ఆ గ్రామమంతా మినీ గ్రంథాలయాలే..!
సాధారణంగా ఏ గ్రామంలోనైనా ముఖ్యమైన వీధుల్లో వివిధ దుకాణాలు, క్లినిక్స్, టిఫిన్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేరళలోని పెరుంకులం గ్రామంలోని జంక్షన్ల వద్ద బుల్లి బుల్లి గ్రంథాలయాలు దర్శనిమిస్తాయి. పుస్తకాలు చదువుకుంటూ.. పుస్తకం తీసుకొని మరో పుస్తకం
సాధారణంగా ఏ గ్రామంలోనైనా ముఖ్యమైన వీధుల్లో వివిధ దుకాణాలు, క్లినిక్స్, టిఫిన్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేరళలోని పెరుంకులం గ్రామంలోని జంక్షన్ల వద్ద బుల్లి బుల్లి గ్రంథాలయాలు దర్శనిమిస్తాయి. పుస్తకాలు చదువుకుంటూ.. పుస్తకం తీసుకొని మరో పుస్తకం అందులో పెడుతున్న ప్రజలు కనిపిస్తారు. అందుకే ఈ గ్రామం కేరళలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు ఊరికే రాలేదు. దాని వెనక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది.
1948 జనవరి 30న మహాత్మగాంధీ హత్యకు గురయ్యారు. దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. అందరూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. కానీ అదే సమయంలో పెరుంకులం గ్రామంలోని కొందరు యువకులు గాంధీ మృతికి సంతాపంగా గుర్తిండి పోయేలా ఏదైనా చేయాలనుకున్నారు. గాంధీకి పుస్తక పఠనమంటే ఎంతో ఇష్టం. అందుకే ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా పిల్లై అనే యువకుడు మరికొందరు కలిసి వంద పుస్తకాలను సేకరించి పిల్లైకి చెందిన ఇంట్లోనే ఓ గదిని గ్రంథాలయంగా మార్చేశారు. దానికి బాపూజీ స్మారక వయనశాల (బాపూజీ మెమోరియల్ లైబ్రరీ) అని పేరుపెట్టారు. మొదట్లో ఈ గ్రంథాలయం బాగానే నడిచింది. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం, సొంతంగా పుస్తకాలు ముద్రించడం వంటివి జరిగాయి. ఆ తర్వాత నిర్వహణ లోపంతో కొన్నాళ్లు మూతపడి, గ్రంథాలయ గదిని మార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు 2016 ఫిబ్రవరిలో ఈ బాపూజీ స్మారక వయనశాల కోసం కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలతో సొంత భవనం ఏర్పాటైంది.
2017లో పెరుంకులం గ్రామ ప్రజలు ఈ గ్రంథాలయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని భావించారు. ఇందుకోసం గ్రామంలోని ముఖ్య జంక్షన్లో చిన్న గ్రంథాలయం పెట్టారు. దానికి మంచి స్పందన రావడంతో గ్రామంలోని ప్రతి జంక్షన్లో ఓ బుల్లి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 50 పుస్తకాలు ఉంటాయి. గ్రామంలో ఎవరైనా సరే ఉచితంగానే పుస్తకాలను తీసుకొని అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. లేదా ఒక పుస్తకం ఇంటికి తీసుకెళ్లాలంటే మరో పుస్తకాన్ని అక్కడ పెట్టాలి. అలా పుస్తకాలను ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ ఎన్ని పుస్తకాలైనా తీసుకోవచ్చు. పిల్లలకు చదువుపై ఇష్టం కలిగించేలా చిన్నారులకు సంబంధించిన అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దీంతో 2019 జూన్లో రాష్ట్రంలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా పెరుంకులం గుర్తింపు పొందింది. బుల్లి గ్రంథాలయాలకు, బాపూజీ స్మారక వయనశాలకు కేరళ రాష్ట్ర గ్రంథాలయ మండలి నుంచి నిధులు కూడా వస్తున్నాయి.
నిజానికి పెరుంకులం గ్రామం కంటే ముందు మహారాష్ట్ర సతారా జిల్లాలోని బిలార్ గ్రామంలో బుల్లి గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. దీంతో భారత్లోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా బిలార్ నిలిచింది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బాపూజీ స్మారక వయనశాల సిబ్బంది పెరుంకులం గ్రామంలోనూ బుల్లి గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. అలా పెరుంకులం కేరళలో తొలి.. దేశంలో రెండో ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM