Soft drinks : 17 ఏళ్లుగా శీతల పానీయాలు తాగి బతుకుతున్నాడట!
ఇరాన్కు (Iran) చెందిన ఓ వ్యక్తి 2006 నుంచి ఘన ఆహార పదార్థాలు (Food)తీసుకోవడం మానేశాడు. అప్పటి నుంచి కేవలం శీతల పానీయాలు (Soft drinks)మాత్రమే తాగి జీవనం సాగిస్తున్నాడు. ఆ కథేంటో తెలుసుకోండి.
ఇరాన్ (Iran) పౌరుడైన ఘోలమ్రేజా అర్దేశిరికి నిత్యం మనుషులు తింటున్న ఆహారం చూస్తే వికారం కలుగుతుందట. అందుకే గత 17 ఏళ్లుగా కేవలం నీరు, శీతల పానీయాలు (Soft drinks) తాగి జీవనం సాగిస్తున్నాడు. 2006లో ఒక నాటి రాత్రి అతడికి వింత అనుభవం ఎదురైంది. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన తరువాత తన గొంతులో ఏదో ఉందన్న భావన కలిగింది. దాన్ని బయటకు తీద్దామని యత్నించినా సాధ్యపడలేదు. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన తరువాత గొంతులో ఏమీ లేదని, ఏదో ఉన్నట్లు అనుభూతి చెందుతున్నావని అతడికి వైద్యుడు చెప్పారు. ఈ సమాధానంతో కుదుటపడని ఘోలమ్రేజా ఇతర వైద్యులను కూడా సంప్రదించాడు. కానీ, ఎవరూ తన రుగ్మతను రూపుమాపలేకపోయారు.
ఆహారం మానేశాడు!
సొంతంగా ఏం చేస్తే ఆ వ్యాధిని నయం చేసుకోవచ్చోనని అన్వేషించిన ఘోలమ్రేజా చివరికి ఆహారం తీసుకోవడం మానేశాడు. దాంతో అతడికి కొంత సాంత్వన లభించింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడి ఎదుట ఆహారం భుజించడం మానేశారు. ఒక వేళ పొరపాటున వేరెవరైనా తన కళ్లెదుట తింటుంటే మాత్రం జబ్బు మళ్లీ మొదటికొచ్చేదట.
ఆ రాత్రి వింత అనుభూతి!
తన రుగ్మత గురించి ఘోలమ్రేజా మాట్లాడుతూ ‘ఆ రాత్రి నాకు వింత అనుభూతి కలిగింది. నా నోట్లో వెంట్రుకలున్నట్లుగా తోచింది. తలపై ఎన్ని వెంట్రుకలుంటాయో అన్నీ నా నోట్లోనే ఉన్నట్లు.. అవి కడుపులోకి చేరినట్లు అనిపించసాగింది. దానికి పరిష్కారంగా ఏం చేయాలో తోచలేదని’ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. వెంట్రుకలు చుట్టుకుపోయి తన గొంతు పిసికేసినట్లుగా అనిపించిందని.. పిచ్చి పట్టినట్లుగా ఉండిందని ఆయన చెప్పారు.
ఈ వ్యాధిని నయం చేసుకోవడానికి ఘోలమ్రేజాకు తెలిసిన వారు వివిధ రకాల వైద్యుల పేర్లను సూచించారు. వారందరినీ కలిసినా ఆయనకు ఉపశమనం లభించలేదు. చివరికి తనకు పిచ్చి పట్టిందేమోనని కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడి దగ్గరకు కూడా తీసుకెళ్లారు. కానీ, అక్కడా పరిష్కారం దొరకలేదు. అలా చివరి ప్రయత్నంగా ఆహారం తీసుకోవడం మానేసి.. శీతల పానీయాలు తాగడం మొదలుపెట్టాడు. దాంతో తక్షణ ఉపశమనం లభించింది. ప్రస్తుతం రోజంతా కలిపి మూడు పెద్ద శీతల పానీయాల సీసాలు ఖాళీ చేస్తున్నాడు. ఆ తరువాత తనకు ఆకలి కలుగదని ఘోలమ్రేజా చెబుతున్నాడు.
దినచర్యలో వివిధ రకాల శీతల పానీయాలు
ఘోలమ్రేజా విచిత్ర పరిస్థితి గురించి తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు ఆయనను కలిశారు. తాను సోడా తాగిన తొలిసారి మునుపెన్నడూ లేని శక్తి లభించినట్లుగా అనిపించిందని వారికి చెప్పాడు. అందుకే వివిధ రకాల శీతల పానీయాలు తాగడం దినచర్యలో భాగం చేసుకున్నానని వివరించాడు. తాను ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు 32 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. గత 17ఏళ్లుగా ఇంత భిన్నమైన అలవాటుతో జీవిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు.
ప్రస్తుతం ఘోలమ్రేజా వయసు 58 సంవత్సరాలు. చక్కెర స్థాయి అధికంగా ఉండే శీతల పానీయాలు నిత్యం తాగితే ఏం జరుగుతుందనే విషయంపై ఆయనకు అవగాహన ఉంది. అయినా తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెబుతున్నాడు. తరచూ ఎండోస్కోపీ సహా ఇతర ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నా ఎలాంటి అసాధారణ ఫలితం రావడం లేదని వివరించాడు. ఘోలమ్రేజా కేవలం శీతల పానీయాలు కాకుండా వారానికి ఒక సారి సగం గ్లాసు నీరు, ఒక గ్లాసు టీ తాగుతున్నారు. రాత్రిపూట కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్ర వస్తుండటంతో మిగతా సమయం టీవీ చూస్తూ, పజిల్స్ ఛేదిస్తూ కాలం గడుపుతున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా