నాన్నకు కరోనా సోకిందని..!
కరోనా మహమ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కళ్లెదుటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దమంటే బెడ్డు దొరకడం లేదు. ...
కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశాడు..
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కళ్లెదుటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దమంటే బెడ్డు దొరకడం లేదు. సరే ఏదో ఒకటి చేసి బెడ్డు సంపాదించామంటే.. ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉండటం లేదు. ప్రాణవాయువు కోసం బాధితుల బంధువులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు. పెద్ద పెద్ద నాయకులకు, బడా వ్యాపారవేత్తలకే ఆస్పత్రిలో చోటు దక్కడం లేదంటే ఇక సామాన్యుడి గురించి చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితే ఎదురైంది గుడ్గావ్కు చెందిన విశాల్ సింగ్కు. 80 ఏళ్ల వాళ్ల నాన్నకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చేర్పిద్దామంటే ఎక్కడా ఖాళీ లేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని గ్రహించి ఏం చేశారో తెలుసా?
విశాల్ సింగ్.. దిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఇండస్ వ్యాలీ పబ్లిక్స్కూల్ అధినేత. మరో రెండు దిల్లీ పబ్లిక్ స్కూళ్లనూ నడుపుతున్నారు. సహారా గ్రేస్లోని సెక్టార్ 28లో నివాసం ఉంటున్నారు. వాళ్ల నాన్నకు ఇటీవల కరోనా సోకింది. వయోభారం కారణంగా పరిస్థితి కాస్తా విషమించింది. దిల్లీలోని దాదాపు అన్ని ఆస్పత్రులకు తిప్పారు. ఎక్కడా బెడ్లు దొరకలేదు. తమకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించారు. అయినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసే కంటే ఇంటి వద్దే వైద్యమందిస్తే ఫలితముంటుందనుకున్నాడు. కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి, ఇంట్లోనే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి విశాల్ సింగ్ను కదిలించింది. కాస్త స్థోమత ఉన్న తమకే ఇలా ఉంటే ఇక సమాన్యుల పరిస్థితి ఏంటనుకున్నాడు. విశాల్ నివాసముండే హౌసింగ్ కమ్యూనిటీలో దాదాపు 200 వరకు ఇళ్లుంటాయి. అందులో 60 మందికి కరోనా సోకినట్లు తెలుసుకున్నాడు. దాదాపు అందరిదీ అదే పరిస్థితి బెడ్లు దొరకడం లేదు, ఒక వేళ దొరికినా ఆక్సిజన్ కొరత.
ఒక్కరోజులోనే..
వీరందరికీ సాయం చేసేందుకు తానే ఒక కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆ హౌసింగ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ వీకే నారులా, రిటైర్డ్ డాక్టర్ నాగ్రాలను సంప్రదించాడు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. తన అపార్టుమెంటును ఖాళీ చేసి ఇస్తానని కూడా చెప్పాడు. దీంతో వారిద్దరు కూడా ముందుకొచ్చారు. కావాల్సిన ఏర్పాట్లన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేశారు. కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్కు కావాల్సిన పరికరాలు, బెడ్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు ఇలా అన్నీ సమకూర్చుకున్నారు. తాము కొనుగోలు చేసిన సామగ్రితో అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు వీలుగా 5 బెడ్లును సిద్ధం చేశారు. వీటన్నిటికీ దాదాపు రూ.20 లక్షలకు పైగా ఖర్చయిందట.
ఇది ఆస్పత్రి కాదు
కొవిడ్ కేర్ ఫెసిటిలీ సెంటర్లో చేరిన వారికి అక్కడే పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇద్దరు అనుభవజ్ఞులైన నర్సులతోపాటు, బయటి నుంచి ఏవైనా తెచ్చేందుకు ఇంకొకరు వారికి నిత్యం అందుబాటులో ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, బీపీ, ఆస్తమా లాంటి వ్యాధులు ఉన్న వారు సంబంధిత డాక్టర్లను సంప్రదించి వారే మందులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ‘ఇది ఆస్పత్రి కాదు. కేవలం రిలీఫ్ సెంటర్ మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించడంతోపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నామన్న భరోసా కల్పించడం కోసమే దీనిని ఏర్పాటు చేశా’మని విశాల్ అంటున్నారు.
అందర్నీ చేర్చుకోరు..
ఏప్రిల్ 24 ఉదయం 9 గంటలకు కేర్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించగా 10 గంటలకు తొలి బాధితుడొకరు వచ్చారు. ఆరోగ్యం విషమంగా ఉన్న ముగ్గురు ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నారు. మరో రెండు బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే హోం క్వారంటైన్లో ఉండి కోలుకునే అవకాశం ఉన్న వారిని, ఆక్సిజన్ లెవెన్స్ సాధారణంగా ఉండేవారిని ఇందులో చేర్చుకోరు. ఆక్సిజన్ స్థాయులు 90శాతం కంటే తక్కువ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు కాస్త కోలుకున్న తర్వాత డిశ్ఛార్జి చేసి కొత్తవారిని చేర్చుకుంటున్నారు. ఇది ఆస్పత్రి కాదని, రిలీఫ్ సెంటర్ మాత్రమేనని, అయితే ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బంది పడేవాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని విశాల్ చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో ఇలా చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, కొంతమందికైనా సాయం చేయగలగుతున్నానన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందని విశాల్ అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి