అమెరికాలో హ్యారీ-మేఘన్.. ఆదాయం ఎలా?
అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడటం.. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి కూడా నచ్చకపోవడంతో ఇద్దరు కలిసి ప్యాలెస్తోపాటు, రాజకుటుంబాన్ని వీడి బయటకు వచ్చేశారు. మేఘన్ స్వస్థలం యూఎస్లోని కాలిఫోర్నియాకి వచ్చి స్థిరపడ్డారు. హ్యారీ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన బ్రిటన్ రాజకుటుంబం అతడి ఖర్చులకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బుతోనే తన ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని హ్యారీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, డయానా నుంచి హ్యారీకి ఎంతమొత్తంలో నగదు అందింది? అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి ప్రధాన రాష్ట్రంలో హ్యారీ కుటుంబం జీవించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? వంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు వాటిపై ఆరా తీసి.. సమాధానం కనిపెట్టాయి. అదేంటంటే..
అంతర్జాతీయ మీడియా అంచనా ప్రకారం.. ప్రిన్స్ హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా 10 మిలియన్ పౌండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రిన్స్ హ్యారీ పేరు మీద డయానా 8.9మిలియన్ పౌండ్లు మాత్రమే దాచిపెట్టారట. దానిపై వచ్చిన వడ్డీ.. ఇతర ఆదాయం కలిపి మొత్తం 10 మిలియన్ పౌండ్లు అయినట్లు మీడియా పేర్కొంది. ఆమె పెద్దకుమారుడు.. హ్యారీ సోదరుడు విలియమ్కు కూడా డయానా 9 మిలియన్ పౌండ్లు వదిలివెళ్లారట.
డయానా వివాహం.. విడాకులు.. భరణం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్తో డయానాకు 1981లో వివాహమైంది. బ్రిటన్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె.. చార్లెస్తో వివాహంతో బ్రిటన్ రాజకుటుంబంలో సభ్యురాలిగా మారారు. వారి వివాహబంధానికి గుర్తుగా ప్రిన్స్ విలియమ్స్.. ప్రిన్స్ హ్యారీలు జన్మించారు. కానీ, డయానా దంపతుల దాంపత్య జీవితం అంత సఖ్యంగా ఉండేది కాదు. పలు అంశాల్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డయానాకు భరణం కింద 17 మిలియన్ పౌండ్లు, జీవన భృతి కింద ఏటా 4లక్షల పౌండ్లు అందేలా ఒప్పందం కుదిరింది. కానీ, విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది అంటే 1997లో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకుముందే భరణం కింద వచ్చిన డబ్బును డయానా తన ఇద్దరు పిల్లల పేరుమీద దాచిపెట్టారు. వారిద్దరికి పాతికేళ్లు వచ్చాక ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ వచ్చేలా.. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా 36ఏళ్ల హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బే అమెరికాలో స్థిరపడటానికి ఉపయోగపడింది.
మేఘన్ వృత్తి.. ఒప్పందాలు
ప్రిన్స్ హ్యారీతో వివాహానికి ముందు మేఘన్ అనేక టీవీ సిరీస్లు.. పలు సినిమాల్లో నటించింది. సూట్స్ అనే సిరీస్లో మేఘన్ ఒక ఎపిసోడ్కు 50వేల డాలర్లు పారితోషికంగా తీసుకుందట. అలాగే, పలు బ్రాండ్స్కు ప్రచారకర్తగా, స్పాన్సర్షిప్ కింద ఏటా 80వేల డాలర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లు ఉంటుందట. ఇద్దరి డబ్బులతో కాలిఫోర్నియాలో 14.65 మిలియన్ డాలర్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, స్పూటిఫైలతో హ్యారీ, మేఘన్ మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కుటుంబ పోషణ కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.