ఈ శతాబ్దపు స్వతంత్ర దేశాలివీ..!
భారతదేశానికి బ్రిటీష్ వారి నుంచి 1947లో స్వతంత్రం వచ్చింది. మన దేశమే కాదు, 20వ శతాబ్దంలో చాలా దేశాలు తమపై ఇతర దేశాలు చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను అణిచివేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. అయితే 21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు
భారతదేశానికి బ్రిటీష్ వారి నుంచి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశమే కాదు, 20వ శతాబ్దంలో చాలా దేశాలు తమపై ఇతర దేశాల ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను ఎదురించి స్వేచ్ఛావాయువు పీల్చుకున్నాయి. అయితే 21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. ప్రస్తుతం అవే ప్రపంచంలో అత్యంత యువ దేశాలుగా నిలుస్తున్నాయి. మరి ఆ దేశాలేవీ? ఎప్పుడు స్వతంత్ర దేశాలుగా మారాయో చూద్దామా..!
ఈస్ట్ టైమోర్(టైమోర్-లెస్టే)
ఈస్ట్ టైమోర్ను అధికారికంగా ‘ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ టైమోర్-లెస్టే’ అని పిలుస్తారు. ఆసియా ఆగ్నేయ దేశాల్లో ఒకటైన ఈ ఈస్ట్ టైమోర్ దేశాన్ని 18వ శతాబ్దంలో పోర్చుగీస్ దేశస్థులు ఆక్రమించుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే నగరాలు నిర్మించుకొని దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. 1975లో ఈస్ట్ టైమోర్పై ఇండోనేషియా కన్నుపడింది. ఇండోనేషియా ఆక్రమణలో ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇండోనేషియా ఆధిపత్యం.. ఈస్ట్ టైమోర్ దేశస్థుల తిరుగుబాటు వంటి ఘర్షణలతో 1975-1999 మధ్య ఆ దేశంలో దాదాపు 2లక్షల మంది మరణించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1998లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుహర్టో రాజీనామా, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో ఇండోనేషియా కష్టాల్లో పడింది.
ఈ నేపథ్యంలో ఈస్ట్ టైమోర్కు స్వతంత్రం ఇచ్చే ప్రతిపాదనలు వచ్చాయి. ఇండోనేషియా, పోర్చ్గీస్ దేశాల మధ్య ఉన్న ఒప్పందాలతో ఐక్యరాజ్యసమితి ఈస్ట్ టైమోర్కు స్వాతంత్ర్యం ఇవ్వడంపై 1999 ఆగస్టులో రెఫరెండం పెట్టింది. ఫలితాలు ఈస్ట్ టైమోర్కు అనుకూలంగా రావడంతో ఇండోనేషియాకు చెందిన బలగాలు భారీగా విధ్వంసం సృష్టించాయి. వీరిని నియంత్రించడం కోసం ఐక్యరాజ్యసమితి తమ బలగాలను దింపింది. దీంతో ఇండోనేషియా ఈ దేశంపై అధికారాలను వదులుకుంది. ఐక్యరాజ్యసమితే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దేశంలో పరిపాలన కొనసాగించింది. 2001 ఆగస్టు30న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈస్ట్ టైమోర్లో ఎన్నికలు జరిగాయి. 2002 మార్చి 22న ఆ దేశ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. అదే ఏడాది మే 20న రాజ్యాంగం అమలు కావడంతోపాటు.. ఈస్ట్ టైమోర్ ప్రత్యేక దేశంగా అవతరించింది.
మొంటెనెగ్రో - సెర్బియా
1991లో యూగోస్లేవియా దేశం విచ్ఛిన్నమైన సమయంలో ఆ దేశంలో భాగంగా మారిన సెర్బియా, మొంటెనెగ్రో దేశాలు ఒకటిగా ఉండేవి. 2003 వరకు ఇరు దేశాలను కలిపి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యూగోస్లేవిగానే పిలిచేవారు. 2003లో దాన్ని స్టేట్ యూనియన్ ఆఫ్ సెర్బియా అండ్ మొంటెనెగ్రోగా పేరు మార్చారు. అయితే 2006 మేలో ఇరు దేశాలు విడిపోవడానికి రెఫరెండం నిర్వహించారు. విడిపోవాలనే 55.5శాతం ఓట్లు పడ్డాయి. దీంతో జూన్ 3న మొంటెనెగ్రో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. మొంటెనెగ్రో స్వతంత్ర దేశంగా ప్రకటించిన రెండ్రోజుల తర్వాత అంటే జూన్ 5న సెర్బియా కూడా తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది.
కొసొవో
మొదటి ప్రపంచయుద్ధానికి ముందు కొసొవో.. సెర్బియా ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత కొసొవో, మొంటెనెగ్రో దేశాలు యూగోస్లేవియాలో కలిశాయి. ఆ తర్వాత కసొవోలో తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడటంతో కొసొవో యుద్ధానికి దారితీసింది. 1999లో జరిగిన ఈ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి కొసొవో పరిపాలన బాధ్యతలు తీసుకుంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే ప్రక్రియను 2005లో ప్రారంభించారు. అయితే 2008 ఫిబ్రవరి 17న సెర్బియా నుంచి కొసొవో స్వాతంత్ర్యం పొందినట్లు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కొసొవోను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది.
సౌత్ సుడాన్
ఆఫ్రికా ఖండంలోని సుడాన్ నుంచి 2011 జులై 9న సౌత్ సుడాన్ స్వాతంత్ర్యం పొందింది. కొన్ని దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్ధం 2005లో సామరస్య ఒప్పందంతో ముగిసింది. సౌత్ సుడాన్ స్వతంత్ర దేశంగా మారడంపై రెఫరెండం నిర్వహించారు. అత్యధిక మంది జుబా నగరం రాజధానిగా సౌత్ సుడాన్ ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకున్నారు. రెఫరెండం ఫలితాలు వచ్చిన ఐదు రోజుల తర్వాత సౌత్ సుడాన్ ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె