Japan: అరరె.. పిల్లలకు పెద్ద చిక్కొచ్చి పడిందే!
ఓ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దాని ఫలితాలు, పరిణామాలను ముందుగానే అంచనా వేయాలి. ఎలాంటి ఆలోచన.. ప్రణాళిక
ఇంటర్నెట్ డెస్క్: ఓ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దాని ఫలితాలు, పరిణామాలను ముందుగానే అంచనా వేయాలి. ఎలాంటి ఆలోచన.. ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తే.. ఇదిగో జపాన్లోని పలు పాఠశాలల్లో పిల్లలకు ఎదరైన పరిస్థితే ఎదురవుతుంది. ఇంతకీ ఏమైందంటే..
జపాన్కు చెందిన నిప్పాన్ ఫౌండేషన్ సౌజన్యంతో సీ అండ్ జపాన్ అనే ప్రాజెక్టులో భాగంగా అక్కడి ప్రభుత్వం 2019లో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ‘క్లాస్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రాథమికోన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పాఠశాల యాజమాన్యం పంపిణీ చేసే చేపల్ని ఇంటికి తీసుకెళ్లి వాటికి పేరు పెట్టి.. ఆరు నెలల నుంచి ఏడాదిపాటు జాగ్రత్తగా పెంచాలి. ఒక ప్రాణి జీవితం విలువ, చేపల పెంపకం, అందులోని సవాళ్లను నేర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంతో 4వ తరగతి నుంచి 6వ తరగతి చదువున్న విద్యార్థులంతా చేప పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి పెంచడం ప్రారంభించారు. సమస్యల్లా అలా పెంచిన చేపల్ని ఏం చేయాలనేదాని గురించే. కార్యక్రమం ముగిసిన తర్వాత చేపల్ని నదులు, సముద్రంలో వదిలేయాలా? వండుకొని తినాలా? అర్థం కాక చిన్నారులు తికమకపడుతున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ‘క్లాస్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చిన్నారులవి లేత హృదయాలు. చేపలకు పేర్లు పెట్టి.. పెంచుతూ కుటుంబసభ్యులుగా భావిస్తారు. ఆరు నెలల వ్యవధిలో ఆ చేపలతో చిన్నారులకు బలీయమైన బంధం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో వాటిని వదిలేయమన్నా.. వండుకొని తిందామన్నా చిన్నారుల మనసు ఒప్పుకోదు. ఒకవేళ పెంపకంలో పొరపాటు జరిగి చేపలు చనిపోతే.. ఆ అపరాధ భావంతో చిన్నారులు తీవ్ర మానసికక్షోభను అనుభవిస్తారని అంటున్నారు. పెంచిన చేపల్ని నదుల్లోనో, సముద్రంలోనో వదిలేసినా.. మత్స్యకారుల వలలో చిక్కి లేదా పెద్ద చేపలకు ఆహారంగానో మారిపోతాయని వాదిస్తున్నారు. ఈ అంశం నెట్టింట్లో హాట్ టాపిక్గా మారడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చేపల్ని తినడం మంచిదంటే.. మరికొందరు తినడం కన్నా వాటిని వదిలేయడం మంచిదని చెబుతున్నారు.
తాజాగా ఓ పాఠశాలలో ఈ కార్యక్రమం ముగింపును టీవీలో ప్రసారం చేశారు. పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థుల్ని మీరు పెంచిన చేపల్ని ఏం చేద్దామని ప్రశ్నించగా.. వారిలో 11 మంది చేపల్ని వండుకొని తినడానికి ఓటు వేయగా.. ఆరుగురు నీటిలో వదిలేయాలని కోరారు. అయితే, తినాలనుకున్న విద్యార్థులకు కూడా వండిన ఆ చేపల్ని తినలేకపోయారు. చేపలు తినడం సహజమే అయినా.. పెంచిన వాటిని తినడానికి వారికి మనసొప్పలేదు. కాగా.. ఇలాంటి కార్యక్రమమే జపాన్ గతంలోనూ నిర్వహించింది. విద్యార్థులకు గుడ్లు ఇచ్చి.. వాటి నుంచి వచ్చే కోడి పిల్లల్ని పెంచి.. వండుకోని తినాలని, దాని వల్ల తినే ఆహారం.. ఒక జీవి ప్రాణం విలువ తెలుస్తాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?