లగ్జరీ బ్యూటీ బ్రాండ్పై ‘మురికివాడ రాకుమారి’.. మలీశా ఖర్వా గురించి తెలుసా?
మురికివాడలో పుట్టిన ఓ 14 ఏళ్ల అమ్మాయి.. ఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్కు అంబాసిడర్గా ఎంపికైంది. తన ప్రతిభతో హాలీవుడ్లోనూ అవకాశం దక్కించుకుంది. మలీశా ఖర్వా గురించి తెలుసుకుందామా?
ఇంటర్నెట్ డెస్క్: మురికివాడలో ఉండే ఓ చిన్నారి.. తన ఐదేళ్ల వయసులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ర్యాంప్వాక్ చూసి తాను ఉండాల్సిన ప్రపంచం ఇదేనని డిసైడ్ అయ్యింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమైంది. అదృష్టం కలిసొచ్చి మోడలింగ్లో అడుగుపెట్టిన ఈ బాలిక.. ఆత్మవిశ్వాసంతో సోషల్మీడియా స్టార్గా మారింది. ఇప్పుడు ఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్కు ప్రచారకర్తగా సంతకం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమే 14 ఏళ్ల మలీశా ఖర్వా (Maleesha Kharwa)..!
ఆ హీరో గుర్తించిన మట్టిలో మాణిక్యం..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది మలీశా ఖర్వా. తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్నా.. మలీశాకు ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది. గుక్కతిప్పుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలదు. అదే ఆమెను ప్రత్యేకంగా మార్చింది. మలీశాకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఓ ఫ్యాషన్షోలో ప్రియాంక చోప్రా ర్యాంప్వాక్ చేయడం చూసింది. అప్పుడే తాను కూడా మోడల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అందుకోసం ఏం చేయాలి..? ఎక్కడకు వెళ్లాలి అని తెలియని వయసు ఆమెది. సరిగ్గా ఏడేళ్ల తర్వాత అదృష్టం ఆమె తలుపుతట్టింది.
2020లో హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మన్ ఓ మ్యూజిక్ వీడియో చిత్రీకరణ కోసం ఇండియా టూర్కు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో కరోనా కారణంగా లాక్డౌన్ ఆయన ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన వీడియోలో నటించేందుకు మురికివాడల్లో ఉండే పిల్లల కోసం వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మలీశా ఖర్వా అతడి కంట పడింది. అయితే ఆ వీడియోలోని పాత్రకు ఆమెను కాకుండా మరో చిన్నారిని ఎంపిక చేసుకున్నాడు రాబర్ట్. కానీ మలీశా ఆకట్టుకునే రూపం మాత్రం ఆయన మనసు నుంచి చెరిగిపోలేదు. ఆ తర్వాత ఆ చిన్నారితో మాట్లాడగా మోడల్ కావాలన్న ఆమె కోరికను బయటపెట్టింది. దీంతో రాబర్ట్ ఆమెకు ఆర్థికంగా సాయం చేసేందుకు ‘గో ఫండ్ మి పేజ్’ను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఆమె పేరుపై ఖాతా కూడా తెరిచాడు. తొలినాళ్లలో ఆమె వీడియోలను ఆయనే పోస్ట్ చేశారు.
నటుడు రాబర్ట్ హాఫ్మన్తో మలీశా
స్లమ్ ప్రిన్సెస్..
తన జీవన స్థితిగతులతో పాటు ఎన్నో క్రియేటివ్ వీడియోలను మలీశా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం మొదలుపెట్టింది. దీంతో సోషల్మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఆమె ఖాతాను 2.27లక్షల మంది అనుసరిస్తున్నారు. మలీశా వీడియోలకు ఎంతో పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారల చిత్రాలను ప్రచురించే పీకాక్ మ్యాగజైన్ కూడా మలీశా చిత్రంలో కవర్పేజీని ప్రచురించింది. మోడల్లో పలు ఫొటోషూట్లలో, కార్యక్రమాల్లోనూ మలీశా మెరిసింది. మురికివాడ రాకుమారిగా గుర్తింపు పొందిన ఆమె తన వీడియోల్లో తరచూ #theprincesfromtheslum అని రాస్తుంటుంది.
లగ్జరీ బ్రాండ్కు అంబాసిడర్గా..
ఇప్పుడు మలీశా మరో జాక్పాట్ కొట్టేసింది. ప్రముఖ లగ్జరీ సౌందర్య ఉత్పత్తుల సంస్థ ఫారెస్ట్ ఎసెన్షియల్ సరికొత్తగా చేపట్టిన ‘యువతి కలెక్షన్’కు మలీశా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. ఇటీవల ఈ కంపెనీ మలీశా వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ బ్రాండ్పై తన ఫొటోలను చూసుకుని ఆమె ఎంతో మురిసిపోయింది. పేదరికంలో ఉన్న చిన్నారులకు చదువు అందించాలనే లక్ష్యంగా ఫారెస్ట్ ఎసెన్షియల్ ఈ ‘యువతి కలెక్షన్’ తీసుకొచ్చింది. ఈ పేరుతో తీసుకొచ్చిన ఉత్పత్తుల విక్రయాల నుంచి వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమానికి ఉపయోగించనుంది. దీనికి మలీశాను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం ప్రత్యేకం. ‘‘సాధించాలనే తపన ఉంటే ఎంత పెద్ద కల అయినా నిజం చేసుకోవచ్చని మలీశా నిరూపించింది.’’ అని ఫారెస్ట్ ఎసెన్షియల్ రాసుకొచ్చింది. ఈ వీడియోకు లక్షలకొద్దీ వీక్షణలు, లైక్లు వచ్చాయి.
హాలీవుడ్ సినిమాల్లో..
గతేడాది ఆమె ‘లివ్ యువర్ ఫేరీటెయిల్’ అనే లఘుచిత్రంలో నటించింది. ఆ షార్ట్ఫిల్మ్ నటనపరంగా మలీశాకు ఎంతో పేరు తెచ్చింది. ఇటీవల ఆమె రెండు హాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందమైన చిరునవ్వు.. ఆత్మవిశ్వాసంతో నేటితరంలో ఎంతో మంది అమ్మాయిలకు మలీశా స్ఫూర్తిగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!