సూర్యుడికే నడకలు నేర్పించారు!
చుట్టూ ఎత్తయిన పర్వతాలు. ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. అందులో ఓ చిన్నగ్రామం. 200 మంది ఉంటారు. తరతరాలుగా వారిని ఓ సమస్య వేధిస్తుండేది
ఇంటర్నెట్డెస్క్: చుట్టూ ఎత్తయిన పర్వతాలు. ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. అందులో ఓ చిన్నగ్రామం. 200 మంది ఉంటారు. తరతరాలుగా వారిని ఓ సమస్య వేధిస్తుండేది. పర్వతాలు ఎత్తుగా ఉండటం వల్ల సూర్యకాంతి ఆ గ్రామంపై పడేది కాదు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు అసలు సూర్యుడే కనిపించేవాడు కాదు. దీంతో వారందరిలోనూ ఓ రకమైన మానసిక ఆందోళన మొదలైంది. అలా వందల ఏళ్లు గడిచాయి. కానీ ఇటీవల ఓ ఇంజినీర్ ఆలోచన వారి ఇళ్లల్లో కాంతులు ప్రసరించేలా చేసింది.
ఇటలీలోని ఉత్తర్ మిలాన్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే విగనెల్లా ఓ మారుమూల గ్రామం. పర్వతలోయ ప్రాంతంలో ఉండటం వల్ల కొన్ని నెలల పాటు ఆ గ్రామంపై సూర్యకాంతి పడేది కాదు. వందల ఏళ్లుగా ఆ గ్రామస్థులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆ గ్రామానికి వచ్చిన ఓ ఇంజినీర్కు అద్భుతమైన ఆలోచన తట్టింది. స్థానిక ఆర్కిటెక్ట్తో కలిసి కొండవాలు ప్రాంతంలో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. గ్రామస్థులంతా కలిసి లక్ష యూరోల ధనాన్ని పోగు చేశారు. స్థానిక నాయకుల సహకారంతో 1.1 టన్నుల బరువున్న అద్దాన్ని 1,100 మీటర్ల ఎత్తులో ఏటవాలుగా బిగించారు. దీనికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. సూర్యకాంతి అద్దం మీద పడి గ్రామంపై పరావర్తనం చెందే విధంగా దీనిని ఏర్పాటు చేశారు.
సూర్యక్రాంతి ప్రసరించే మార్గానికి అభిముఖంగా అద్దం దానంతట అది తిరిగేటట్లు సాంకేతికత వినియోగించారు. ఈ అద్దంతో గ్రామం మొత్తం వెలుగులు ఇవ్వలేకపోయినా.. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కాంతిని ప్రసరింపజేయవచ్చు. అందువల్ల ఊరి మధ్యలో ఉన్న చర్చిపై కాంతిపడేలా ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా అక్కడే గుమిగూడుతుంటారు. ఊరి మధ్యలో కాంతి పడటం వల్ల ఆ వెలుతురు దాదాపు గ్రామమంతా విస్తరిస్తోంది. అద్దం ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రవర్తనలోనూ, ఆలోచనా విధానంలోనూ మార్పులు వచ్చినట్లు అక్కడివాళ్లు సంతోషంతో చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విగనెల్లా అద్దం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న