BJP: 2022 ఫలితాలతో భాజపాకు మరింత శక్తి..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టాయి. ఫలితాలను విశ్లేషించుకొని 2024కు సిద్ధం కావాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తంలో ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది.. అదేంటంటే బ్రాండ్...
బ్రాండ్ మోదీ పదిలమన్న సందేశం
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టాయి. ఫలితాలను విశ్లేషించుకొని 2024కు సిద్ధం కావాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికల మొత్తంలో ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది.. అదేంటంటే ‘బ్రాండ్ మోదీ’ ఇంకా పదిలంగానే ఉందని. సుదీర్ఘ రైతు ఉద్యమాలు.. కరోనా వ్యాప్తి.. ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని స్వల్ప నష్టాలతోనే భాజపా బయటపడింది. దీంతో 2024లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు చమటోడ్చాల్సి వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఎన్నికకు భాజపాకు మార్గం సుగమం..
ఈ ఏడాది జులై 24తో రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. దీంతో భాజపా అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించేందుకు అవసరమైన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సమకూర్చుకోవడంలో యూపీ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడి ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే అత్యధికం. తాజాగా గతంలో కంటే ఇక్కడ మెజార్టీ తగ్గినా.. అధికారంలోకి రావడం భాజపాకు సానుకూలాంశం. దీంతోపాటు ఉత్తరాఖండ్, మణిపూర్లలో కూడా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మరోపక్క గోవాలో కూడా సగం సీట్లను సాధించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ, ఒడిశాలల్లో అధికార పక్షాల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలున్నాయి. దీనిపై మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ పీటీఐతో మాట్లాడుతూ ‘ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి లాభిస్తాయి’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకొన్నన్ని కఠిన సవాళ్లు ఎదురుకాకపోవచ్చనే అభిప్రాయలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశే కీలకం..
2024 లోక్సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి ఉత్తరప్రదేశ్ చాల కీలకం. గతంలో ఇక్కడ భాజపా 62 సీట్లు గెలుచుకొంది. తాజా రాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల లెక్కన చూస్తే అక్కడ భవిష్యత్తులో ఎస్పీ, భాజపా మధ్యే ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ దాదాపు అదృశ్యమైపోయింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు వచ్చాయి. గతంలో ఎస్పీకి ఇక్కడ అయిదు ఎంపీ సీట్లు వచ్చాయి. ఈ సారి గణనీయంగా పుంజుకొనే అవకాశం ఉండటంతో 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండొచ్చు. ముఖ్యంగా మోదీకి ప్రత్యర్థిగా నిలిచే ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే దాని ఆధారంగానే ఇది ఉండే అవకాశం ఉంది.
జాతీయ పార్టీగా ‘ఆప్’..
పంజాబ్లో విజయంతో ఆప్ జాతీయ పార్టీగా అవతరించే అవకాశం ఉంది. దిల్లీ, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంతో ప్రాంతీయ పార్టీల కూటమిలో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఆప్ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఈ పార్టీ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
ప్రత్యేక కూటమి వైపు ప్రాంతీయ పార్టీలు?
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడటంతో.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడే అవకాశాలు తక్కువ. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో.. ఆ పార్టీతో కలిసి పనిచేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనం స్థానిక పార్టీలకు కనిపించక పోవచ్చు! ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రహిత తృతీయ కూటమి జీవం పోసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆప్, టీఎంసీ, డీఎంకేలు కీలక పాత్ర పోషించవచ్చు. ప్రధాని పదవికి పోటీపడే నేత జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగేవారై ఉండాలి. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ లేకపోవడంతో.. ప్రాంతీయ పార్టీల కూటమి అనివార్యమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు