెన్ వెనక్కి తగ్గాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో అర్కిపోవ్ ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. ఒక వేళ ఆ రోజు అమెరికా సేనలపై ఎదురుదాడి జరిగితే.. ప్రపంచ పరిణామాలు మారిపోయేవి. ఎందుకంటే అందులో పది కిలోటన్నుల విస్ఫోటం సృష్టించే న్యూక్లియర్ టార్పెడో ఉంది. ఒక్క బటన్ నొక్కితే చాలు అది అమెరికా సేనలు ఉన్నచోట సముద్రంలో సునామీ సృష్టిస్తుంది. దాని రేడియేషన్ ప్రభావం భవిష్యత్ తరతరాల వారిపైనా పడుతుంది. అమెరికా వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమే. అయితే, ఆ జలాంతర్గామిలో న్యూక్లియర్ టార్పెడో ఉందన్న విషయం అమెరికా సేనలకు అప్పటికి తెలియదు. ఆ తర్వాత తెలుసుకొని ఖంగుతిన్నాయి.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రపంచ భవిష్యత్ గురించి ఆలోచించి ఉన్నత నిర్ణయం తీసుకున్న అర్కిపోవ్ వయస్సు అప్పుడెంతో తెలుసా.. కేవలం 34 సంవత్సరాలు. ఆ వయస్సులో చాలా మంది దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మూడో ప్రపంచ యుద్ధమే ఆగిందని తెలిసినవారు చెబుతుంటారు. అర్కిపోవ్ 72 ఏళ్ల వయస్సులో 1998లో మరణించారు. ఆయన సేవలను అభినందిస్తూ అమెరికాకు చెందిన సంస్థ 2017లో ‘‘ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ అవార్డు’’ తో సత్కరించింది. అప్పటికే ఆయన మరణించడంతో అర్కిపోవ్ మనవడు సెర్గేయ్కు 50 వేల డాలర్ల నగదును అందించారు.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ