France: ఫ్రాన్స్లో ఒకప్పుడు రోజుకు 10 గంటలే!
రోజుకు 24 గంటలు.. గంటకు 60 నిమిషాలు.. నిమిషానికి 60 సెకన్లు.. ఇది గడియారంలో సమయం లెక్క. ఎప్పటి నుంచో మనం దీన్నే పాటిస్తున్నాం. కానీ గతంలో ఫ్రాన్స్కు ఈ స్టాండర్డ్ టైం నచ్చలేదు. దీంతో దశాంశం(డెసిమల్) పద్ధతిలో రోజుకు 10 గంటలే ఉండేలా గడియారాన్ని మార్చేశారు.
(Photo: wikipedia)
ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 24 గంటలు.. గంటకు 60 నిమిషాలు.. నిమిషానికి 60 సెకన్లు.. ఇది గడియారంలో సమయం లెక్క. ఎప్పటి నుంచో మనం దీన్నే పాటిస్తున్నాం. కానీ గతంలో ఫ్రాన్స్కు ఈ స్టాండర్డ్ టైం నచ్చలేదు. దీంతో దశాంశం(డెసిమల్) పద్ధతిలో రోజుకు 10 గంటలే ఉండేలా గడియారాన్ని మార్చేశారు. అయితే, ప్రజలు ఈ గడియారాన్ని అనుసరించి పనులు చేసుకోవడానికి విముఖత చూపారు. దీంతో మళ్లీ పాత పద్ధతిలో 24 గంటల గడియారాన్నే తీసుకొచ్చారు.
ఫ్రాన్స్కు చెందిన కొంతమంది మేధావులు గతంలో ఈ స్టాండర్డ్ టైంను వ్యతిరేకించారు. 1754లో ఆ దేశ గణితశాస్త్రవేత్త జీన్ లె రాండ్ డి అలెంబర్ట్ సమయాన్ని పదితో విభజించేలా ఉండాలని ప్రతిపాదన చేశాడు. కానీ, అప్పుడు ఎవరూ దాన్ని అమలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత 1788లో క్లౌడే బోనిఫేస్ కొల్లిగాన్ అనే ఫ్రాన్స్ అటార్నీ గణితశాస్త్రవేత్త జీన్ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రోజుకు 10 గంటలు, గంటకు 100 నిమిషాలు, ఒక్క నిమిషానికి వెయ్యి సెకన్లు ఉండాలని ప్రతిపాదించాడు. అంతేకాదు.. వారానికి 10 రోజులు, ఏడాదికి 10 నెలలు ఉండేలా చేయాలన్నాడు. అయితే, బోనిఫేస్ ప్రతిపాదనకు మరో గణితశాస్త్రవేత్త జీన్ ఛార్లెస్ డి బోర్డా సవరణలు చేశాడు.
అదే సమయంలో ఫ్రెంచ్ విప్లవం మొదలైంది. ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సమయాన్ని సైతం మార్చాలని ఫ్రాన్స్ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు డెసిమల్ పద్ధతిలో సమయాన్ని కొలవాలని పార్లమెంట్లో చట్టం చేశారు. అనంతరం పార్లమెంట్ ఆమోదంతో కొత్త సమయం 1793 నవంబర్ 24 అర్ధరాత్రి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రోజుకు 10 గంటలు.. గంటకు 100 నిమిషాలు, నిమిషానికి 100 సెకన్లుగా గడియారం పనిచేస్తుంది. అంటే స్టాండర్డ్ గడియారంలో ఒక గంట.. డెసిమల్ విధానంలో 2.4గంటలతో, ఒక నిమిషం.. 1.44నిమిషాలతో సమానమవుతుంది. 0(అర్ధరాత్రి)తో రోజు ప్రారంభమై తిరిగి 0(10)తో ముగుస్తుంది. 5 గంటల సమయాన్ని మధ్యాహ్నంగా పరిగణిస్తారు.
అమలులో ఉన్నది 17 నెలలే..
ఈ కొత్త విధానంలో సమయాన్ని గుర్తించలేక ప్రజలు తికమకపడ్డారు. అందుకే జనాలు ఇబ్బంది పడకుండా అప్పటి గడియారం తయారీ సంస్థలు కొత్త సమయంతోపాటు 24 గంటలను సూచించే సంఖ్యలను కూడా పరికరంలో ఉంచేవారు. కాగా.. ప్రజలు కొత్త సమయానికి అలవాటుపడలేకపోయారు. డెసిమల్ పద్ధతిని పక్కన పెట్టి, పాత విధానంలోనే సమయాన్ని పాటించారు. బలవంతంగా ప్రజల ఇళ్లలోని గడియారాలు మార్చేద్దామంటే వాటి తయారీ, పంపిణీ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ సాహసం చేయలేకపోయింది. 17 నెలలకే డెసిమల్ గడియారం మరుగునపడింది. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి పాత 24 గంటల సమయాన్నే పాటించడం మొదలుపెట్టింది.
రోజుకు 1000 నిమిషాలతో స్విస్ గడియారం
1998 అక్టోబర్ 23న స్విట్జర్లాండ్కు చెందిన స్వాచ్ కంపెనీ ‘ఇంటర్నెట్ టైం’ పేరుతో కొత్త గడియారాన్ని విడుదల చేసింది. అందులో గంటలు ఉండవు. కేవలం నిమిషాలు మాత్రమే. రోజుకు వెయ్యి నిమిషాలు ఉంటాయి. అర్ధరాత్రి 000నిమిషాల వద్ద రోజు మొదలై 999 నిమిషాలకు ముగుస్తుంది. 500 నిమిషాల వద్ద మధ్యాహ్నం మొదలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి