White house : అమెరికా అధ్యక్ష భవనం పేరు అప్పట్లో ‘వైట్ హౌస్’ కాదు!
అమెరికా అధ్యక్షుడి నివాసంగా ఉన్న వైట్ హౌస్(White house)లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడున్న వైట్హౌస్ పూర్తిగా తొలి డిజైన్ కాదు.
ప్రపంచంలో కొన్ని ప్రసిద్ధ కట్టడాలను చాలా మంది సులభంగా గుర్తుపట్టేస్తారు. వాటిలో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒపెరా హౌస్ తప్పకుండా ఉంటాయి. ఈ నిర్మాణాల వెనుక జరిగిన విశేషాలేంటో చదివేయండి.
అమెరికా(America) మొట్టమొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ 1792లో అధ్యక్ష భవనం నిర్మించాలని సంకల్పించాడు. అప్పటికి వాషింగ్టన్ డీసీ ఇంకా అభివృద్ధి చెందలేదు. అధ్యక్ష భవన నిర్మాణం కోసం డిజైన్లు పంపించాల్సిందిగా ఆయన పోటీ నిర్వహించాడు. దాంతో పలువురు నిపుణులైన వాస్తు శిల్పులు, ఔత్సాహికులు తాము రూపొందించిన డిజైన్లు పంపించారు. వాటిలో అమెరికా చరిత్ర ప్రతిబింబించేలా.. సంస్కృతి కనిపించేలా అనేక డిజైన్లున్నాయి. అంతిమంగా ఐర్లాండ్కు చెందిన ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ రూపొందించిన డిజైన్ను ఎంపిక చేశారు. అతడు దాన్ని డబ్లిన్లోని లెన్ట్సర్ హౌస్ను స్ఫూర్తిగా తీసుకొని గీశాడు. అయితే ఇప్పుడున్న వైట్హౌస్(White house) పూర్తిగా తొలి డిజైన్ కాదు. అనేక మంది అధ్యక్షులు అందులో నివాసం ఉంటూ కొన్ని కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు. జేమ్స్ మన్రో కాలంలో సౌత్ పోర్టికో నిర్మించారు. ఆండ్రూ జాక్సన్ పరిపాలనలో నార్త్ పోర్టికో నిర్మించారు. 1901లో అమెరికా(America) అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్ రూజ్వెల్డ్ అధికారికంగా ఈ నివాసానికి ‘వైట్ హౌస్’ పేరు పెట్టాడు. దాంతో ఆ పేరు మంచి ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు ఆ వైట్ హౌస్లో ఎన్నోసార్లు మార్పులు జరిగాయి కానీ పేరు మాత్రం మారలేదు.
అమెరికా పేరు వినగానే ప్రపంచానికి గుర్తుకొచ్చే ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’(Statue of liberty)ని ఫ్రెడ్రిక్ బర్థోల్డీ డిజైన్ చేశారు. ఈ నిర్మాణంలో స్వేచ్ఛను ప్రసాదించే రోమన్ దేవత లిబర్టాస్ ఉంటుంది. ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ నిర్మాణం వెనుకున్న విషయాలపై కొందరు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. ఈజిప్టు(Ezypt) సామాజికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో సూయజ్ కెనాల్ పాత్ర ఎంతో ఉంది. దాంతో ఆ కాలువ సమీపంలో లాంతరు పట్టుకున్న ఒక ముస్లిం మహిళ శిల్పాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ‘ఈజిప్ట్ బ్రింగింగ్ లైట్ టు ఏసియా’ అంటూ క్యాప్షన్ కూడా సిద్ధం చేశారు. కానీ ఈజిప్ట్ అధికారులు వేగంగా స్పందించకపోవడంతో ఆ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. దాంతో ఫ్రెడ్రిక్ అదే నిర్మాణానికి కొన్ని మార్పులు చేసి ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని తీర్చిదిద్దారు.
ఆస్ట్రేలియా(Austalia) పేరు చెప్పగానే సిడ్నీ నగరం గుర్తొస్తుంది. ఆ సిడ్నీ నగరానికి తలమానికంగా నిలుస్తోంది ‘ఒపెరా హౌస్’. తెరచాపలు, గవ్వల్లా కనిపించే ఈ నిర్మాణాన్ని జోర్న్ అట్జోన్స్ రూపొందించారు. ఈ నిర్మాణం ఎంపికలో 200 మంది పోటీపడ్డారు. చివరికి.. రెండో స్థానంలో నిలిచిన ప్రస్తుత ఒపెరా హౌస్ను ఎంపిక చేశారు. ఫిలడెల్ఫియా కొలాబ్రేటివ్ గ్రూప్లోని ఏడుగురు ఆర్కిటెక్ట్స్ కలిసి దీనిని డిజైన్ను తీర్చిదిద్దారు. అట్జోన్స్ సహా వారంతా కలిసి సముద్ర తీరంలోని నత్తగుల్లలను చూసి స్ఫూర్తి పొందారు. సముద్రం పక్కనే ఆ జీవి తరహా నిర్మాణం ఉంటే బాగుంటుందని భావించారు. ఆ ఆలోచనల మూలంగా అందమైన ఒపెరా హౌస్ రూపుదిద్దుకుంది. ఎత్తయిన కిటికీలు, మడతలు వేసిన కాంక్రీటు నిర్మాణాలు ఇప్పటికీ సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజాగళం సభకు వెళ్లారని కుళాయి కనెక్షన్ తీసేశారు!
-
‘కారు’లోనే ఉండండి.. స్టీరింగ్ మా ‘చేతి’కివ్వండి!
-
లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి.. విశాఖ మధురవాడలో దారుణం
-
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్కు అనుమతి లేదు.. ఈసీ
-
అటు ప్రసవం.. ఇటు శివస్తోత్రం
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో.. డెత్ మిస్టరీ ఛేదించిన పోలీసులు