holiday vacation: విహారయాత్ర ఎన్ని రోజులుంటే బాగుంటుంది?
కరోనా.. లాక్డౌన్ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు.. దాంతో గృహిణిలకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది
ఇంటర్నెట్ డెస్క్: కరోనా లాక్డౌన్ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు.. దాంతో గృహిణులకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. అందుకే, లాక్డౌన్ ఆంక్షలు లేని ప్రాంతాలకు రెక్కలు కట్టుకుకొని వాలిపోతున్నారు. మరికొందరు వారికి నచ్చిన ప్రాంతంలో ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. జీవితంలో ఒత్తిళ్లను మర్చిపోవడానికి విహారయాత్ర నిజంగానే సంజీవనిలా పనిచేస్తుంది. అయితే, ఎన్ని రోజులు వెళ్లాలి? సెలవులు ఎంతకాలం తీసుకుంటే.. విహారయాత్ర ఆహ్లాదంగా ఉంటుందనే విషయంపై గతంలో ఓ యూనివర్సిటీ పరిశోధన చేసింది. అందులో తేలిందేమంటే..
విహారయాత్రకు ఎనిమిది రోజులు సరిపోతాయని ఫిన్లాండ్లోని టాంపెరె యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎనిమిది రోజుల ట్రిప్లో మనిషికి కావాల్సినంత ప్రశాంతత, విశ్రాంతి లభిస్తాయని పేర్కొన్నారు. హాలీడే ట్రిప్ మొదటి రోజు నుంచే ప్రశాంత భావం, సానుకూల ప్రయోజనాలు ప్రారంభమవుతాయట. అవి ఎనిమిది రోజులపాటు ఉంటాయని, ఆ తర్వాత తగ్గుతూ.. ఉద్యోగం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల ఆలోచనలు మొదలవుతాయని చెప్పారు. పదకొండో రోజుకు వచ్చేసరికి అవి మరింత పెరుగుతాయని వెల్లడించారు.
విచారకరమైన అంశమేంటంటే.. ఎన్ని రోజులు విహారయాత్రకు వెళ్లినా.. తిరిగొచ్చాక ఆ ఆహ్లాదభరిత క్షణాలను మీరు త్వరగా మరచిపోతారని.. మీ మానసిక స్థితి, రోజువారీ పనులపై అదెలాంటి ప్రభావం చూపదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాకపోతే ఈ విహారయాత్రల వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుందన్నారు. కాబట్టి.. ఎక్కువ రోజులు విహారయాత్రకు వెళ్తే మంచి అనుభూతి మిగిలిపోతుందని భావించి.. రెండుమూడేళ్లకు ఒకసారి ఎక్కువ రోజులు సెలవులు పెట్టి విహారయాత్రకు వెళ్లడం కన్నా.. ఏటా 7 నుంచి 11 రోజులు విహారయాత్ర చేయడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు