Small bank : అమెరికాలోనే అతి చిన్న బ్యాంక్.. ఇద్దరే ఉద్యోగులు!
అమెరికాలో (America) ఆ బ్యాంక్కు వందేళ్ల చరిత్ర ఉంది. కానీ, ప్రస్తుతం దాని ఆస్తులు విలువ మాత్రం కేవలం 30 లక్షల డాలర్లే. ఆ దేశంలోనే అతి చిన్న బ్యాంక్ (Bank) అయినప్పటికీ అందులో లావాదేవీలు (Transactions) ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోండి.
అగ్రరాజ్యం అమెరికాలో (America) సుమారు వందేళ్ల క్రితం ‘కెంట్ల్యాండ్ ఫెడరల్ సేవింగ్స్ అండ్ లోన్’ బ్యాంకును (Bank) స్థాపించారు. ప్రస్తుతం ఆ బ్యాంకు మొత్తం ఆస్తుల (Assets) విలువ కేవలం 30 లక్షల డాలర్లు. అందులో ఇద్దరు ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. లావాదేవీల (Transactions)కోసం ఈ బ్యాంక్కు ఏటీఏం (ATM) వంటి సౌకర్యాలు లేవు. ఆన్లైన్ లావాదేవీలు చేసుకుందామంటే కనీసం వెబ్సైట్ (Website) కూడా లేదు. అందుకే వీరు లావాదేవీలు నిర్వహించడానికి ఎలాంటి రుసుములు తీసుకోరు.
తొలి నుంచీ ఒక్కటే బ్రాంచి
అమెరికాలో బ్యాంక్ అనే పేరు చెప్పగానే జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలే గుర్తుకొస్తాయి. కానీ, ఖాతాదారులు, డిపాజిట్లలో ఎటువంటి భారీతనం లేని ఈ అతి చిన్న బ్యాంకు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే ‘కెంట్ల్యాండ్ ఫెడరల్ సేవింగ్స్ అండ్ లోన్’ బ్యాంక్. దీనిని యూఎస్లోనే అతి చిన్న బ్యాంక్గా ప్రకటించారు. ఈ బ్యాంక్ను 1920లో స్థాపించారు. అప్పటి నుంచి విస్తరణ, కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు లేకుండా దీని ప్రస్థానం సాగిపోతోంది. ఇండియానాలోని కెంట్ల్యాండ్లో మొదట్నుంచీ ఉన్న ఒకే ఒక్క బ్రాంచి మాత్రమే ఇప్పటికీ కొనసాగుతోంది.
సేవలు ఆ మూడు మాత్రమే!
ఇక్కడ ఖాతాదారులకు మూడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అవి స్థిరాస్తిని తనఖా పెట్టుకోవడం, పొదుపు ఖాతాను తెరవడం, డిపాజిట్ సర్టిఫికెట్ తెరవడం. 1920 చివర్లో స్టాక్ ఎక్సేంజ్ ఘోరంగా పడిపోయినా తమ బ్యాంక్ సేవలు కొనసాగాయని ప్రస్తుత సీఈవో జేమ్స్.ఎ. సమన్స్ తెలిపారు. ఈ బ్యాంకులో నగదు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అప్పట్లోనే ప్రజలు తమను విశ్వసించారని ఆయన తెలిపారు. అన్నట్లు ఈ జేమ్స్ ఎవరో కాదు ఆ బ్యాంక్కు నాలుగో తరం సీఈవో. తన పూర్వీకులైన హ్యూమ్ సమన్స్, జార్జ్ సమన్స్, జేమ్స్.ఇ. సమన్స్ల వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు.
టెక్నాలజీకి దూరం
గడిచిన శతాబ్ద కాలంలో బ్యాంకింగ్ రంగం బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎన్నో సంస్థలు ముందుకు సాగుతున్నాయి. అయినప్పటికీ ఈ బ్యాంకులో చెక్కులను రాయడానికి సంప్రదాయ కోడింగ్ మెషీన్లనే ఇంకా వినియోగిస్తున్నారట. అందువల్ల ఈ బ్యాంకింగ్ వ్యాపారం తన జనరేషన్తోనే అంతమైపోతుందేమోనన్న భయం కూడా సీఈవో జేమ్స్కు పట్టుకుందట. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. బ్యాంకింగ్ నిబంధనలు కఠినతరం చేయడం, ఇతర బ్యాంకుల పోటీ ఎక్కువ కావడంతో ఇటీవల ఈ చిన్న బ్యాంక్కు వచ్చే ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతోందట.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM