ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది!
వాల్పేపర్స్.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్పేపర్స్ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ
ఇంటర్నెట్ డెస్క్: వాల్పేపర్స్.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్పేపర్స్ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ పుస్తకాన్ని రచించాడు. అందులోని పేజీలు తిరగేస్తే మరణించడం గ్యారెంటీ అని పేర్కొన్నాడు. వాల్పేపర్ ఏంటి? పుస్తకం ఏంటి? పేజీలు తిరగేస్తే మరణించడం ఏంటి? అని తికమకపడుతున్నారా..! అయితే ఇది చదవండి..
ఆర్సెనిక్ అనే రసాయన మూలకం ఎంతో ప్రమాదకరం. ఎక్కువమొత్తంలో ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ రసాయన మూలకంతో తయారు చేసిన వాల్పేపర్స్ను 1860 కాలంలో అమెరికాలో ప్రజలు ఇంట్లో అలంకరణ కోసం బాగా ఉపయోగించేవారు. ఆ వాల్పేపర్స్లో ఉన్న ఆర్సెనిక్.. గాలి ద్వారా లేదా వాల్పేపర్ను తాకడం వల్ల మనుషుల చేతుల నుంచి శరీరంలోకి వెళ్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయాన్ని అమెరికా అంతర్యుద్ధం సమయంలో సర్జన్గా, ఆ తర్వాత రసాయన శాస్త్ర ప్రొఫెసర్గా మారిన డాక్టర్ రాబర్ట్ ఎం. కెడ్జె గుర్తించారు. మిచిగాన్ రాష్ట్రానికి చెందిన రాబర్ట్.. ఆర్సెనిక్తో తయారు చేసిన వాల్పేపర్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని భావించారు. నోటి మాటతో చెబితే ఎవరు వింటారు అనుకున్నారేమో.. వినూత్నంగా ఓ పుస్తకం రచించారు. ఆర్సెనిక్ అధిక మోతాదులో కలిపి తయారు చేస్తున్న వాల్ పేపర్స్ను సేకరించి వాటితో 100కుపైగా పేజీలున్న ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దానికి ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’ పేరు పెట్టారు.
ఆర్సెనిక్ వల్ల ప్రజల ప్రాణాలకు ఎలా ముప్పు పొంచి ఉందో పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే ఈ పుస్తకం మొదటి పేజీలోనే ఈ పుస్తకంలోని వాల్పేపర్స్కు ఆర్సెనిక్ ఉందని, పేజీలు తిరగేసే సమయంలో అది మనిషి శరీరంలోకి వెళ్లి ప్రాణాలు తీస్తుందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని 100 కాపీలు తీసి మిచిగాన్ వ్యాప్తంగా ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపించారు. పుస్తకం రచించడానికి కారణాలు వివరిస్తూ.. ఆ పుస్తకాలను చిన్నారులకు దూరంగా ఉంచాలని కోరారు. రాబర్ట్ చెప్పిన విషయం నిజమేనని కొన్నాళ్లకు అందరికీ తెలిసింది. దీంతో గ్రంథాలయ నిర్వాహకులు ఆ పుస్తకాలను నాశనం చేశారు. దీంతో ప్రస్తుతం రాబర్ట్ రాసిన ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’ పుస్తకం కాపీలు నాలుగు మాత్రమే ఉన్నాయి. రెండు మిచిగాన్లోని రెండు వేర్వేరు యూనివర్సిటీల్లో ఉన్నాయి. మరొకటి హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో, ఇంకొకటి యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ఉంది. కొన్నేళ్ల కిందట. ఈ పుస్తకాన్ని డిజిటల్ రూపంలోకి మార్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు