Adventure journey : లండన్-కోల్కతా.. బస్సులో వచ్చారు!
భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఓ సుదూర బస్సు ప్రయాణం లండన్-కోల్కతాకు సాగింది.
విహార యాత్ర కోసం లండన్ నుంచి 30వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కొందరు పర్యాటకులు కోల్కతాకు బస్సులో వచ్చారంటే నమ్ముతారా? భారత్కు స్వాతంత్య్రం (Independence) వచ్చిన తరువాత జరిగిందీ సంఘటన. ఆ యాత్ర ప్రత్యేకత ఏంటో చదివేయండి.
20 మంది ప్రయాణికులతో..
అది 1957 ఏప్రిల్ 15. లండన్(London) నుంచి కోల్కతాకు(Kolkata) ఓ బస్సు విక్టోరియా కోచ్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆ బస్సు ‘ఏఈసీ రేగల్ 3’ మోడల్కు చెందినది. ధైర్యవంతుడైన డ్రైవర్ ఓస్వాల్డ్ జోసెఫ్ ఆ వాహనాన్ని నడిపిస్తున్నాడు. ప్రయాణానికి టికెట్ ఖరీదు 85 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.8,330. అదే బస్సులో తిరుగు ప్రయాణానికి 65 డాలర్లుగా(రూ.6357) ధర నిర్ణయించారు.
సుదీర్ఘ ప్రయాణం కావడంతో బస్సు ఆగిన చోట యాత్రికులు హోటళ్లలో బస చేసేవారు. ఒక వేళ హోటల్ దొరకకపోతే ఆరు బయటే టెంట్లు వేసుకొని నిద్రించేవారు. బస్సు లోపల కూడా స్లీపింగ్ కంపార్ట్మెంట్లున్నాయి. గాలి కోసం ఫ్యాన్లు, పాటలు వినడానికి రేడియో సౌలభ్యం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల రోడ్లు దారుణంగా ఉండేవి. దాంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని లోపలున్న వారు భయభయంగా గడిపేవారు. లండన్ నుంచి మొదలైన బస్సు ఫ్రాన్స్(France), ఇటలీ, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, పాకిస్థాన్ గుండా ప్రయాణించి జూన్ 5న కోల్కతా చేరింది. భారత్లో అడుగుపెట్టిన తరువాత పర్యాటకులు బనారస్, తాజ్మహల్, రాజ్పథ్ వంటి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలకు వెళ్లారు. దిల్లీలోని అనేక మార్కెట్లను సందర్శించి గుర్తుగా వస్తువులు కూడా కొన్నారు. అలా 20 మందితో భారత్కు వచ్చిన అదే బస్సులో తిరుగు ప్రయాణానికి 7 మంది మాత్రమే సిద్ధమయ్యారంటే ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రయాణం గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియడంతో పర్యాటకులు ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడ పత్రికా విలేకరులు వీరి కోసం ఎదురు చూసేవారు. ఈ సుదూర ప్రయాణం గురించి కథనాలు రాశారు.
ఓ పీడకలలా ప్రయాణం!
బస్సు తిరిగి లండన్ వెళ్లే సరికి దాని స్పీడో మీటరులో రీడింగ్ 30వేలకు చేరింది. ఇన్ని వేల కిలోమీటర్లు బస్సు(Bus) ప్రయాణంపై డ్రైవర్ గారో ఫిషర్ వివిధ పత్రికలతో మాట్లాడుతూ తన అనుభవాన్ని వివరించాడు. అనేక శిఖరాలపై ప్రయాణం భయానకంగా సాగిందని తెలిపాడు. టర్కీలోని మౌంట్ ఆరారత్ రీజియన్లో హెయిర్పిన్ టర్న్లలో బస్సు తిప్పడం కష్టంగా ఉండేదని చెప్పాడు. అంతే కాదు ఇరాన్లోని ఎడారి ప్రాంతంలో బస్సు నిలిపినప్పుడు అది కూరుకుపోకుండా టైర్ల కింద చెక్కలను ఉంచేవారమని వివరించాడు. ఇసుక తుపానులు, ఆకస్మిక వర్షాలు, దుమ్ము, విపరీతమైన ఎండ.. ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటే అదొక పీడకలలా అనిపిస్తుందని డ్రైవర్ చెప్పాడు. భారత్లో అడుగుపెట్టాక చాలా మంది తమను ఆశ్చర్యంగా చూశారని పేర్కొన్నాడు.
చనిపోయారని వదంతులు
బస్సు తిరుగు ప్రయాణంలో 1800 కిలోమీటర్ల దూరం పెరిగింది. ఎందుకంటే అప్పటికి ఏసియన్ ఇన్ఫ్ల్యూయెంజా తీవ్రంగా ప్రబలుతోంది. దాంతో పాకిస్థాన్-ఇరానియన్ బోర్డర్ మూసివేశారు. ఫలితంగా పర్యాటకులు మరో మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ బస్సు గురించి కొన్ని వదంతులు కూడా వచ్చాయి. ఇరాన్లో యాత్రికులను బందిపోట్లు చంపేశారనే వార్త దావానలంలా వ్యాపించింది. టెహ్రాన్లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం దాన్ని కొట్టిపారేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన పర్యాటకుల్లో చాలా మంది బస్సులో కాకుండా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తూ తిరుగు పయనమయ్యారు. వారిలో పీటర్ మాస్ ఒకరు. అతను సముద్ర మార్గం ద్వారా మలేసియా వెళ్లాడు. ఆ యువకుడికి డైరీ రాసే అలవాటు ఉండేది. తరువాత ఆ డైరీని ‘ది ఇండియామ్యాన్’ అనే పుస్తకంగా ప్రచురితం చేశాడు.
బ్రేక్ పడింది..
బస్సు యాత్ర విజయవంతంగా పూర్తి కావడంతో గారో ఫిషర్ మరో ట్రిప్నకు సిద్ధమయ్యాడు. అలా దాదాపు 3 రౌండ్లు లండన్-కోల్కతాకు బస్సు నడిచింది. అతడిని అనుకరిస్తూ పలు ఐరోపా దేశాల నుంచి భారత్ వైపు కొన్ని బస్సు సర్వీసులు తిరిగాయి. 1970 నాటికి ఈ మార్గంలోని అనేక దేశాల్లో రాజకీయ, మిలటరీ సంఘర్షణలు తలెత్తడంతో ప్రయాణాలు క్రమంగా ఆగిపోయాయి. ఇటీవల మన దేశానికి చెందిన ‘అడ్వెంచర్ ఓవర్ల్యాండ్’ అనే సంస్థ దిల్లీ నుంచి లండన్కు బస్సు నడపాలని నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల దాన్ని ఇస్తాంబుల్కు మార్చింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?