JP Nadda : నడ్డాపై అగ్రనేతల నమ్మకం.. టార్గెట్ 2024
భాజపా అగ్రనేతలంతా జగత్ ప్రకాశ్ నడ్డాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా 2024 వరకు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. నడ్డా సారథ్యంలోనే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలేంటో తెలుసుకోండి మరి.
భారతీయ జనతా పార్టీ(bjp) అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా(jp nadda) పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు(lok sabha election) ముందున్న నేపథ్యంలో అగ్రనేతలంతా నడ్డా సారథ్యంపై నమ్మకం పెట్టుకున్నారు. పలు రాష్ట్రాల్లో.. మరోసారి కేంద్రంలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని విశ్వసిస్తున్నారు.
కొవిడ్ కాలం.. పార్టీ విస్తరణతో విజయాలు
2020 జనవరిలో భారతీయ జనతాపార్టీ 11వ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యతలు చేపట్టారు. అమిత్ షా(amit shah) కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రబలింది. దీంతో రాజకీయ పర్యటనలకు, సభలకు, సమావేశాలకు తావు లేకుండా పోయింది. అయినా వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ సమావేశాల ద్వారా నడ్డా కేడర్తో సంప్రదింపులు జరిపారు. ‘సేవా హి సంఘటన్’ కార్యక్రమం ద్వారా కష్టకాలంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆ తర్వాతి కాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు నడ్డా తీవ్రంగా కృషి చేశారు. పశ్చిమబెంగాల్(west bengal)లో బలంగా ఉన్న మమతా బెనర్జీని ఎదుర్కొనే స్థాయికి పార్టీ కేడర్ను తీసుకెళ్లారు. భాజపాకు ఆదరణ లేని రాష్ట్రాల్లోనూ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించి నేతల్లో జోష్ నింపారు. దీంతో జిల్లాస్థాయి కేడర్ కూడా పుంజుకొని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కారణమైంది. అయితే ఇటీవల నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. దిల్లీలో మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు.
‘టాప్-3’.. మార్పు వద్దని..
భాజపా అనగానే ఒక స్థిరమైన విధానాలతో ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీగా ప్రజలకు కన్పిస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారం చేపట్టినా అక్కడ వివాదాలకు తావు లేని నాయకత్వం ఉంటుంది. గోవా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సీఎంలను మార్చడం మినహా ఆ పార్టీలో పెద్దగా కుదుపులు కనిపించవు. అడపాదడపా ఎదురయ్యే అడ్డంకులను అధినాయకత్వం ఎప్పటికప్పుడు చక్కదిద్దుతూ ఉంటుంది.
భాజపాలో ప్రస్తుతం ‘టాప్-3’గా కన్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ(narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిలో అధ్యక్షుడిని మారిస్తే పార్టీని కేడర్, ఓటర్లు చూసే కోణం కూడా మారుతుందనే ఆలోచన సీనియర్ నేతలలో వ్యక్తమై ఉండొచ్చు. పైగా ఈ సమయంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే కొన్ని చిక్కులు తప్పవు. కొత్తగా ఎన్నికైన నేతకు 9 రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ బాధ్యతలు చూడటం కష్టతరమవుతుంది. నడ్డాకు ఉన్న అవగాహన, పరిచయాలు ఇప్పటికిప్పుడు నూతన అధ్యక్షుడికి సాధ్యం కావు. అందువల్లనే నడ్డాను అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
9 రాష్ట్రాలు.. 116 ఎంపీ స్థానాలు
ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర ముఖ్య నేతలందరూ నడ్డా కొనసాగింపు వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే నడ్డా పదవీ కాలంలో భాజపాకు ఆశించిన విజయాలు దక్కాయి. అయితే ఇప్పుడు ఆయన ముందు మరో ముఖ్యమైన బాధ్యత ఉంది. అదే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గడ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరు సాగనుంది. ఇందులో మూడు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో 116 ఎంపీ స్థానాలున్నాయి. అవి కేంద్రంలో భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు మించి 2024లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో