WhatsApp: వ్యాక్సిన్ సెంటర్ తెలుసుకోండిలా!
వాట్సాప్ కూడా వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలను అందిస్తోంది
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్లలో కూడా రిజిస్టర్ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్ బాట్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్ను మీకు వాక్సినేషన్కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. దాని కోసం ఏం చేయాలంటే?
💉 తొలుత మీ స్మార్ట్ ఫోన్లో +919013151515 నెంబరును సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్లోకి వెళ్లి మీరు సేవ్ చేసిన పేరుతో నెంబరును వెతకండి.
💉 సెర్చ్లో వచ్చిన నెంబరుకు Namaste అని మెసేజ్ పంపండి. (నమస్తే అనే కాదు, ఇంగ్లిష్లో ఏ పదం మెసేజ్గా పంపినా ఓకే) వెంటనే MyGov Corona Helpdeskకు సంబంధించిన బాట్ యాక్టివ్ అవుతుంది.
💉 అప్పుడు మీకు పై మెసేజ్ వస్తుంది. అందుంలోంచి మీకు కావాల్సిన నెంబరును ఎంచుకొని తిరిగి పంపాలి. ఉదాహరణకు మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు కావాలంటే ‘1’ అని రిప్లై ఇవ్వాలి.
💉 ఆ తర్వాత కొవిడ్ సెంటర్స్ సమాచారం కోసం ‘1’ అని రిప్లై ఇవ్వమని అడుగుతుంది. మీరు అలా రిప్లై ఇవ్వగానే మీ పిన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
💉 ఆరు అంకెల పిన్ కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత.. కొంచెం సమయం తీసుకొని ఆ పిన్ కోడ్కు దగ్గరలో ఉన్న కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు, అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ స్లాట్స్ అవైలబిటీ వివరాలు తెలియజే స్తుంది.
💉 వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలతోపాటు వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్ కూడా వస్తుంది.
💉 ముందుగా చెప్పుకున్నట్లు ఈ బాట్లో వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు మాత్రమే కాకుండా కరోనా అప్డేట్స్, సక్సెస్ స్టోరీస్, ఫాక్ట్ చెక్, కరోనా లక్షణాలు లాంటి మరిన్ని వివరాలు కూడా వస్తాయి. దీని కోసం మరోసారి Namaste అనో లేక Hello అనో ఏదో ఒకటి పంపిస్తే మీకు లిస్ట్ వస్తుంది. అందులోంచి మీకు కావాల్సిన నెంబరు ఎంచుకొని రిప్లై ఇస్తే ఆ సమాచారం వస్తుంది.
💉 అయితే ఈ బాట్ ఆంగ్లంలో మాత్రమే పని చేస్తుంది. తెలుగులో ఏ మెసేజ్ పెట్టినా బాట్ స్పందించదు. నా స్థాయికి మించి సమాచారం అడిగారు అని సమాధానం వస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్