Kibithoo : అమిత్ షా చెప్పిన ఫస్ట్ విలేజ్ ‘కిబితూ’.. మీరూ వెళ్తారా!
అరుణాచల్ ప్రదేశ్లోని (Arunachal pradesh) కిబితూ (Kibithoo) గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఆ గ్రామాన్ని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) సందర్శించారు.
అరుణాచల్ ప్రదేశ్లోని (Arunachal pradesh) కిబితూ గ్రామంలో (Kibithoo) ప్రతి ఒక్కరూ పర్యటించాలని దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) కోరారు. ఆ ప్రాంత ప్రకృతి అందాలను వీక్షించాలని సూచించారు. దానిని మొదటి గ్రామంగా (India's first village) (ఇండియాస్ ఫస్ట్ విలేజ్) ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కిబితూ (Kibithoo) ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.
కొండలు.. జలపాతాలు
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన చైనా, తూర్పున మయన్మార్ ఉన్నాయి. ఈ గ్రామం ఈశాన్య భారత్లో ఈశాన్య దిశలో చివరి రహదారిపై ఉంది. ఇక్కడే ‘లోహిత్’ నది భారత్లోకి ప్రవేశిస్తుంది. లోహిత్ బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇది టిబెట్లోని కాంగ్రీ గార్పో శ్రేణిలో పుడుతుంది. అక్కడ దానిని ‘జాయుల్ చు’ అని పిలుస్తారు. కిబితూ గ్రామానికి వెళ్లే మార్గం పొడవునా సుందరమైన పర్వతాలు దర్శనమిస్తాయి. వాటిపై తెల్లని మంచు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అనేక చోట్ల జలపాతాలు జాలువారుతుంటాయి.
కిబితూ సుందర దృశ్యాలను కెమెరాలో బంధిస్తున్న అమిత్ షా
వ్యూహాత్మక సరిహద్దు
కిబితూ గ్రామం ఇండో-చైనా సరిహద్దులో ఉండటం వల్ల ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ప్రాంతమైంది. ఈ గ్రామం మిష్మి పర్వతాల్లో.. సముద్ర మట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత్లో మొట్టమొదట సూర్యకిరణాలు పడే డాంగ్ వ్యాలీకి తూర్పున కిబితూ కన్పిస్తుంది. నదికి అవతలి వైపు కహో గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని కూడా మొదటి గ్రామంగా పిలుస్తుంటారు. 1962లో కహోలోకి ప్రవేశించిన చైనా బలగాలను.. భారత సైనికులు దీటుగా ఎదుర్కొన్నారు. భారత సైనికులు కిబితూ పోస్ట్ వద్దకు సైనిక సామగ్రిని తీసుకెళ్లడానికి ఫుట్ సస్పెన్షన్ బ్రిడ్జిని ఉపయోగిస్తుంటారు. లోహిత్ నది తూర్పు ఒడ్డును, పశ్చిమ ఒడ్డుతో కలిపే ఏకైక దారి ఇది మాత్రమే. ఎక్కువగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల మిగతా మార్గాలను మూసి ఉంచుతున్నారు. భారత సైనికులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా మధ్య అప్పుడప్పుడు సాధారణ సంప్రదింపులు జరుగుతుంటాయి. అందుకోసం ఎంపిక చేసిన ఐదు బోర్డర్ పాయింట్లలో కిబితూ కూడా ఒకటి.
కిబితూను సందర్శించే ముందు..
ఈ గ్రామానికి 125 కిలోమీటర్ల దూరంలో ఖుపా పట్టణంలో మాత్రమే పెట్రోలు బంక్ ఉంది. అందుకే సొంత వాహనాల్లో వెళ్లేవారు ఇంధనం నిండుగా ఉండేలా చూసుకోవాలి. 75 కిలోమీటర్ల దూరంలోని అంజావ్ జిల్లా ప్రధాన కేంద్రం హవాయ్లో మాత్రమే బస చేయాల్సి ఉంటుంది. కిబితూ గ్రామానికి 20 కిలోమీటర్ల ముందే వాలాంగ్ వార్ మెమోరియల్ కన్పిస్తుంది. యుద్ధ సమయంలో భారత బలగాలు.. 4వేల మంది చైనా సైనికులను ఇక్కడే నిలువరించాయి. వాలాంగ్కు ఏడు కిలోమీటర్ల ముందే ‘గరంపానీ’ని చూడొచ్చు. అక్కడ వేడి నీటి బుగ్గల మడుగులుంటాయి. కిబితూలోని హెలిప్యాడ్ దగ్గర నుంచి చూస్తే చైనా ఆర్మీ క్యాంప్ ప్రదేశం స్పష్టంగా కన్పిస్తుంది. భారత భూభాగంపై సూర్యకాంతి పడే మొట్టమొదటి గ్రామం డాంగ్ను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందొచ్చు. ఇతర రాష్ట్రాల ప్రజలు అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) తీసుకుంటే సాఫీగా ప్రయాణం సాగించవచ్చు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.