cool sunglasses : చిప్స్ ప్యాకెట్స్ వ్యర్థాలతో కూలింగ్ గ్లాసెస్.. ఆలోచన అదిరింది!
మార్కెట్లో దొరికే లేస్, కుర్ కురే వంటి చిరుతిళ్ల ప్యాకెట్లను (Chips packets) ఖాళీ చేసి మనం చెత్తలో పడేస్తుంటాం. అలాంటి వాటిని సేకరించి ‘ఆశయ’ అనే స్టార్టప్ కంపెనీ స్టైలిష్ సన్గ్లాసెస్ (Sunglasses) తయారు చేస్తోంది.
(Image : Anish Malpani twitter)
ఆధునిక ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఆ వ్యర్థాలే (Plastic waste) కన్పిస్తున్నాయి. వాటిని ఏరుకొని విక్రయించగా వచ్చిన ఆదాయంతో అనేక మంది బడుగు జీవులు పొట్ట నింపుకొంటున్నారు. ఆ వ్యర్థాలు కొన్ని ఫ్యాక్టరీలకు చేరి తిరిగి ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లుగా మారి మళ్లీ జనావాసంలోకి వస్తున్నాయి. కొన్ని మాత్రం భూమిలో కలిసిపోకుండా ఏళ్ల తరబడి అలానే ఉంటున్నాయి. ఈ ప్లాస్టిక్ సమస్యను నిర్మూలించేందుకు తన వంతుగా ఏం చేయొచ్చని ఆలోచించాడు అనిశ్ మల్పానీ (Anish Malpani) అనే యువకుడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు ‘ఆశయ’ అనే స్టార్టప్ కంపెనీని (Startup company) నెలకొల్పాడు.
రెండేళ్లు కొనసాగిన పరిశోధన
ప్లాస్టిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తే బాగుంటుందనే విషయంపై అనిశ్ సుమారు రెండేళ్లు పరిశోధన చేశారు. అందు కోసం ల్యాబ్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి. చివరికి చలువ కళ్లద్దాలు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాంతో చిప్స్ ప్యాకెట్లు మాత్రమే కాకుండా చాక్లెట్ పేపర్లు, టెట్రా ప్యాక్లు వినియోగించి స్టైలిష్ సన్ గ్లాసెస్ తయారు చేశారు. ‘ప్రపంచంలోనే తొలిసారి తాము చిప్స్ ప్యాకెట్ల వ్యర్థాల నుంచి చలువ కళ్లద్దాలు తయారు చేశామని’ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి అనిశ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తొలుత ఈ ప్రకటనను చాలా మంది కొట్టి పడేశారు. కానీ, కళ్లద్దాలు తయారు చేసిన విధానం గురించి పూర్తి వీడియో చూశాక అంతా నమ్మక తప్పలేదు. తమ ఈ వ్యాపార ప్రయత్నం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అనిశ్ విశ్వసిస్తున్నారు.
తొలుత 500 ఆర్డర్లు
అనిశ్ తాను తయారు చేసిన సరికొత్త కళ్లద్దాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగానే సుమారు 500 ఆర్డర్లు వచ్చాయట. నిజానికి వీటిని ఎవరైనా కొంటారా?అనే సందేహం అనిశ్కు ఉండేదట. కానీ.. క్రమంగా ఆర్డర్లు ఊపందుకోవడంతో తన కష్టం వృథా కాలేదనుకున్నాడు. అనిశ్ చలువ కళ్లద్దాల తయారీతో కేవలం చెత్త సమస్యకు మాత్రమే పరిష్కారం చూపలేదు. చెత్త ఏరుకుంటూ జీవించే వారి బతుకుల్లో మార్పు తేవడం కోసం ఆ పని చేసే ఆరుగురిని తన ల్యాబ్లో ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అంతే కాదు కంపెనీలో వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని చెత్త ఏరుకుని జీవించే వారి పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ప్రకటించాడు.
పేరు సరికొత్తగా..!
అనిశ్ తన చలువ కళ్లద్దాలకు ‘విత్ అవుట్’ అని పేరు పెట్టాడు. కొత్త వస్తువు ఏదైనా మార్కెట్లోకి విడుదల చేస్తే దాని పేరు సరి కొత్తగా ఉంటేనే జనాలను ఆకర్షిస్తుంది. అందుకే ఓ స్నేహితుని సూచన మేరకు ఆ పేరు పెట్టాడు. ఇక ఈ విత్ అవుట్ సన్ గ్లాసెస్ మన్నిక కూడా ఎక్కువేనట. వాటిని కారుతో తొక్కించినా పగిలిపోవని చెబుతున్నారు. సూర్యకాంతి నుంచి రక్షణ కోసం ఈ అద్దాల్లో యూవీ పోలరైజ్డ్ సాంకేతికత వినియోగించారు. ఈ కళ్లద్దాల ఫ్రేమ్పై ఉన్న క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన వ్యర్థాలను ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు, తయారీలో ఎవరు పాల్గొన్నారు వంటి సమాచారం దొరుకుతుంది. ప్రస్తుతానికి అనిశ్ కంపెనీ ల్యాబ్లో మైక్రో పైలట్ ప్లాంట్ నడుస్తోంది. అది రోజుకు 5 కేజీల మల్టీ లేయర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు