Largest land owner: 22 లక్షల ఎకరాల భూస్వామి.. ‘జాన్ మెలోన్’
అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిల్లో ఒకరిగా ఉంటూ 22 లక్షల ఎకరాల భూమికి యజమాని జాన్మెలోన్
ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే మనకు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్ వంటి వారు గుర్తొస్తారు. వీరంతా అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారే. అయితే, వీరు సొంతంగా వ్యాపారాలు, షేర్లు, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి అధికంగా ఆర్జిస్తుంటారు. కానీ, వీరికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో తెలుసా? అలాగే వీరందరికంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరున్నారు. ఆయన మీడియాలో కనిపించరు. ఆయనే ‘జాన్ మెలోన్’. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఆయనొకరు. 22 లక్షల ఎకరాల భూస్వామి. ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఎవరీ జాన్ మెలోన్..?
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల్లో జాన్ మెలోన్ ఒకరు. అమెరికాలో ‘లిబర్టీ మీడియా’ అనే ప్రముఖ టీవీ ఛానెల్ను స్వంతగా స్థాపించారు. దానికి ఛైర్మన్గా ఉంటూ మీడియా దిగ్గజాలలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ మీడియా ఆస్తుల్లో అధిక వాటా కలిగిన వ్యక్తిగా రూపర్ట్ ముర్డోక్ ఎంత ఫేమసో ఆయన కంటే ఎక్కువగా జాన్ మెలోన్ అందులో పెట్టుబడి పెట్టారు. కొన్ని సమయాల్లో వారెన్ బఫెట్ కంటే కూడా అధికంగా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించారు.
మెలోన్కు డిస్కవర్ కమ్యూనికేషన్స్లో 28 శాతం, లిబర్టీ గ్లోబల్లో 25 శాతం షేర్లు ఉన్నాయి. లిబర్టీ గ్లోబల్ అనేది అంతర్జాతీయ కేబుల్ కంపెనీ. దీనికి 30 లక్షలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా అట్లాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్టులో 8 శాతం షేర్లు కూడా ఉన్నాయి. అన్నింటికంటే అమెరికాలో అత్యధికంగా భూమి కలిగిన వారిలో జాన్ మెలోన్ అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది. ఆయన నికర సంపాదన విలువ సుమారు 9.22 బిలియన్ డాలర్లు. అనేక మీడియా ఒప్పందాలు, భూ యాజమాన్యంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ఆయన్ను ముద్దుగా ‘కేబుల్ కౌబాయ్’ అని పిలుస్తుంటారు.
ఆయన ప్రస్థానమిది..
జాన్ మెలోన్ 1941 మార్చి 7న న్యూయార్క్లో ఉన్న కనెక్టికట్ నగరంలోని మిల్ఫోర్డ్లో జన్మించారు. ప్రతిష్ఠాత్మక హాప్కిన్స్ స్కూల్, యేల్ యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఎన్నో టెలికాం ఆవిష్కరణలు, లేజర్ బీమ్, రేడియో ట్రాన్స్మిషన్ అభివృద్ధికి దోహదపడిన న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పేరును నమోదు చేసుకుని బెల్ ల్యాబ్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడే ఆయన టెలికామ్ ఇండస్ట్రీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
29 ఏళ్లకే సీఈవోగా..
1967లో జాన్ హాప్కిన్స్కు తిరిగొచ్చి ఆపరేషన్ రీసెర్చ్లో పీహెచ్డీ పట్టా పొందారు. 1968లో ప్రపంచవ్యాప్త మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే కంపెనీలో చేరాడు. ఐదేళ్లు అందులో పనిచేసి.. తర్వాత కేబుల్ టీవీ పరిశ్రమ కోసం చిన్న కంప్యూటర్లను సబ్సిడీకే ఉత్పత్తి చేసే జెరోల్డ్ అనే సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో టెలికమ్యూనికేషన్కు (TCI) సీఈవో అయ్యారు. అప్పుడు మెలోన్ వయసు 29 సంవత్సరాలే. తర్వాత 1999లో 50 బిలియన్ల డాలర్లకు ఏటీ అండ్ టీ అనే సంస్థను కొనుగోలు చేశారు. టీసీఐలో ఇతర కంపెనీల వాటాలను, చిన్న ఆపరేటర్లను కేవలం 17ఏళ్లలో పక్కకు తప్పించారు. మెలోన్ నిర్వహణలోనే ఆ సంస్థ 8.5 లక్షల చందాదారులను చేరుకుంది. టైమ్ వార్నర్ మీడియా తర్వాత రెండో అతిపెద్ద కేబుల్ కంపెనీగా ఎదిగింది. ఆ సమయంలో మెలోన్ను అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ 'డార్త్ వాడర్'తో పోల్చారు.
లిబర్టీ మీడియాకు ఛైర్మన్గా..
1991లో టెలికమ్యూనికేషన్ నుంచి లిబర్టీ మీడియాను జాన్ మెలోన్ కొనుగోలు చేశారు. ఆయన నేతృత్వంలోనే లిబర్టీ మీడియా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. కేవలం కేబుల్ సేవలను అందించే స్థాయి నుంచి డిస్కవరీ ఛానల్, క్యూవీసీ, వర్జిన్ మీడియా వంటి వాటిని బ్రాడ్కాస్ట్ చేసే స్థాయికి సంస్థను తీసుకొచ్చారు. 2007లో అట్లాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ టీమ్ను కొనుగోలు చేశారు. ఆటో రేసింగ్ లీగ్ ఫార్ములా వన్ను కూడా కొన్నారు. అప్పుడే చాలా మంది ఆయనపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, అమెరికాలో క్రీడల పరిధిని విస్తరించేందుకే కొనుగోలు చేశామని మెలోన్ స్పష్టం చేశారు.
22 లక్షల ఎకరాల భూస్వామిగా..
కేబుల్ టెలివిజన్ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయించడంలో మెలోన్ సంతృప్తి చెందలేదు. పెన్సిల్వేనియాలో ఒక ఫామ్కి వేసవి విడిదికి వచ్చిన ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట న్యూ మెక్సికోలోని బెల్ రాంచ్ను 2,90,100 ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్వుడ్ ఫామ్స్ను స్వంతం చేసుకున్నారు. అలాగే మేరీల్యాండ్, మైనే, న్యూ హాంప్షైర్, కొలరాడో, వ్యోమింగ్ ప్రాంతాల్లో కొన్ని భూభాగాలను కొనుగోలు చేశారు. మొత్తం 22 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమెరికాలో అతిపెద్ద భూయజమానిగా పేరుగాంచారు. తనకున్న మొత్తం భూమి రోడ్ ఐలాండ్లో మూడు రెట్లు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2011లో ఒకేసారి 12లక్షల ఎకరాల భూమిని మైనేలో కొనుగోలు చేశారు. దాంతో తన స్నేహితుడు టెడ్ టర్నర్ని అధిగమించి అమెరికాలో అతిపెద్ద భూస్వామిగా ఎదిగారు. అమెరికాలోనే కాకుండా ఐర్లాండ్లోని విక్లోలో 32,669 చదరపు అడుగులతో ఉన్న హ్యూమ్వుడ్ కోటతో పాటు డబ్లిన్లో హోటళ్లు కూడా ఉన్నాయి.
యూనివర్సిటీల అభివృద్ధికి చేయూత..
జాన్ మలోన్ ఒక మల్టీ బిలియనీర్, పడవల యజమాని, టెలికమ్యూనికేషన్స్కు అధిపతిగానే కాకుండా దాతగానూ ప్రసిద్ధి చెందారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చాలా డబ్బును వెచ్చించారు. 2000లో యేల్ డేనియల్ ఎల్ అనే ఇంజినీరింగ్ సెంటర్ నిర్మాణానికి 24 మిలియన్ డాలర్లు, 2011లో ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయానికి 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జాన్ హాప్కిన్స్ వైటింగ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ హోంవుడ్ క్యాంపస్లో ఒక కొత్త భవనం నిర్మించడానికి 30 మిలియన్ డాలర్లను అందించారు. ఇటీవల మెలోన్ భార్య లెస్లీ మెలోన్ సైతం క్లొరాడో స్టేట్ యూనివర్సిటీకి 42.5లక్షల మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. మెలోన్ అమెరికా రాజకీయాల్లో ప్రవేశించలేదు. కానీ, ఆయన తన తోటి స్నేహితుడు రూపర్ట్ ముర్డోక్తో కలిసి డొనాల్డ్ ట్రంప్నకు మద్దతునిచ్చారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి జాన్ మెలోన్ 1 లక్ష మిలియన్లను విరాళంగా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్