Stunt rider : ఈ అమ్మాయి స్టంట్స్ చూస్తే ఔరా అనాల్సిందే!
కేరళకు చెందిన ఓ అమ్మాయి బైక్ రైడర్గా రాణిస్తూ అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ఆమె టాలెంట్ చూసి పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
(Image : Instagram)
సాధారణంగా అమ్మాయిల సామాజిక మాధ్యమాల(Social media) ఖాతాలను పరిశీలిస్తే ఎక్కువగా అందానికి(Beauty), ఫ్యాషన్(Fashion)కు ప్రాధాన్యమిచ్చే అంశాలు కన్పిస్తుంటాయి. కానీ కేరళ(Kerala)కు చెందిన తానా లూసియా జోజి ఇన్స్టా(Instagram) ఖాతాలో మాత్రం ఆమె బైక్(Bike)పై చేసే విన్యాసాల చిత్రాలు(Photos), వీడియోలు(Vedio) దర్శనమిస్తాయి. ఫ్రాన్స్(France)కు చెందిన ప్రముఖ లేడీ స్టంట్ రైడర్(Stunt rider) సారా లెజిటోను స్ఫూర్తిగా తీసుకొని సాహసం శ్వాసగా సాగిపోతున్న జోజి స్టంట్స్ ప్రయాణంపై ఓ లుక్కేయండి.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
కేరళ(Kerala)లోని కొట్టాయంకు చెందిన తానా లూసియా జోజికి చిన్నప్పటి నుంచే బైక్(Bike)లపై విపరీతమైన ఆసక్తి చూపేది. హోండా యాక్టివా నడుపుతూ తానూ ఓ రేసర్(Racer)లా ఫీలయ్యేది. తరువాత ఇంజినీరింగ్ చదివేందుకు కక్కనాడ్లోని రాజగిరి కళాశాలలో చేరింది. ఆ సమయంలో ఓ బైక్పై చిన్నపాటి స్టంట్(Stunt) చేయడంతో ఆమెకేదో తెలియని ఆనందం కలిగింది. ఆ వీడియోను తన తల్లిదండ్రులు డాక్టర్ జోజి అబ్రహం, డాక్టర్ దీపాకు చూపించింది. అది చూసిన తరువాత వారు తమ కూతురు యాక్టివా నడిపే స్థాయి దాటేసిందనే నమ్మకానికి వచ్చారు. ఆమె కోరిక మేరకు బైక్ కొనివ్వడానికి సమ్మతించారు. అలా తానా తొలిసారి బజాజ్ అవెంజర్ కొనుగోలు చేసింది. అప్పట్లో హైట్ గురించి ఆలోచించి ఆ బైక్ కొనుగోలు చేసినట్లు తానా ఓ సందర్భంలో వెల్లడించింది.
స్టంట్ రైడింగ్ వైపు అడుగులు
కొత్త బైక్ కొన్న ఆ తర్వాత నుంచి తానా ప్రొఫెషనల్ స్టంట్ రైడింగ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే అభ్యంతరం తెలిపారు. తొలుత చదువు పూర్తి చేసి కెరీర్పై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. కానీ ఆమె మనసంతా స్టంట్ రైడింగ్పైనే ఉండేది. అందుకే సెమిస్టర్ బ్రేక్ మధ్యలో స్టంట్ రైడింగ్ నేర్చుకుంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. స్టంట్ రైడింగ్లో శిక్షణ తీసుకోవడానికి ఆమె గౌతమ్ సురేశ్ను సంప్రదించింది. అతడో టాప్ బైక్ రైడర్. ఓ ప్రమాదానికి గురి కావడంతో చాలాకాలం స్టంట్లకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత నుంచి అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తున్నాడు. మొదట్లో తానాకు స్టంట్స్ నేర్పించడానికి సురేశ్ ఒప్పుకోలేదు. కానీ తానా పట్టుదల చూసి చివరికి ఓకే చెప్పాడు.
(Image : Instagram)
విన్యాసాల్లో రాటుదేలి..
తొలి నుంచి తానాకు స్టంట్ రైడింగ్పై ఆసక్తి ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఆ విద్యపై పట్టు సాధించింది. స్టాపీ, వీలీ ఇలా రకరకాలైన స్టంట్లు చేయడంతో రాటుదేలింది. ఇవన్నీ చేస్తూనే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. దాంతో తానా సామర్థ్యంపై ఆమె తల్లిదండ్రులకు పూర్తిగా నమ్మకం కలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు సాగితే ఈ క్రీడ సైతం అమ్మాయిలకు మంచిదేనని ఆమె తల్లిదండ్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఆడపిల్లలకు ఇవన్నీ ఎందుకని బంధువులు విమర్శిస్తే ‘మా అమ్మాయి ఆనందానికి మేమొందుకు అడ్డుకట్ట వేయాలని’ తానా తల్లి దీప దీటుగా సమాధానమిస్తోంది.
సాహస చిత్రాలతో పోస్టులు
తానా కేరళలో ఓ ఫ్రొఫెషనల్ మహిళా బైక్ రైడర్గా పేరు తెచ్చుకుంది. మన దేశంలో ఈ క్రీడకు తగిన ఆదరణ లేదు. పైగా దీన్ని పోకిరీలు వీధుల్లో ప్రదర్శించే విద్యగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ ముద్ర పడకుండా తానా పూర్తి జాగ్రత్తలు తీసుకొంటోంది. రద్దీ రోడ్లపై ఎప్పుడూ అలాంటి సాహసాలు చేయలేదు. ప్రస్తుతం తానాకు ఇన్స్టాలో 28వేల మంది ఫాలోవర్లున్నారు. అందులో తన స్టంట్స్, ఇతర విషయాలను పోస్టు చేస్తుంటుంది. తానా ‘స్ట్రీట్ లార్డ్స్’ అనే బైక్ స్టంట్ బృందంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. కొన్ని షోలు, ప్రకటనలు చేయడం ద్వారా ఈ బృందానికి ఆదాయం లభిస్తోంది. బైక్ కంపెనీలు, ఇతర ఉత్పత్తుల తయారీదారులు మార్కెటింగ్లో భాగంగా ఈ స్టంట్ రైడర్లను సంప్రదిస్తుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా