Dangerous volcanos : చరిత్రలో భయంకర అగ్ని పర్వతాలు.. వణుకు పుట్టించాయి!
ప్రపంచంలోని అనేక దేశాల్లో అగ్నిపర్వతాలున్నాయి. అవి ఎప్పుడు విస్ఫోటం చెంది భారీ విధ్వంసానికి కారణమయ్యాయో పరిశీలించండి.
ఇండోనేసియా(Indonesia)లోని మౌంట్ మెరాపి శనివారం విస్ఫోటం చెందింది. దాంతో వేడి వాయువులు, లావా, బూడిద వెలువడుతున్నాయి. ఫలితంగా సమీప పరిసర ప్రాంతాలు సూర్యకాంతికి కూడా నోచుకోలేదు. చరిత్రలో కొన్ని భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి. వాటి కారణంగా అనేక చోట్ల భారీ బిలాలు, సరస్సులు, కొత్త ప్రదేశాలు ఏర్పడ్డాయి. అవేంటో తెలుసుకోండి.
ఎల్లో స్టోన్-మోంటానా/వ్యోమింగ్/ఇదాహో(6.40లక్షల ఏళ్ల క్రితం)
ప్రపంచంలో విస్ఫోటనం చెందిన ప్రతి అగ్నిపర్వతం గురించి నమోదు చేయడం వీలుకాదు. అలా కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఎల్లో స్టోన్ బద్దలైంది. అమెరికా(America)లోని ప్రస్తుత ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఆ పేలుడుకు సాక్ష్యంగా నిలిచింది. అక్కడి భూమిలోపల ఇప్పటికీ చురుగ్గా కదులుతున్న అగ్నిపర్వతం ఉండటంతో అనేక పరిశోధనల్లో ఇది చోటు సంపాదించింది.
అగ్నిపర్వత పేలుడు సూచికలో తీవ్రత : 8
ఆంబ్రిమ్ ఐలాండ్-రిపబ్లిక్ ఆఫ్ వనౌటు(క్రీస్తు శకం 50)
ఇది పసిఫిక్ మహా సముద్రం నైరుతి భాగంలో ఉంటుంది. చిన్న చిన్న దీవులతో ఈ ప్రాంతం నిండిపోయింది. మౌంట్ వెసువియస్ విస్ఫోటం చెందిన సమయంలోనే ఇది కూడా జరిగిందని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఆంబ్రిమ్ ఐలాండ్ అగ్నిపర్వత విస్ఫోటనంతో 7.5 మైళ్ల వెడల్పుతో బిలం ఏర్పడింది. బూడిద, ఇతర వ్యర్థాలు వేల మైళ్ల దూరం వ్యాపించాయి. 1894లో మళ్లీ జరిగిన విస్ఫోటంతో ఆరుగురు మరణించారు. 1979లో యాసిడ్ వర్షం కురిసింది. దాంతో స్థానికులు గాయపడ్డారు.
తీవ్రత : 6+
మౌంట్ వెసువియస్-ఇటలీ(క్రీస్తు శకం 79)
ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో పాంపీ, హెర్కులేనియం నగరాలు బూడిద, బురదలో కూరుకుపోయాయి. ఆ విధ్వంసం జరిగే సమయంలో ఏం చేయాలో పాలుపోక జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనలో దాదాపు 16వేల మంది మరణించి ఉంటారని ఒక అంచనా.
తీవ్రత : 5
మౌంట్ ఇల్లోపాంగో-ఈఎల్ సాల్వెడార్(క్రీస్తుశకం 450)
ఈ విస్ఫోటనం కారణంగా కొన్ని నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక మంది వలస వెళ్లారు. ఈ భారీ పేలుడు కారణంగానే లేక్ ఇల్లోపాంగో ఏర్పడింది.
తీవ్రత : 6+
బైటౌషన్ అగ్నిపర్వతం-చైనా(క్రీస్తు శకం 1000)
ఈ అగ్నిపర్వతాన్ని చాంగ్బైషన్గా పిలుస్తుంటారు. ఇక్కడ వెలువడిన బూడిద, ఇతర వ్యర్థాలు జపాన్ వరకు వెళ్లాయి. మూడు మైళ్ల మేర బిలం ఏర్పడింది. అది అర మైలు లోతుగా ఉంది. నేడు ఆ బిలం టియాంచి లేక్గా ప్రసిద్ధి చెందింది. అనేక మంది పర్యాటకులు దీన్ని చూడటానికి వెళ్తుంటారు.
తీవ్రత : 7+
హుయానాపుటినా-పెరూ(1600 సంవత్సరం)
దక్షిణ పెరూలోని ఈ ఎత్తయిన పీఠభూమి వద్ద భయంకరమైన విస్ఫోటం సంభవించింది. దాని ప్రభావంతో పర్యావరణంలో కూడా మార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఒక శతాబ్దం పట్టిందంటారు.
తీవ్రత : 6
లకి-ఐలాండ్(1783)
ఈ అగ్నిపర్వతం రగులుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లకాగిర్లో చీలిక రావడంతో భయానక విష వాయువులు వెలువడ్డాయి. అది ఎనిమిది నెలలు నిరాటంకంగా కొనసాగింది. దాంతో దాదాపు 9వేల మంది చనిపోయారు. జంతువులు కూడా చనిపోయాయి. ఈ ఘటన తరువాతే ఫ్రెంచ్ విప్లపం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.
తీవ్రత : 6
మౌంట్ తంబోరా-ఇండోనేసియా(1815)
మౌంట్ తంబోరా ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది. ఈ అగ్నిపర్వత పేలుడు దాదాపు 1200 మైళ్ల దూరం వినిపించిందని చెబుతుంటారు. ఈ అగ్నిపర్వతం కారణంగా 92 వేల మందికి పైగా మరణించారు.
తీవ్రత : 7
క్రాకటోవా-ఇండోనేసియా(1883)
ఈ అగ్నిపర్వత విస్ఫోటం ధాటికి ఒక ద్వీపం పూర్తిగా ధ్వంసమైంది. సునామీ వచ్చింది. 150 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. బలమైన తుపాను గాలులు వీచాయి. దాంతో దాదాపు 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రత : 6
శాంటా మారియా అగ్నిపర్వతం-గ్వాటెమాల(1902)
20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన విస్ఫోటం ఇది. శాంటా మారియా అగ్నిపర్వతం దక్షిణ భాగం వైపు బద్దలైంది. ఈ విపత్తు కారణంగా సుమారు కిలోమీటరున్నర బిలం ఏర్పడింది. ఈ అగ్నిపర్వతం పలుమార్లు విస్ఫోటం చెందిన కారణంగా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది మరణించారు.
తీవ్రత : 6
నోవారుప్టా-అలస్కా(1912)
అలస్కా రింగ్ ఆఫ్ ఫైర్లో ఈ భారీ పేలుడు సంభవించింది. దీని కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అడుగు మందం మేర బూడిద పేరుకుపోయింది.
తీవ్రత : 6
మౌంట్ పినాటుబో-ఫిలిప్పీన్స్(1991)
రాజధాని మనీలా నగరానికి 50 మైళ్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంటుంది. దీని నుంచి మిలియన్ టన్నుల సల్ఫర్ డై ఆక్సైడ్ గాల్లో కలిసింది. 350 మంది చనిపోయారు. ఆ మరుసటి ఏడాది ఉష్ణోగ్రత తగ్గినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
తీవ్రత : 6
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య