Tokyo Olympics:ఈ ఒలింపిక్స్లో రష్యా కనిపించలేదేంటీ!
ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించే దేశాల్లో రష్యా ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదని ప్రతిసారి నిరూపిస్తుంటుంది. కానీ, తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్లో పాల్గొంటున్న దేశాల్లో రష్యా పేరు కనిపించలేదు. ఎందుకంటే ఒలింపిక్స్లో ఆడకుండా రష్యాపై నిషేధముందన్న
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించే దేశాల్లో రష్యా ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదని ప్రతిసారి నిరూపిస్తుంటుంది. కానీ, తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్లో పాల్గొంటున్న దేశాల జాబితాలో రష్యా పేరు కనిపించలేదు. ఎందుకంటే ఒలింపిక్స్లో ఆడకుండా రష్యాపై నిషేధముంది. అయితే మాత్రం ఒలింపిక్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రష్యా ఈ పోటీల్లో పాల్గొనకుండా ఊరుకుంటుందా..! మరో మార్గంలో ఒలింపిక్స్లో అడుగుపెట్టింది. ‘ఆర్వోసీ’ పేరుతో ఆ దేశ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనేలా చేసింది.
నిషేధం ఎందుకు?
అథ్లెట్లకు నిర్వహించే డోపింగ్ పరీక్షలకు సంబంధించి రష్యా అవకతవకలకు పాల్పడిందని 2014 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరిపిన వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ(వాడా).. 2015లో రష్యాలో యాంటీ డోపింగ్ ల్యాప్ను మూసివేసింది. వంద మంది క్రీడాకారుల్ని క్రీడల్లో పాల్గొనకుండా డిబార్ చేసింది. డోపింగ్ పరీక్షలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిందన్న కారణంగా 2019 డిసెంబర్లో రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్లు వాడా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్-2022, సహా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి రష్యాకు వీలు లేకుండా పోయింది. దీంతో ఒలింపిక్స్లో పాల్గొనడం కోసం కఠోర శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వాడా నిర్ణయంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని రష్యా ఉపయోగించుకుంది.
ఒలింపిక్స్లో పాల్గొనవచ్చు.. కానీ!
ఈ విషయంపై కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) విచారణ చేపట్టి.. వాడా విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. అంటే రష్యాపై నిషేధం 2022 డిసెంబర్ వరకే ఉంటుంది. కానీ ఒలింపిక్స్ 2020(కరోనా కారణంగా ఈ క్రీడలు 2021లో జరుగుతున్నాయి)లో పాల్గొనే అవకాశం లేక అథ్లెట్లు నష్టపోతారు. అందుకే, డోపింగ్ కుంభకోణంతో సంబంధంలేని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కొన్ని షరతులతో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడానికి కాస్ వెసులుబాటు ఇచ్చింది. రష్యా నుంచి ఒలింపిక్స్కు అర్హత పొందే క్రీడాకారులు అక్కడ రష్యా దేశం పేరు, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని వాడకూడదని స్పష్టం చేసింది.
అలా రష్యా కాస్త ఆర్వోసీగా మారింది!
కాస్ తీర్పుపై వాడా అసంతృప్తి వ్యక్తం చేయగా.. రష్యా స్వాగతించింది. దీంతో ఒలింపిక్స్లో ఆడే అథ్లెట్లు రష్యాకి కాకుండా రష్యన్ ఒలింపిక్స్ కమిటీ(ఆర్వోసీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందుకే, విశ్వక్రీడల్లో రష్యా పేరు ఉండాల్సి చోట ఆర్వోసీ దర్శనిమిస్తోంది. ప్రారంభోత్సవ సమయంలోనూ రష్యన్ అథ్లెట్లు ఆర్వోసీ పేరుతో.. మార్చ్ నిర్వహించారు.
రష్యాకు పేరు మార్పు కొత్తేం కాదు..!
రష్యా చరిత్ర చూస్తే ఆ దేశ భౌగోళిక స్వరూపం, పేరులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించే అథ్లెట్ల శిబిరం పేరు కూడా మారేది. 1900 నుంచి 1912 వరకు రష్యన్ ఎంపైర్ పేరుతో ఒలింపిక్స్లో పాల్గొన్న రష్యా.. 1952-88 మధ్య సోవియట్ యూనియన్గా.. 1992లో యూనిఫైడ్ టీమ్గా, 1996 నుంచి రష్యా పేరుతో ఒలింపిక్స్లో పాల్గొంటోంది. నిషేధం నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్-2020లో ఆర్వోసీగా మారింది. ప్రస్తుతం ఒక స్వర్ణం, 4 రజతం, 3 కాంస్య పతకాలను కైవసం చేసుకున్న ఆర్వోసీ(రష్యా).. పతకాల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్