Passport : అక్కడ రోడ్డు దాటాలంటే పాస్పోర్టు కావాల్సిందే!
రోడ్డు దాటడానికి కచ్చితంగా పాస్పోర్టు ఉండాలి అంటే.. ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా? అమెరికా-కెనడా దేశాల సరిహద్దులోని ప్రజలు ఇలాంటి అనుభవాన్ని రోజూ ఎదుర్కొంటున్నారు. ఆ విచిత్రం ఏంటో మీరూ తెలుసుకోండి!
(Image : google)
ఒకే రోడ్డుపై రెండు దేశాలు ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ దేశాలే అమెరికా(America)-కెనడా(Canada). అమెరికా ఉత్తర సరిహద్దు చాలా వరకు కెనడాతో పంచుకుంటుంది. 9వేల కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దు.. ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దు(international border)గా పేరు పొందింది. ఈ రెండు దేశాల మధ్య 100కు పైగా బార్డర్ క్రాసింగ్స్ ఉన్నాయి. అందులో 15 అమెరికా రాష్ట్రమైన వెర్మోంట్, కెనడా ప్రావిన్స్లోని క్యూబెక్ మధ్య ఉన్నాయి. వీటిలో అమెరికాలోని డెర్బైలైన్ పట్టణం, కెనడాలోని స్టాన్స్టెడ్ పట్టణాల మధ్య ఉన్న బార్డర్ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఈ సరిహద్దు ఇళ్లను మాత్రమే కాదు అర కిలోమీటరు వరకు రోడ్డును కూడా విభజిస్తూ ఉంటుంది. దీనిని కానుసా స్ట్రీట్(Canusa Street)గా పిలుస్తుంటారు. ఇక్కడ ఇరుగుపొరుగు సైతం వేర్వేరు దేశాలకు చెందిన వారై ఉంటారు.
ఎక్కడ పేచీ పడింది?
కెనడాలో న్యూ ఫ్రాన్స్, ద ఫ్రెంచ్ కాలనీలను బ్రిటిష్(British) వారు ఆక్రమించారు. ఆ రెండు వలస రాజ్యాల గవర్నర్లు తమ సరిహద్దులను నిర్ణయించాల్సిందిగా సర్వేయర్లను నియమించడంతో ఈ తికమకకు బీజం పడింది. 1771-73 మధ్య కాలంలో సర్వేయర్లు 45 డిగ్రీల అక్షాంశానికి సమాంతరంగా గీత గీశారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారు. దాంతో కొన్ని చోట్ల సరిహద్దును కాదని 1.5 కిలోమీటర్ల మేర తప్పుగా గీశారు. 1783లో అమెరికా రివల్యూషనరీ వార్ తరువాత ఈ బార్డర్పై ఒక సంధి మాత్రం జరిగింది.
1800 సంవత్సరంలో కొందరు సర్వేయర్లు జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. సరిహద్దు అమెరికా దక్షిణ భాగానికి జరగాల్సి ఉందనే అంచనాకు వచ్చారు. అమెరికా, కెనడాలోని బ్రిటిష్ వలస రాజ్యాల మధ్య పలుమార్లు తలెత్తిన సరిహద్దు వివాదాలకు 1842లో ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. అదేంటంటే అప్పుడు ఎలా ఉన్న సరిహద్దులను అలాగే కొనసాగించాలని. ఆ తరువాత 1908లో యూకే, యూఎస్ కలిసి ఇంటర్నేషనల్ బౌండరీ కమిషన్ను ఏర్పాటు చేసుకున్నాయి. సర్వే, నిర్వహణ బాధ్యతలు దానికి అప్పగించాయి. అందులోని అధికారులు కూడా పలు ప్రాంతాలతోపాటు, 45వ సమాంతర గీత వద్ద సరిహద్దు గుర్తులను కనిపెట్టలేకపోయారు. అప్పటికే స్థానికులు సరిహద్దుపై పలు చోట్ల నిర్మాణాలు చేపట్టడంతో అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ బౌండరీ కమిషన్ తీవ్రంగా కృషి చేసి కొన్ని మార్గాలను గుర్తించినప్పటికీ కానుసా స్ట్రీట్ను మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
(Image : google)
అక్కడి ప్రజల జీవనం ఎలా ఉందంటే..!
చరిత్రకారులు, స్థానికులు చెబుతున్న విషయం ఏంటంటే.. అమెరికా, కెనడా ప్రజలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా పంచుకుంటున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా అటూఇటూ దాటుతుంటారు. స్టాన్స్టెడ్ నుంచి తాగునీరు, మురుగునీటి సరఫరా వంటి సౌకర్యాలు డెర్బైలైన్కు అందుతుంటాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా రెండు ప్రాంతాల్లో ఎక్కడ ముప్పు వాటిళ్లినా వెళ్లి సేవలందిస్తుంటారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు కూడా సరిహద్దులు దాటుతుంటారు.
రోడ్డు దాటాలంటే చుక్కలే!
9/11 నుంచి అక్కడ భారీ మార్పులు వచ్చాయి. అప్పటి దాకా సులభంగా ఆ దేశానికి, ఈ దేశానికి మధ్య రాకపోకలు సాగించిన ప్రజలు ఆంక్షల్ని ఎదుర్కొన్నారు. బార్డర్ క్రాసింగ్ ఆఫీసుల్లో సంప్రదించిన తరువాతే రోడ్డు దాటాలని షరతులు విధించారు. ఇరుగుపొరుగు ప్రజల్ని కలిసేందుకు సైతం అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. చెక్ పాయింట్ వద్ద తప్పని సరిగా పాస్పోర్టు(passports) చూపించిన తరువాతే రోడ్డు దాటాలని నిబంధన పెట్టారు. ఒక వేళ డ్రైవింగ్ చేస్తుంటే వాహనానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి.
ఉదాసీనంగా ఉంటే అంతే సంగతి
ఆంక్షల్ని పట్టించుకోకుండా రోడ్డు దాటితే మాత్రం భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో అయితే 5వేల డాలర్లు(dollars) లేదా రెండేళ్ల జైలు శిక్ష, కెనడాలో అయితే వెయ్యి డాలర్లు జరిమానా విధిస్తారు. రోడ్డే కదా దాటేస్తే ఎవరు చూస్తారని అనుకోవడానికి వీల్లేదక్కడ. 2015లో పిజ్జా కొనడానికి రోడ్డు దాటి ఓ వ్యక్తి అరెస్టయ్యాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో నివసించే చాలా మందికి రెండు దేశాల్లోనూ ద్వంద్వ పౌరసత్వం(dual citizens) ఉంది. దాంతో వారు చాలా సులభంగా రాకపోకలు సాగిస్తుంటారు.
నడి రోడ్డుపై లైబ్రరీ
ఇదే కాకుండా హస్కెల్ లైబ్రరీ, ఒపెరా హౌస్లు సరిహద్దు రోడ్డు పైనే ఉంటాయి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు గుర్తుగా వీటిని 1904లో నిర్మించారు. రెండు దేశాల ప్రజలు వేర్వేరు ప్రవేశ మార్గాల ద్వారా ఇందులోకి రావచ్చు. 2017లో ట్రంప్ పలు ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్కు చెందిన కొందరు వ్యక్తులు ఈ లైబ్రరీలో ప్రవేశించి తమ స్నేహితులను కలుసుకొనేవారట. అమెరికాకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలువురు కెనడా గుండా ఆ దేశంలోకి వెళ్లేందుకు ఈ సరిహద్దును ఎంచుకుంటారు. 2021లో 916 మంది అలా అక్రమంగా ప్రవేశించడానికి యత్నిస్తూ దొరికిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం