డైట్ సప్లిమెంట్స్: కొవిడ్ ముప్పును తగ్గిస్తాయా..?
కృత్రిమ పోషకాల (డైట్ సప్లిమెంట్స్) వాడటం వల్ల కరోనా వైరస్ ముప్పు నుంచి కాస్త రక్షణ పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మల్టీవిటమిన్లు, ఒమేగా-3, విటమిన్-డీ సప్లిమెంట్లు కరోనా వైరస్ ముప్పును తగ్గిస్తాయని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు.
లండన్ పరిశోధకుల తాజా నివేదిక
లండన్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దీనిబారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ పోషకాల (డైట్ సప్లిమెంట్స్) వాడటం వల్ల కరోనా వైరస్ ముప్పు నుంచి కాస్త రక్షణ పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మల్టీవిటమిన్లు, ఒమేగా-3, విటమిన్-డీ సప్లిమెంట్లు కరోనా వైరస్ ముప్పును తగ్గిస్తాయని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన నివేదిక బీఎంజే న్యూట్రీషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైంది.
కరోనా వైరస్ వ్యాపిస్తోన్న సమయంలో వీటి ముప్పు తగ్గించుకునేందుకు కొందరు విటమిన్-సీ, జింక్ లేదా వెల్లుల్లి కలిగిన సప్లిమెంట్స్ వాడుతున్నారు. అయితే, వైరస్ బారినపడే ప్రమాదాన్ని తగ్గించడంలో వీటికి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. ఆహార పదార్థాలు, సప్లిమెంట్స్ ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు బ్రిటన్లోని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ‘కొవిడ్-19 సింప్టమ్స్ స్టడీ యాప్’ను వినియోగించారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ యాప్ను బ్రిటన్, అమెరికాతో పాటు స్వీడన్లో 2020 మార్చిలో అందుబాటులోకి తెచ్చారు.
యాప్ ఆధారిత అధ్యయనం..
అధ్యయనంలో భాగంగా గతేడాది మూడు నెలలపాటు(మే, జూన్, జులై) యాప్ను వినియోగిస్తోన్న 3,72,720 మంది ఆహార పదార్థాల వాడకం, స్వాబ్ టెస్టుల గురించి ఇచ్చిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ మూడు నెలల పాటు మొత్తం యాప్ యూజర్లలో 23,521 మంది కరోనా వైరస్ బారినపడగా.. 3,49,199 మందికి నెగటివ్ అని తేలింది. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ తీసుకున్న వారిలో 14శాతం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు(12శాతం), మల్టీవిటమిన్ (13శాతం), విటమిన్ డీ తీసుకున్న వారిలో 9శాతం తక్కువగా వైరస్ బయటపడిందని పరిశోధకులు గుర్తించారు. మహిళల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించగా.. పురుషుల్లో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించలేదని కనుగొన్నారు. ఇక విటమిన్ సీ, జింక్, వెల్లుల్లి కలిగిన సప్లిమెంట్స్ను తీసుకున్న వారిలో అలాంటి ప్రభావం కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
యాప్ వినియోగదారుల్లో మొత్తం 3,72,720మంది సమాచారాన్ని విశ్లేషించగా.. దాదాపు లక్షా 75వేల మంది మూడు నెలలపాటు క్రమం తప్పకుండా కృత్రిమ పోషకాలను (డైటరీ సప్లిమెంట్స్) తీసుకున్నారు. మరో లక్షా 97వేల మంది వాటికి దూరంగా ఉన్నారు. బ్రిటన్తోపాటు అమెరికా (45,757), స్వీడన్ (27,373)లలోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం పరిశీలనా అధ్యయనం మాత్రమేనని.. ఇలా ఫలితాలు రావడానికి గల కారణాలు నిరూపితం కాలేదని పరిశోధకులు స్పష్టంచేశారు. తాజా అధ్యయనానికి చాలా పరిమితులు ఉన్నప్పటికీ.. వచ్చిన ఫలితాలు గుర్తించదగినవేనని శాస్త్రవేత్తలు సూచించారు. వీటిని నిర్ధారించేందుకు మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరగాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు