టార్గెట్ 2153: 180 ఏళ్లు బతకాలని..!
ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుషు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుష్షు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన 48 ఏళ్ల డేవ్ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా 180ఏళ్లు బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో క్రైయోథెరపీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులను పాటిస్తున్నాడు. తన జీవగడియారాన్ని వెనక్కి తిప్పి తన శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపర్చుకుంటున్నాడు. దీన్నే ‘బయోహ్యాకింగ్’ అంటారని, దీని ద్వారా తాను కచ్చితంగా 2153 వరకు జీవించి ఉంటానని డేవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఎముక మజ్జను తొలగించి..
ఎక్కువ కాలం జీవించి ఉండటం కోసం డేవ్ వైద్యపరంగా యాంటి ఏజింగ్ చికిత్సలు తీసుకోవడంతోపాటు.. తన అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. మితంగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చేస్తున్నాడు. ఆహారం, నిద్రపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఇటీవల తన ఎముక మజ్జను తొలగించి.. తన మూల కణాలను తిరిగి శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ‘బాల్యంలో శరీరంలో మూలకణాలు సమృద్ధిగా ఉంటాయి. అదే వయసు పెరిగేకొద్ది మూలకణాలు నశిస్తుంటాయి. అందుకే వీటిని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా ఆరోగ్యంగా.. నిత్యయవ్వనంగా ఉండొచ్చు’ అని డేవ్ వెల్లడించాడు. ఈ వైద్య చికిత్సల కోసం ఇప్పటి వరకు డేవ్ 10లక్షల డాలర్లు (దాదాపు రూ.7.28కోట్లు) వెచ్చించాడట.
ఈ పద్ధతులు పాటిస్తే..
క్రైయోథెరపీ లేదా కోల్డ్ థెరఫీలో అత్యల్ప ఉష్ణోగ్రతను ఉపయోగించి కణజాలాలకు అయ్యే గాయాల్ని తగ్గించొచ్చని డేవ్ అంటున్నాడు. అందుకే గత పదేళ్లుగా డేవ్ చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తున్నాడట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ను కూడా క్రమం తప్పకుండా పాటిస్తున్నాడు. అంటే కనీసం 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. ఆ తర్వాత ఆహారం తీసుకొని మరో 16 గంటలు ఏమీ తనకూడదు. ఈ ఫాస్టింగ్లో షెడ్యూల్స్ రకరకాలుగా ఉంటాయి. తినకుండా ఉండే సమయంలో శరీరంలో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే శరీరం తనంతట తానే నయం చేసుకుంటుందని డేవ్ పేర్కొన్నాడు. తాను పాటిస్తున్న పద్ధతులను 40 ఏళ్లలోపు వారు పాటిస్తే.. వందేళ్లు వచ్చే వరకు సంతోషంగా, యాక్టివ్గా బతకగలరని తెలిపాడు. త్వరలో ఈ పద్ధతులన్నీ బాగా ప్రాచూర్యం పొందుతాయంటున్నాడు. మరి వీటిలో ఎంత వరకు నిజముందో వైద్యులే బయటపెట్టాలి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ