Immunity Booster: పోపుల పెట్టె వైద్యం!
ప్రస్తుతం కరోనా మహమ్మారి గుప్పిట ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతోంది. వేరియంట్లు, మ్యుటేషన్లు ఏవైనా..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం కరోనా మహమ్మారి గుప్పిట ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతోంది. వేరియంట్లు, మ్యూటేషన్లు ఏవైనా ప్రభావం చూపడానికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. వివిధ రకాల ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అయితే వంటింట్లోనే రోగ నిరోధక శక్తిని పెంచుకుని కరోనాను దూరం చేసే మందులు ఉన్నాయని మీకు తెలుసా..? ఈ వైరస్కు పోపుల పెట్టె వైద్యమే సరైందని నిపుణులు అంటున్నారు.
మందులు, వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ వస్తుందన్నది ఎంత వాస్తవమో.. మంచి ఆహారంతో కూడా పెంచుకోవచ్చనేది అక్షర సత్యం. మరి దివ్యౌషధం లాంటి ఆహారంలో ఏమేమి ఉండాలి..? ధనియాలు, ఆవాలు ఎక్కువగా తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటి? వంటి విషయాలను ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీవీ పూర్ణచంద్ వివరించారు.
* పోపుల పెట్టెలో ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, సెనగపప్పు, మిరియాలు, మిరపకాయ తదితర సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. చింతపండు రసం, మసాలాలు అతిగా వాడకుండా ఉంటే జీర్ణశక్తి బాగుంటుంది.
* వాము, ఆవాల పొడి, మెంతులు, ధనియాల పొడిని తరచూ వినియోగించడం వల్ల జీర్ణశక్తి, ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనికొస్తాయి.
* కరోనా అన్ని లక్షణాలపైనా అడ్డసరం మూలిక బాగా పని చేస్తుంది.
* పాలలో అశ్వగంధ చూర్ణం వేసుకుని తాగడం చాలా మంచిది. తులసితో జలుబు, దగ్గు, కఫం మటుమాయవుతాయి.
* పుదీనాలోని ఔషధ గుణాలతో జీర్ణకోశం సురక్షితంగా ఉంటుంది. జీర్ణశక్తిని పాడు చేసే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
* కరోనా వల్ల ఊపిరితిత్తులకు వచ్చే లక్షణాలపై వాసరిష్ట, దసములారిష్ట, కనకాసనం, ద్రాక్షరిష్ట మందులు చాలా బాగా పనిచేస్తాయి.
* సుదర్శన (నేలవాము) అనే మొక్క యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియాగా అద్భుతంగా పని చేస్తుంది. కరోనా కాలంలో మజ్జిగ, పెరుగు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిమితంగా అల్లం, వెల్లుల్లి వాడుకోవాలి.
* అల్లం, సైంధవ లవణం కలిపి నూరిన మిశ్రమాన్ని భోజనంలో మొదటి ముద్దగా తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
* వేడిపాలల్లో పసుపు, బెల్లం తాగాలి. నీళ్లల్లో వాము, ధనియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు