Hail rain : వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా!
అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వడగళ్లు పడ్డాయి. అసలు వడగళ్ల వాన ఎందుకు పడుతుందో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం వడగళ్ల(Hail) వాన బీభత్సం సృష్టించింది. రోడ్లు, పొలాలు తెల్లటి మంచుపొరలతో నిండి కశ్మీర్ను తలపించాయి. శుక్ర, శనివారాల్లోనూ వర్షాలు(Rain), వడగళ్లు కురిసే సూచనలు ఉన్నాయని, ఆదివారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వడగళ్లు ఎలా కురుస్తాయో తెలుసుకోండి.
వర్షం ఇలా..
ఆకాశంలోని మేఘాల్లోకి నీటి బిందువులు ఎక్కువగా చేరితే అవి భారీ పరిమాణంలోకి మారతాయి. మేఘం కరగడంతో భూమిపై వర్షం పడుతుంది. ఇలా పడే వర్షం కొన్ని సార్లు ప్రారంభంలో మంచు తునకలుగా ఉంటుంది. ఆ మంచు తునకలు భూమిని చేరే క్రమంలో వాతావరణ రాపిడికి గురై ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో గడ్డలు కాస్తా కరిగి వర్షపు చినుకులుగా మారి నేలను తాకుతాయి. దీన్నే వర్షం అని పిలుస్తుంటాం.
వడగళ్లు ఏర్పడాలంటే..
వడగళ్లు ఏర్పడాలంటే ముందు ఉరుములు, మెరుపులు రప్పించే మేఘం ఉండాలి. ఆ మేఘం ఎత్తు కూడా ఎక్కువగా ఉంటేనే వడగళ్లు ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది . మేఘాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. పై భాగం తప్పని సరిగా గడ్డ కట్టి ఉండాలి. కింది భాగంలో సూపర్ కూల్డ్ వాటర్ ఉండాలి. వాతావరణానికి పై భాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరడాన్ని సూపర్ కూల్డ్ వాటర్ అంటారు. ఈ స్థితిలో నీరు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నా ద్రవరూపంలోనే ఉంటుంది. ఇది మంచు గడ్డలు, దుమ్మురేణువు, వర్షపు బిందువులతో కలిసినప్పుడు గడ్డకడతాయి. ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు (అప్డ్రాఫ్ట్స్) తప్పనిసరి. పైకి వీచే గాలులే మేఘం కింది భాగంలోకి చేరిన మంచు ముక్కలను తిరిగి పైకి తీసుకెళ్తాయి.
ఉల్లిపాయలా.. వడగళ్లు!
వడగళ్లు అనేవి మంచు ముద్దలు. చాలాసార్లు ఉరుములతో కూడిన వర్షం పడటం వల్ల వడగళ్లు కన్పిస్తాయి. వడగళ్లు ఎక్కువగా ఎత్తయిన, నిలువుగా ఉండే క్యుములోనింబస్ మేఘాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటినే తీవ్రమైన ఉరుములతో కూడిన మేఘాలుగా పిలుస్తారు. క్యుములోనింబస్ మేఘంలోని సూపర్కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. ఆ ముక్కలను పైకి పంపించేలా వాయువు(అప్డ్రాఫ్ట్స్) సహకారం అందించడంతో అవి కింద పడకుండా తిరిగి మేఘం పైకి వెళతాయి. ఈ క్రమంలో ఆ ఐస్ ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవుతుంది. పై స్థానంలోని కొన్ని మంచు ముక్కలు కూడా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య పునరావృతమయ్యే కొద్దీ ఐస్ ముక్కలు పెద్ద పెద్దగా రూపాంతరం చెందుతుంటాయి. అవే వడగళ్లు. ఈ వడగళ్లు ఒక ఉల్లిపాయ వలే పొరలుగా ఏర్పడతాయి. క్రమంగా వడగళ్ల పరిమాణం భారీగా మారడంతో అప్డ్రాఫ్ట్స్ శక్తి సరిపోదు. దాంతో గురుత్వాకర్షణకు లోనై అవి భూమి దిశగా పయనిస్తాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. అది కొన్నిసార్లు భారీ ఉరుములు, పిడుగులతో కూడి ఉంటుంది.
వేగం 160 కిలోమీటర్లు!
వడగళ్లు మొదట ఎలా మేఘం నుంచి ప్రారంభమయ్యాయో అలాగే భూమిని చేరవు. వాతావరణంలోని వేడి వాటికి జత కావడంతో వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. అందుకే వడగళ్ల వాన ఎక్కువ సార్లు కురవడం సాధ్యం కాదు. టోర్నడోలు, అస్థిర వాతావరణ పరిస్థితులున్నప్పుడు వడగళ్లు పడుతుంటాయి. అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీస్ 2.5 సెంటీమీటర్ల వ్యాసం ఉండే మంచు ముక్కలను వడగళ్లుగా పేర్కొంది. భారీ పరిమాణంలో ఉండే వడగళ్లు పడితే ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. నివాసాలు, కార్లు, పంటలు దెబ్బతింటాయి. మేఘాల నుండి వడగళ్లు పడే వేగం ఎంతో తెలుసుకోవడం చాలా కష్టం. అవి దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయని ఒక అంచనా. అందుకే వడగళ్లు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పశువులు, పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్