రోడ్లపైనే నిద్ర.. అదో అంటువ్యాధట!
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. జపాన్లోని ఓ ప్రాంతం మరో అంటువ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘రోజో-ని(రోడ్డుపైనే పడుకోవడం)’అనే వ్యాధి అక్కడి ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రజలను అదుపు చేయలేక
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. జపాన్లోని ఓ ప్రాంతం మరో అంటువ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘రోజో-ని(రోడ్డుపైనే పడుకోవడం)’అనే వ్యాధి అక్కడి ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రజలను అదుపు చేయలేక పోలీసులు ప్రతి రోజు తంటాలు పడుతున్నారట.
మందుబాబులకు మద్యం ఎక్కువై రోడ్ల పక్కన పడిపోవడం సర్వసాధారణ విషయమే. కానీ జపాన్లోని ఒకినవా ప్రాంతంలో మద్యం తాగినా, తాగకపోయినా రాత్రుళ్లు చాలా మంది రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడుకోవడం మొదలుపెట్టారట. అలా నడి రోడ్లపై పడుకునేవాళ్లతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వారిని ఢీ కొడతామోనని భయపడుతున్నారు. ప్రమాదం జరిగి రోడ్లపై పడుకున్నవారి ప్రాణాలు సైతం పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే ఎవరైనా అలా పడుకోవడం కనిపించగానే వాహనదారులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని వారిని తీసుకెళ్తున్నారు. గత ఏడాది ఇలా రోడ్లపై పడుకునే వారిపై నమోదైన కేసుల సంఖ్య 7వేలకు పైగా ఉందట. పోలీసులు దీనిని ‘రోజో-ని’ స్థానిక అంటువ్యాధిగా భావిస్తున్నారు.
ఒకినవాలో కొన్నేళ్ల కిందట వెలుగుచూసిన ఇలాంటి ఘటన రానురాను అంటువ్యాధిలా మారిందట. ఈ వ్యాధి ఎలా వచ్చిందో.. ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పోలీసులు అంటున్నారు. ఈ అంటు వ్యాధి వల్ల మగవారితోపాటు ఆడవాళ్లూ రాత్రుళ్లు రోడ్లపై పడుకుంటున్నారు. ఇందుకు గల కారణాలపై పలు వాదనలు వినిపిస్తున్నారు. కొందరు కేవలం మద్యం సేవించడం వల్లే ఇలా చేస్తున్నారని, మరికొందరు వాతావరణం ఏడాది పొడువునా వేడిగా ఉండటంతో చల్లదనం కోసం రోడ్లపై పడుకుంటున్నారని వాదిస్తున్నారు. దీనిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై పడుకునే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు 470 డాలర్ల జరిమానా విధిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ఇలాంటి ఘటనలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయట. దీనికి తగిన పరిష్కారం కోసం అక్కడి అధికార యంత్రాంగం పరిశోధనలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్