Indonesia: బురదనీటిలో వృద్ధ మహిళలు వణుకుతుంటే.. డబ్బులు సంపాదిస్తున్న క్రియేటర్లు
వృద్ధమహిళలు బురదలో స్నానం చేస్తూ వణుకుతుంటూ ఆ వీడియోలను లైవ్స్ట్రీమ్ చేసి కొందరు టిక్టాక్ క్రియేటర్లు డబ్బులు దండుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇండోనేసియాలోని లొంబొక్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
రెడీ..1, 2, 3.. యాక్షన్ అన్నాడు టిక్టాక్ క్రియేటర్..
అంతే.. ఎదురుగా బురద నీటిలో కూర్చున్న ఓ వృద్ధ మహిళ వణుక్కుంటూ ఆ నీటిని జగ్గుతో ఎత్తి నెత్తిమీద పోసుకుంది..
చల్లగాలికి తోడు చలి ఎక్కువ కావడంతో ఆమె మరింత వణుకుతోంది..
మళ్లీ నీళ్లు నెత్తిమీద చల్లుకుంది..
క్రియేటర్ కట్ చెప్పేంతవరకు ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది..
ఇదంతా లైవ్ స్ట్రీమ్ జరగడం గమనార్హం..
ఎక్కడ జరుగుతోంది?
ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు ఇలాంటి దారుణాలకు వేదికగా నిలుస్తున్నాయి. లైవ్ స్ట్రీమ్లో భాగంగా చూసిన వీక్షకులు ఆన్లైన్ ద్వారా కాయిన్స్ పంపిస్తారు. వాటిని మార్చుకోవడం ద్వారా నగదు వస్తుందని దీన్ని రూపొందించిన ఓ వ్యక్తి తెలిపాడు. ఈ బురద నీటి స్నానాలను తొలిసారిగా లొంబొక్ దీవిలో చిత్రీకరించారు. టిక్టాక్లో విరివిగా ప్రచారంలోకి రావడంతో ఇండోనేషియా అధికారులు స్పందించారు. వెంటనే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియోలను టిక్టాక్ నుంచి తొలగించాలని ఆ సంస్థకు లేఖ రాశారు. కొందరు మహిళలు కనీసం ఏడు, ఎనిమిది గంటలు ఈ నీటిలోనే ఉండటం బాధాకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆదాయం రావడంతో చలిని భరిస్తూ..
ఇండోనేసియాలోని లొంబొక్ ప్రాంతంలో పేదరికం ఎక్కువ. క్రియేటర్లు ఎక్కువ ఆదాయం ఆశ చూపించడంతో వృద్ధ మహిళలు తమ కుటుంబాల పోషణ కోసం వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే క్రియేటర్లు మాత్రం భారీగా ఆదాయం పొందుతూ మహిళలకు మాత్రం అతి తక్కువ మొత్తాలను ఇస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా సేపు బురద నీటిలో ఉండటంతో వృద్ధులకు అనేక శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నట్టు సమాచారం. అమెరికా తరువాత ఇండోనేసియాలో టిక్టాక్ యూజర్లు 106 మిలియన్ల మంది ఉంటారని అంచనా. అయితే తమకు రోజువారీ వచ్చే కూలీ కన్నా టిక్టాక్ క్రియేటర్లు ఇచ్చే డబ్బు ఎక్కువగా ఉందని ఆ అమాయక మహిళలు చెబుతుండటం గమనార్హం. తమకు కష్టంగా ఉన్నా వీటిని భరిస్తామని వారు అంటున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో తన మనవళ్లు, మనవరాళ్లకు కనీసం ఒక్కపూటైనా కడుపు నిండుతోందని వారు తెలిపారు. అయితే ఇటువంటి చర్యలు దుర్మార్గమని క్రియేటర్లపై కేసులు పెట్టాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
- జకార్తా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి