Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
ప్రపంచంలో కొన్ని దేశాలు భారతీయులకు ఈ వీసా (e visa), వీసా ఆన్ అరైవల్ (Visa On Arrival) సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా అత్యంత సులువుగా ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది.
ఇంటర్నెట్డెస్క్: సరదాగా కొన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటించి వద్దామనుకునే వారికి వీసా అతిపెద్ద సమస్య. అనుకున్న సమయానికి వీసా రాకపోవడం, అది వచ్చేటప్పటికి సమయం కుదరకపోవడం లాంటి సమస్యలతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు ప్రత్యేకించి వీసా అక్కర్లేదు. ఆయా దేశాలే మనవాళ్లకు ఈ-వీసాలు, వీసా ఆన్ అరైవల్ ఏర్పాటు చేస్తున్నాయి. దీనికోసం పర్యాటకులు ట్రావెల్ ప్లాన్ విషయాలను నమోదు చేస్తూ ఒక దరఖాస్తు నింపితే సరిపోతుంది. మరి ఆ దేశాలేంటో.. వీసాకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందామా?
1. మాల్దీవులు (Maldives)
కొత్తగా పెళ్లయిన జంటలు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాల్దీవ్లు సరైన ప్రదేశం. అక్కడికి చేరుకున్న వెంటనే 30 రోజుల పాటు ఉండేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం ‘వీసా ఆన్ అరైవల్’ సమకూరుస్తోంది. ఇక ఈ దేశంలో పర్యటకులు సంతోషంగా గడపడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో సాహసోపేతమైన క్రీడల్లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భారతీయులకు ఎలాంటి రుసుము తీసుకోకుండానే అక్కడి ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తోంది.
2. థాయ్లాండ్ (Thailand)
థాయ్లాండ్లో చూడదగ్గ ప్రదేశాల్లో బ్యాంకాక్, క్రబి, ఫుకెట్,ఫిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాలు, నైట్క్లబ్లు ఇక్కడి ప్రత్యేకత. థాయ్లాండ్లో 15 రోజులు పాటు ఉండాలనుకునే వారు కేవలం 35 అమెరికా డాలర్లు చెల్లించి పర్యాటక వీసాను పొందొచ్చు. అంటే దాదాపు రూ.2,864తో 15 రోజులపాటు థాయ్లాండ్ దీవుల్లో పర్యటించొచ్చన్నమాట.
3. కాంబోడియా (Cambodia)
ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి కాంబోడియా సరైన ప్రదేశం. ఇక్కడ దేవాలయాలు, అడవులు.. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వెళ్లేందుకు ఈ-వీసా పొందాలనుకునే వారు నెలకు రూ.2,970 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
4. ఇండోనేసియా (Indonesia)
మనోహరమైన బీచ్లకు ఇండోనేసియా ప్రసిద్ధి. నోరూరించే ప్రత్యేక వంటకాలకు ఇది నెలవు. బీచ్లో సేదతీరుతూ ఎంజాయ్ చెయ్యడానికే ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అంతేకాకుండా పర్యాటకులతో ఇక్కడి ప్రజలు మమేకమయ్యే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇండోనేసియా పర్యాటక వీసా కావాలంటే రెండు నెలలకు రూ. 2,400 చెల్లించాల్సి ఉంటుంది.
5. శ్రీలంక (Sri Lanka)
భారతదేశానికి దక్షిణ దిక్కున అతి సమీపంలో ఉన్న శ్రీలంక విభిన్న వృక్షజాతులకు నెలవు. ఇక్కడి బీచ్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి వెళ్లాలనుకునేవారు ఈ-వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం రూ.2,475 చెల్లించాల్సి ఉంటుంది.
6. వియత్నాం (Vietnam)
జాతీయ ఉద్యానవనాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను దర్శించాలనుకునేవారికి ఇది చక్కని ప్రదేశం. ఇక్కడి ఫక్ష, బన్చా లాంటి ప్రాంతీయ వంటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఉష్ణమండల పర్యాటక ప్రదేశాల్లో వియత్నాం ఒకటి. 30 రోజుల పాటు ఇక్కడ బసచేసేందుకు వీలుగా భారతీయులకు అతితక్కువ ధరకే ఈ వీసాలను మంజూరు చేస్తోంది. అయితే కనిష్ఠంగా 30 రోజులు గరిష్ఠంగా 90 రోజుల పాటు ఇక్కడ బస చేయాల్సి ఉంటుంది. దీని కోసం రూ.7841 చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.