Largest land owner: 22 లక్షల ఎకరాల భూస్వామి.. ‘జాన్ మెలోన్’
అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిల్లో ఒకరిగా ఉంటూ 22 లక్షల ఎకరాల భూమికి యజమాని జాన్మెలోన్
ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే మనకు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్ వంటి వారు గుర్తొస్తారు. వీరంతా అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారే. అయితే, వీరు సొంతంగా వ్యాపారాలు, షేర్లు, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి అధికంగా ఆర్జిస్తుంటారు. కానీ, వీరికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో తెలుసా? అలాగే వీరందరికంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరున్నారు. ఆయన మీడియాలో కనిపించరు. ఆయనే ‘జాన్ మెలోన్’. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఆయనొకరు. 22 లక్షల ఎకరాల భూస్వామి. ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఎవరీ జాన్ మెలోన్..?
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల్లో జాన్ మెలోన్ ఒకరు. అమెరికాలో ‘లిబర్టీ మీడియా’ అనే ప్రముఖ టీవీ ఛానెల్ను స్వంతగా స్థాపించారు. దానికి ఛైర్మన్గా ఉంటూ మీడియా దిగ్గజాలలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ మీడియా ఆస్తుల్లో అధిక వాటా కలిగిన వ్యక్తిగా రూపర్ట్ ముర్డోక్ ఎంత ఫేమసో ఆయన కంటే ఎక్కువగా జాన్ మెలోన్ అందులో పెట్టుబడి పెట్టారు. కొన్ని సమయాల్లో వారెన్ బఫెట్ కంటే కూడా అధికంగా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించారు.
మెలోన్కు డిస్కవర్ కమ్యూనికేషన్స్లో 28 శాతం, లిబర్టీ గ్లోబల్లో 25 శాతం షేర్లు ఉన్నాయి. లిబర్టీ గ్లోబల్ అనేది అంతర్జాతీయ కేబుల్ కంపెనీ. దీనికి 30 లక్షలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా అట్లాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్టులో 8 శాతం షేర్లు కూడా ఉన్నాయి. అన్నింటికంటే అమెరికాలో అత్యధికంగా భూమి కలిగిన వారిలో జాన్ మెలోన్ అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది. ఆయన నికర సంపాదన విలువ సుమారు 9.22 బిలియన్ డాలర్లు. అనేక మీడియా ఒప్పందాలు, భూ యాజమాన్యంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ఆయన్ను ముద్దుగా ‘కేబుల్ కౌబాయ్’ అని పిలుస్తుంటారు.
ఆయన ప్రస్థానమిది..
జాన్ మెలోన్ 1941 మార్చి 7న న్యూయార్క్లో ఉన్న కనెక్టికట్ నగరంలోని మిల్ఫోర్డ్లో జన్మించారు. ప్రతిష్ఠాత్మక హాప్కిన్స్ స్కూల్, యేల్ యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఎన్నో టెలికాం ఆవిష్కరణలు, లేజర్ బీమ్, రేడియో ట్రాన్స్మిషన్ అభివృద్ధికి దోహదపడిన న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పేరును నమోదు చేసుకుని బెల్ ల్యాబ్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడే ఆయన టెలికామ్ ఇండస్ట్రీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
29 ఏళ్లకే సీఈవోగా..
1967లో జాన్ హాప్కిన్స్కు తిరిగొచ్చి ఆపరేషన్ రీసెర్చ్లో పీహెచ్డీ పట్టా పొందారు. 1968లో ప్రపంచవ్యాప్త మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే కంపెనీలో చేరాడు. ఐదేళ్లు అందులో పనిచేసి.. తర్వాత కేబుల్ టీవీ పరిశ్రమ కోసం చిన్న కంప్యూటర్లను సబ్సిడీకే ఉత్పత్తి చేసే జెరోల్డ్ అనే సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో టెలికమ్యూనికేషన్కు (TCI) సీఈవో అయ్యారు. అప్పుడు మెలోన్ వయసు 29 సంవత్సరాలే. తర్వాత 1999లో 50 బిలియన్ల డాలర్లకు ఏటీ అండ్ టీ అనే సంస్థను కొనుగోలు చేశారు. టీసీఐలో ఇతర కంపెనీల వాటాలను, చిన్న ఆపరేటర్లను కేవలం 17ఏళ్లలో పక్కకు తప్పించారు. మెలోన్ నిర్వహణలోనే ఆ సంస్థ 8.5 లక్షల చందాదారులను చేరుకుంది. టైమ్ వార్నర్ మీడియా తర్వాత రెండో అతిపెద్ద కేబుల్ కంపెనీగా ఎదిగింది. ఆ సమయంలో మెలోన్ను అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ 'డార్త్ వాడర్'తో పోల్చారు.
లిబర్టీ మీడియాకు ఛైర్మన్గా..
1991లో టెలికమ్యూనికేషన్ నుంచి లిబర్టీ మీడియాను జాన్ మెలోన్ కొనుగోలు చేశారు. ఆయన నేతృత్వంలోనే లిబర్టీ మీడియా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. కేవలం కేబుల్ సేవలను అందించే స్థాయి నుంచి డిస్కవరీ ఛానల్, క్యూవీసీ, వర్జిన్ మీడియా వంటి వాటిని బ్రాడ్కాస్ట్ చేసే స్థాయికి సంస్థను తీసుకొచ్చారు. 2007లో అట్లాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ టీమ్ను కొనుగోలు చేశారు. ఆటో రేసింగ్ లీగ్ ఫార్ములా వన్ను కూడా కొన్నారు. అప్పుడే చాలా మంది ఆయనపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, అమెరికాలో క్రీడల పరిధిని విస్తరించేందుకే కొనుగోలు చేశామని మెలోన్ స్పష్టం చేశారు.
22 లక్షల ఎకరాల భూస్వామిగా..
కేబుల్ టెలివిజన్ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయించడంలో మెలోన్ సంతృప్తి చెందలేదు. పెన్సిల్వేనియాలో ఒక ఫామ్కి వేసవి విడిదికి వచ్చిన ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట న్యూ మెక్సికోలోని బెల్ రాంచ్ను 2,90,100 ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్వుడ్ ఫామ్స్ను స్వంతం చేసుకున్నారు. అలాగే మేరీల్యాండ్, మైనే, న్యూ హాంప్షైర్, కొలరాడో, వ్యోమింగ్ ప్రాంతాల్లో కొన్ని భూభాగాలను కొనుగోలు చేశారు. మొత్తం 22 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమెరికాలో అతిపెద్ద భూయజమానిగా పేరుగాంచారు. తనకున్న మొత్తం భూమి రోడ్ ఐలాండ్లో మూడు రెట్లు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2011లో ఒకేసారి 12లక్షల ఎకరాల భూమిని మైనేలో కొనుగోలు చేశారు. దాంతో తన స్నేహితుడు టెడ్ టర్నర్ని అధిగమించి అమెరికాలో అతిపెద్ద భూస్వామిగా ఎదిగారు. అమెరికాలోనే కాకుండా ఐర్లాండ్లోని విక్లోలో 32,669 చదరపు అడుగులతో ఉన్న హ్యూమ్వుడ్ కోటతో పాటు డబ్లిన్లో హోటళ్లు కూడా ఉన్నాయి.
యూనివర్సిటీల అభివృద్ధికి చేయూత..
జాన్ మలోన్ ఒక మల్టీ బిలియనీర్, పడవల యజమాని, టెలికమ్యూనికేషన్స్కు అధిపతిగానే కాకుండా దాతగానూ ప్రసిద్ధి చెందారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చాలా డబ్బును వెచ్చించారు. 2000లో యేల్ డేనియల్ ఎల్ అనే ఇంజినీరింగ్ సెంటర్ నిర్మాణానికి 24 మిలియన్ డాలర్లు, 2011లో ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయానికి 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జాన్ హాప్కిన్స్ వైటింగ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ హోంవుడ్ క్యాంపస్లో ఒక కొత్త భవనం నిర్మించడానికి 30 మిలియన్ డాలర్లను అందించారు. ఇటీవల మెలోన్ భార్య లెస్లీ మెలోన్ సైతం క్లొరాడో స్టేట్ యూనివర్సిటీకి 42.5లక్షల మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. మెలోన్ అమెరికా రాజకీయాల్లో ప్రవేశించలేదు. కానీ, ఆయన తన తోటి స్నేహితుడు రూపర్ట్ ముర్డోక్తో కలిసి డొనాల్డ్ ట్రంప్నకు మద్దతునిచ్చారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి జాన్ మెలోన్ 1 లక్ష మిలియన్లను విరాళంగా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం