టెలిఫోన్ బూత్లాగే.. ఈ టెలిక్యూబ్లు!
ఇప్పుడంటే అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడాలనుకుంటే టెలిఫోన్ బూత్కు వెళ్లేవారు. ఒకరు నిలబడగలిగేంత విస్తీర్ణంలో చిన్న గదిలాగా ఉంటుంది ఆ బూత్. అందులో నిలబడి ఫోన్ చేసుకునేవారు. బస్స్టాప్, రైల్వే స్టేషన్
(ఫొటో: వీక్యూబ్ వెబ్సైట్)
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంటే అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడాలనుకుంటే టెలిఫోన్ బూత్కు వెళ్లేవారు. ఒకరు నిలబడగలిగేంత విస్తీర్ణంలో చిన్న గదిలాగా ఉండేది ఆ బూత్. అందులో నిలబడి ఫోన్ చేసుకునేవారు. బస్స్టాప్, రైల్వే స్టేషన్ ఇలా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి కనిపించేవి. కాలక్రమంలో ఈ టెలిఫోన్ బూత్లు కనుమరుగయ్యాయి. అయితే, ఇటీవల ఈ బూత్లు రూపాంతరం చెంది టెలీక్యూబ్లుగా ప్రత్యక్షమయ్యాయి. జపాన్లో ప్రజలు వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ టెలిక్యూబ్లు..?
కరోనా సంక్షోభం కారణంగా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. పని అంతా ల్యాప్టాప్లోనే జరిగిపోవడం, ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగులు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఉద్యోగులు బయటకు వెళ్లినప్పుడు.. ప్రయాణాలు చేస్తున్నప్పుడు అత్యవసరంగా ఆఫీసు పని చేయాల్సి వచ్చినా, ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి వచ్చినా ఇబ్బంది ఎదురవుతోంది. జనాల మధ్య పనిచేసుకునే వీలు ఉండదు. చుట్టూ ఉండే మనుషుల మాటలు, వాహనాల శబ్దాలు చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా పని వేళల్లో బయటకు వెళ్లారని తెలిస్తే సంస్థ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా పలు సంస్థలు ఈ టెలీక్యూబ్లను రూపొందించాయి.
చిన్నపాటి గదిలా ఉండే టెలీక్యూబ్లను బస్స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్పోర్టు ఇతర జనసంచార ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టెలీక్యూబ్లో ఒకటి నుంచి నాలుగు గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక కుర్చి/ సోఫా.. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వీలుగా డెస్క్.. ల్యాప్ట్యాప్ను కనెక్ట్ చేసుకునేందుకు మానిటర్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి విద్యుత్ సరఫరా కూడా ఉంటుంది. ఒక గది నుంచి మరో గదికి శబ్దాలు వినపడకుండా సౌండ్ప్రూఫ్ మెటీరియల్ను గోడలుగా ఉపయోగించారు. దీంతో బయట శబ్దాలు లోపలికి వినిపించవు.. లోపలి శబ్దాలు బయటకు వినిపించవు. ఎవరూ అంతరాయం కలిగించకుండా ప్రైవసీ ఉంటుంది.
నిజానికి ఈ టెలీ క్యూబ్లను 2018లోనే మిత్సుబుషి కంపెనీ ప్రైవేటుగా సంస్థలకు, వ్యక్తులకు అద్దెకిచ్చేది. 2019లో బహిరంగ ప్రదేశాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. కానీ, గతేడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీటి డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందకు పైగా ఈ టెలీక్యూబ్లున్నాయి. త్వరలో వెయ్యికిపైగా ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!