Indian Artcrafts: బ్రిటన్ మ్యూజియాల్లో వెలకట్టలేని భారత కళాఖండాలు!
భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్ ఇక్కడి నుంచే ఎన్నో నిధులునిక్షేపాలను దోచుకుంది. ఈ విషయంలో మనం సాధారణంగా బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న మన కోహీనూర్ వజ్రం గురించే మాట్లాడుకుంటాం. కానీ.. భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం
భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. ఈ విషయంలో మనం సాధారణంగా బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం గురించే మాట్లాడుకుంటాం. కానీ.. భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం నుంచి ఎత్తుకెళ్లింది. అయితే వాటిలో కొన్ని భారత చక్రవర్తులే బహుకరించగా వాటిని బ్రిటన్కు తరలించారు. అలా అనేక కళాఖండాలు ఇప్పటికీ బ్రిటన్లోని పలు మ్యూజియాల్లో దర్శనమిస్తున్నాయి. భారతీయులంతా వాటిని మన దేశానికి తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకొనే కొన్ని కళాఖండాలను చూద్దాం..!
హరిహర విగ్రహం
(Photo: British Museum Twitter)
మధ్యప్రదేశ్లోని కజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో అపహరణకు గురైంది. ఎన్నో చేతులు మారి చివరికి లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి చేరింది. ఇసుకరాయితో చేసిన ఈ విగ్రహంలో సగభాగం శివుడు, మరో సగభాగం విష్ణుమూర్తి అవతారం కనిపిస్తుంటుంది. ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉండగా కుడివైపు రెండు చేతుల్లో శివుడి త్రిశూలం, జపమాల ఉన్నాయి. ఎడమవైపు రెండు చేతుల్లో విష్ణుమూర్తి శంఖు, చక్రం ఉన్నాయి. ఈ విగ్రహం వెయ్యి ఏళ్ల కిందటిదని బ్రిటీష్ మ్యూజియం పేర్కొంది.
సుల్తాన్గంజ్ బుద్ధ
(Photo: wikimedia / Birmingham museums)
1862లో బిహార్లోని బగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ ప్రాంతంలో రైల్వే నిర్మాణంలో బయటపడ్డ బుద్ధుడి విగ్రహం ఇది. ప్రస్తుతం బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉంది. 2.3మీటర్ల ఎత్తుండే ఈ విగ్రహాన్ని 500కిలోల రాగితో తయారుచేశారు. సుమారు 1500 ఏళ్ల కిందటిగా భావిస్తున్న ఈ విగ్రహం గుప్తుల శైలిలో ఉండటం గమనించవచ్చు.
టిప్పు సుల్తాన్ ఖడ్గం.. చెక్కతో చేసిన పులి బొమ్మ.. వ్యక్తిగత వస్తువులు
(Photo: wikimedia / V&A museum, London)
17వ శతాబ్దంలో మైసూర్ను టిప్పుసుల్తాన్ పరిపాలించారు. గొప్ప చక్రవర్తిగా పేరున్న ఆయన.. 1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలతో జరిగిన యుద్ధంలో మరణించారు. అయితే, టిప్పు సుల్తాన్ మరణించగానే ఆయన గదిలో ఉన్న విలువైన వస్తువుల్ని ప్రత్యర్థులు దోచుకెళ్లారు. మరణానికి ముందు కొన్ని వస్తువుల్ని ఇతరులకు బహుకరించారు. అలా అపహరణకు గురైన, బహుకరించిన వస్తువుల్లో ఖడ్గం, టిప్పు సుల్తాన్ ఉంగరం, అత్తరు, చెక్కతో చేసిన పులి బొమ్మ ప్రస్తుతం బ్రిటన్లో వేర్వేరు మ్యూజియాల్లో కనిపిస్తాయి.
షాజహాన్ మద్యం తాగిన పాత్ర
(Photo: wikimedia / V&A Museum no. IS.12-1962)
వంచి ఉన్న పక్షి ఈక ఆకారంలో వైట్ నైఫ్రైట్ రాయితో తయారు చేసిన ఓ పాత్ర ప్రస్తుతం బ్రిటన్ మ్యూజియంలో కనిపిస్తుంది. దాన్ని మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్ మద్యం తాగడానికి ఉపయోగించేవారట. 1657లో ఈ పాత్రను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇది 1962లో విక్టోరియన్ అండ్ అల్బర్ట్ మ్యూజియం చెంతకి చేరింది.
మహారాజా రంజిత్సింగ్ సింహాసనం
(Photo: wikimedia / V&A Museum no. 2518 IS)
సిక్కు సామ్రాజ్యంలో పేరొందిన చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్. ఆయన కోసం హఫీజ్ మహమ్మద్ ముల్తానీ అనే స్వర్ణకారుడు 1820-1830కాలంలో ఓ సింహాసనాన్ని తయారు చేశాడు. కలప, బంక, మెటల్తో సింహాసనం తయారు చేసి.. దానిపై బంగారుపూత వేశాడు. కమలం పూవు ఆకారంలో కనిపించే ఈ సింహాసనంపై మహారాజా రంజిత్ సింగ్ చాలా అరుదుగా కూర్చునేవారు. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత 1849లో ఆ సింహాసనాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ సింహాసనం విక్టోరియన్ అండ్ అల్బర్ట్ మ్యూజియంలో ఉంది.
అంబికా
(Photo: wikimedia / Jononmac46 / British Museum)
తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అంబికా విగ్రహం మధ్యప్రదేశ్లోని ధర్ ప్రాంతంలో బయటపడింది. ఈ విగ్రహం 1875లో బ్రిటీష్ రాజ్లో పనిచేసే మేజర్ జనరల్ విలియమ్ కిన్కెయిడ్ కంటపడటంతో వెలుగులోకి వచ్చింది. తెల్లరాయితో చెక్కిన ఈ దేవత శిల్పం కొన్నాళ్లకు అనూహ్యంగా ఎవరికి కనిపించలేదు. ఆఖరికి 1886లో లండన్లోని బ్రిటీష్ మ్యూజియంలో దర్శనమిచ్చింది. ఈ విగ్రహాన్ని తిరిగి మధ్యప్రదేశ్లోని సరస్వతి దేవాలయానికి ఇచ్చేయాలని అక్కడి ప్రజలు, పాలకులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి శిల్పాలు.. శాసనాలు
(Photo: wikimedia / the British Museum - Asian Gallery - Amravati)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటు చేసిన అమరావతికి వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. బౌద్ధ మతానికి ప్రసిద్ధి గాంచిన అమరావతిలో ఎన్నో శిల్పాలు, శాసనాలు 1800లో బయటపడ్డాయి. వాటిని వెంటనే అప్పటి బ్రిటీష్ అధికారులు లండన్ మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం 120కిపైగా చలవరాయితో చెక్కిన శిల్పాలు, శాసనాలు మ్యూజియంలో చూడొచ్చు. వాటిని తిరిగి భారత్కు తీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యూనెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.