India islands : నిండా మునుగుతున్న ద్వీపాలు.. చొరవ చూపకపోతే ఇక మ్యాప్లో కనిపించవు!
వాతావరణ (Weather) మార్పుల కారణంగా సముద్రం(Sea) భూమి(Earth)ని ఆక్రమిస్తోంది. తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భారత(India) చిత్రపటంలోని కొన్ని ద్వీపాలు(Islands) ఇకపై కన్పించకుండా పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచం(World)లో వాతావరణ మార్పుల వేగం పెరిగింది. అంటార్కిటికాలో గత 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు తాజాగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర(Sea) మట్టాలు 9 మిల్లీ మీటర్ల మేర పెరిగాయని వెల్లడైంది. మన దేశానికి మూడు వైపులా సముద్రం తీరం ఉంది. చుట్టూ 1382 ద్వీపాలున్నాయి(Islands). సముద్రం, నదుల కోత, మడ అడవుల నరికివేత, ఉష్ణోగ్రత(Temperature) పెరుగుదల, అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ ద్వీపాలు రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా మాయమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపడితే ఆ ప్రమాదాన్ని కాస్తయినా నివారించవచ్చని చెబుతున్నారు. లక్ష దీవుల్లోని ఒక ద్వీపం ఇప్పటికే పూర్తిగా మ్యాప్లో కనిపించడం లేదట. అలాంటి ముప్పు పొంచి ఉన్న కొన్ని ముఖ్యమైన జనావాస ద్వీపాలు ఏవో పరిశీలించండి.
పగడాల ‘లక్షదీవులు’
పర్యాటక రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన లక్షదీవులు 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పగడపు దిబ్బలు అధికంగా కన్పిస్తాయి. 2010, 2016 సంవత్సరాల్లో వచ్చిన ఎల్నినో కారణంగా ఆ దిబ్బలు క్షీణించాయి. అరేబియా సముద్రంలో పెరుగుతున్న వేడి కూడా అందుకు ఒక కారణం. ఇక్కడ ఒక వాటర్ విల్లా ప్రాజెక్టు చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. ఆ ప్రాజెక్టు వల్ల లక్షదీవుల్లోని మడుగులకు భారీగా నష్టం వాటిల్లుతుందని, దీనిపై పునరాలోచన చేయాలని 2021లో ఒక శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రాజెక్టులు, అకాల తుపానుల మూలంగా నేల కోతకు గురవుతోంది. ఒక అధ్యయనం ప్రకారం 2080-2100 మధ్య కాలంలో ఏడాదికి 0.78 మిల్లీమీటర్ల మేర జలాలు పెరుగుతాయని తెలిసింది. దాంతో చిన్న దీవులు అంతరించి పోయే ప్రమాదముంది. అందుకే ఇక్కడ నివసిస్తున్న దాదాపు 64 వేల మంది తమ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు.
అండమాన్ అండ్ నికోబార్ దీవులు
బంగాళాఖాతంలో ద్వీపాల సముదాయం అండమాన్ అండ్ నికోబార్. 2004 సునామీ కారణంగా అండమాన్ నికోబార్లోని ఇందిరాపాయింట్ వద్దనున్న లైట్హౌస్ నాలుగు మీటర్లు మునిగిపోయింది. రాకాసి అలల ధాటికి ఈ ద్వీపాల స్వరూపమే మారిపోయింది. ద్వీపాల వైవిధ్యాన్ని కాపాడుతున్న మడ అడవులు దాదాపుగా క్షీణించిపోయాయి. ఫలితంగా గడిచిన పదేళ్లలో దాదాపు 450 భూకంపాలను చవి చూడాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఓ మౌలిక సుదుపాయాల ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నికోబార్లోని అడవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సముద్ర మట్టం ఏటా 5మిల్లీమీటర్లు పెరుగుతూ వస్తోంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ.
భారత్-శ్రీలంక మధ్యన ‘వహాన్’
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి తీరానికి 6 కిలోమీటర్ల దూరంలో వహాన్ ఐలాండ్ కన్పిస్తుంది. ఇది భారత్కు, శ్రీలంకకు మధ్యలో ఉంటుంది. 1969 నాటికి 20.08 హెక్టార్లలో వ్యాపించి ఉన్న ఈ ద్వీపం 2.33 హెక్టార్లకు తగ్గిపోయి ఓ బల్బులాగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్లోని ఈ ద్వీపం ఒక దశాబ్దం క్రితం దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇక్కడ పగడాల తవ్వకాలు ఎక్కువగా జరిగేవి. అలా క్రమంగా పగడపు దిబ్బలు అంతరించిపోవడంతో ఈ ద్వీపం ఉత్తరభాగాన్ని అలలు ముంచెత్తడం మొదలైంది. 2013లో ఈ ద్వీపం రెండు భాగాలుగా చీలిపోయింది. దాంతో స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. పరిశోధకుల సూచనల మేరకు కాంక్రీటుతో కృత్రిమ దిబ్బలను తయారు చేసి సముద్రంలో పేర్చారు. ఫలితంగా ఈ ద్వీపంలో క్రమంగా ఇసుక పోగవుతున్నట్లు వెల్లడైంది.
గిన్నిస్కెక్కిన ‘మజూలీ ’
అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదీ ద్వీపం మజూలీ. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించింది. 2016లో దీనిని జిల్లాగా ప్రకటించారు. ఆ ఘనత అందుకున్న తొలి ఐలాండ్ ఇదే. వ్యవసాయం, ఆవాల సాగు, చేపల పెంపకం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు. 1950 నాటికి 1250 చదరపు కిలోమీటర్లున్న ఈ ద్వీపం ప్రస్తుతం 483 చదరపు కిలోమీటర్లకు కుంచించుకుపోయింది. నది కోతకు గురికావడం, దాని దక్షిణ భాగంలో కట్టలు కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
యాస్ తుపానుతో ‘ఘోరామర’
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో కోల్కతాకు 92 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం కన్పిస్తుంది. ఈ ప్రాంతం 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మట్టి కోతకు గురి కావడంతో ఉపాధినిస్తున్న తాటి చెట్లు నిలవడం కష్టంగా మారుతోంది. ఈ ప్రాంతంలో తమలపాకు సాగు కూడా అధికం. 2021లో వచ్చిన ‘యాస్’ తుపానుకు ముందు ఇక్కడ 550 యూనిట్ల తోటలు సాగయ్యేవి. తుపాను కారణంగా ఆ తోటలు, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ద్వీపం ఉత్తర, ఈశాన్య భాగంలో కోత కొనసాగుతోంది. ఇదే ఒరవడి సాగితే ద్వీపం జాడ లేకుండా పోతుందేమోనని స్థానికులు భయాందోళకు గురవుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ 40వేల మంది వరకూ నివసించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 4వేలకు పడిపోయింది.
ఉప్పుగా మారుతున్న ‘మన్రో థురుతు’
కేరళలోని కొల్లం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. ట్రావెన్కోర్ రాజ్య బ్రిటిష్ పరిపాలనాధికారి కల్నల్ జాన్ మన్రో పేరు దీనికి పెట్టారు. ఈ ద్వీపం క్రమక్రమంగా క్షీణించిపోతోంది. ఒకప్పుడు 12-13వేలున్న జనాభా ఇప్పుడు 8వేలకు తగ్గిపోయింది. వారంతా కొబ్బరి సాగు, పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్నారు.అలల తాకిడి, వరదల కారణంగా ఈ నేల ఉప్పుగా మారింది. దాంతో సారవంతమైన ఈ భూభాగం వ్యవసాయానికి పనికిరాకుండా పోతోంది. ఈ ద్వీపానికి సమీపంలో నిర్మిస్తున్న థెన్మల డ్యామ్, విచ్చలవిడి ఇసుక తవ్వకాల కారణంగా ఈ నష్టం చవి చూడాల్సి వస్తోందని ఓ పరిశోధనలో వెల్లడైంది. కల్లాడ నదిలోని వ్యర్థాలు, ఉప్పునీటి మడుగుల వల్ల మట్టి మాత్రమే కాకుండా భూగర్భ జలాల్లోనూ మార్పు వచ్చిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు