Pure honey : ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనె.. ఇక్కడ దొరుకుతుందట!
చిలీకి (Chile) సమీపంలోని ఒక ద్వీపంలో (Island) స్వచ్ఛమైన తేనె దొరుకుతుందట. ఇక్కడి తేనెటీగలపై (Honey bees) కొన్ని రకాల పరిశోధనలు కూడా చేశారు.
ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రం (Pacific ocean) మధ్యలో ఒక ద్వీపం (Island) ప్రపంచానికి ఒక మూలకు విసిరేసినట్టుగా ఉంటుంది. చిలీకి (Chile) సమీపంలోని ఆ ప్రాంతాన్ని ఈస్టర్ ఐలాండ్ (Easter island) అని పిలుస్తుంటారు. ఆ ద్వీపంలో పెరిగే మొక్కలు, చెట్లపై ఎలాంటి పురుగు మందులు చల్లరు. దాంతో అక్కడ తేనెటీగలు (Honey bees) ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యకర జీవనం సాగిస్తున్నాయి. ఫలితంగా అవి ఈ భూ ప్రపంచంలోనే స్వచ్ఛమైన తేనెను (Honey) ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.
ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచ నలుమూలల్లో పెరిగే అన్ని రకాల తేనెటీగలు విషపూరిత రసాయనాలు చల్లిన మొక్కలపై వాలుతున్నాయి. దాంతో వాటికి కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాతావరణ మార్పులు కూడా తేనెటీగల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కానీ.. ఇలాంటి ప్రమాదాలేవీ ఈస్టర్ ఐలాండ్ తేనెటీగలకు లేవు. వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పెంపకందారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి తేనెటీగలను దిగుమతి చేసుకోకుండా స్థానిక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. కొత్త రకాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే స్థానిక తేనెటీగల ప్రత్యేక గుణం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు.. ప్రకృతి సహకారం
ఈ ప్రాంత తేనెటీగలు సురక్షితంగా పెరగడానికి కారణం రైతులు. వారు ఎలాంటి పురుగుమందులు చల్లకుండానే వ్యవసాయం చేస్తున్నారు. అందుకోసం కొన్ని రకాల పురాతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇక ఇక్కడ పారే నీరు కూడా చాలా సహజంగా.. స్వచ్ఛంగా ఉంటుంది. నీటి అవసరాలు ఎక్కువగా ఉంటే వర్షపునీటిని పోగు చేసి దాచుకుంటారు. దాంతో ఈ ద్వీపం అంతటా స్వచ్ఛమైన నీరు మాత్రమే ప్రవహిస్తోంది. అందువల్లే తేనెటీగలకు ఎలాంటి జబ్బులు సోకడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వ్యాధులు లేకపోవడంతో తేనె తయారీదారులు కూడా యాంటీ బయోటిక్స్ వాడటం లేదు. ద్వీపంలోని మరో ప్రత్యేకత ఏంటంటే అధిక తేమతో కూడిన వాతావరణం. అది తేనెలో అధిక ద్రవ స్థిరత్వాన్ని పోగు చేస్తోంది. ఆ చర్య స్ఫటికీకరణను నిరోధిస్తోంది.
పరిశోధనలు ఏం తేల్చాయంటే..!
ఈస్టర్ ద్వీపంలోని తేనెటీగలు నిజంగా అంత ప్రత్యేకమైనవా? అని తేల్చేందుకు కొన్ని రకాల పరిశోధనలు చేశారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచంలోని మిగతా ఏ తేనెటీగల జాతితోనూ వీటికి సంబంధం లేదని తేలింది. ఇక్కడ పరాగ సంపర్కాలు జరిగే తీరు కూడా భిన్నంగా ఉన్నట్లు కనుగొన్నారు. అందుకే ఈ అరుదైన జాతి తేనెటీగలను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈస్టర్ ద్వీపంలో పెరిగే తేనెటీగలు అత్యంత ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు. వీటిలో ఉత్పాదక సామర్థ్యం కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఈ ద్వీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణం వాటికి చాలా అనువుగా ఉన్నట్లు తెలిసింది. ఏడాది పొడవునా వసంతకాలంలా ఉంటుంది. అందువల్ల తేనెటీగలు నిత్యం చురుగ్గా కదులుతుంటాయి. పుష్పించే మొక్కలపై వాలుతూ మకరందాన్ని జుర్రుతుంటాయి. సంవత్సర కాలంలో ఒక తేనెటీగల సమూహం 90 నుంచి 120 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలుగుతాయట. ఇదే పరిమాణంలోని మిగతా తేనెటీగలకు 20 కిలోల ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!