IRCTC: ‘వర్క్ ఫ్రమ్ హోటల్ ఇన్ కేరళ’ ప్యాకేజీ!
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వసతులు
తిరువనంతపురం: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇంట్లో కాకుండా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది భావిస్తుంటారు. అయితే, వెళ్లే చోట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వసతులు ఉంటాయో, లేదో అని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్(ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా ఓ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
దైవభూమి.. పచ్చని ప్రకృతికి నెలవైన కేరళలోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి పని చేసుకునేలా ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ఈ ప్యాకేజీని మే నెలలోనే ప్రారంభించింది. కరోనా, లాక్డౌన్తో నష్టపోయిన పర్యాటక రంగానికి, కేరళ రాష్ట్రానికి, అలాగే కరోనా పరిస్థితుల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ ప్యాకేజీ ధర రూ.10,126 నుంచి (ట్రిపుల్ ఆక్యూపెన్సీ) ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు సాగే ఈ ప్యాకేజీలో భాగంగా హోటల్లో పూర్తిగా శానిటైజ్ చేసిన గది, మూడు పూటల భోజనం, రోజులో రెండు సార్లు కాఫీ/టీ అందిస్తారు. వర్క్ ఫ్రమ్ హోటల్ కాబట్టి.. ఉచితంగా వైఫై, వాహనాలు నిలుపుకొనేందుకు పార్కింగ్ స్థలం, ట్రావెల్ ఇన్సూరెన్స్ లభిస్తాయి.
మున్నార్, కుమరకొమ్, మరారి(అలప్పీ), కోవలమ్, వయనాడ్, కొచ్చి తదితర ప్రాంతాల్లో ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ ప్యాకేజీ అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లోని హోటల్ గదుల్లో బస చేస్తూ పనితోపాటు.. కొత్త ప్రాంతపు అందాలను ఆస్వాదించొచ్చు. అయితే, కొవిడ్ దృష్ట్యా సందర్శక ప్రాంతాలను ప్యాకేజీలో భాగం చేయకపోవడం గమనార్హం. ఐదు రాత్రులు ప్యాకేజీలో కనిష్ఠ పరిమితి మరికొన్ని రోజులు అయినా అదనపు చెల్లింపులతో పొడిగించుకునే అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!