Golden bats statue : బంగారం ధర పెరిగింది.. ఆ విగ్రహం దశ తిరిగింది!
దక్షిణ కొరియాలో (South korea) ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న మూరుమూల కౌంటీలో గతంలో ఓ బంగారు గబ్బిలాల విగ్రహం (Golden Bats statue) నెలకొల్పారు. ఆ చర్యను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు బంగారం ధరకు (Gold price) రెక్కలు రావడంతో దాని ధర సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఆ కథేంటో తెలుసుకోండి.
(Image : Hampyeong.go.kr)
దక్షిణ కొరియాలో (South korea) ఒకప్పుడు ఎరుపు-పసుపు పచ్చ రంగులో ఉండే ‘హాడ్సన్స్’జాతి గబ్బిలాలు (Bats) అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 1999లో అవి హంపియోంగ్ కౌంటీలో వాడుకలో లేని బంగారు గనిలో (Gold mine)కన్పించాయి. ఆ కౌంటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అక్కడ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అప్పుడే స్థానిక ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే స్వచ్ఛమైన బంగారంతో గబ్బిలాల విగ్రహం ఏర్పాటు చేయడం. తద్వారా పర్యాటకులను ఆ ప్రాంతానికి రప్పించి ఆదాయాన్ని సంపాదించడం.
162 కేజీల బంగారం.. 281 కేజీల వెండి
2005లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో ఈ గబ్బిలాల విగ్రహ నిర్మాణం కోసం అధికారులు 21 లక్షల డాలర్లు కేటాయించారు. ఆ డబ్బుతో సుమారు ఏడు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసేందుకు 162 కేజీల బంగారం, 281 కేజీల వెండిని కొనుగోలు చేశారు. ప్రఖ్యాత దక్షిణకొరియా శిల్పి బైన్-కున్-హో ఆ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాడు. ఒక వెండి రింగు చుట్టూ ఐదు బంగారు గబ్బిలాలు ఎగురుతున్న రీతిలో విగ్రహాన్ని తయారు చేశాడు. అందుకు సుమారు మూడు సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది. ఈ శిల్పం ‘విశ్వ సామరస్యం, అమరత్వాన్ని సూచిస్తుంది’ అని దాని గొప్పతనాన్ని బైన్ వివరించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఆ శిల్పాన్ని ఒక గుహలాంటి ప్రదర్శనశాలలో ఉంచారు. మిగిలిన బంగారం, వెండితో ఒక కాఫీ టేబుల్ పరిమాణంలో బంగారు గుడ్లను తయారు చేయించారు. కొరియా పౌరాణిక హీరోలను గౌరవిస్తూ ఆ నిర్మాణాన్ని చేపట్టారు.
బంగారం పెట్టుబడిపై విముఖత
విగ్రహాల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని స్థానిక ప్రభుత్వం విశ్వసించింది. అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని చూడటానికి పర్యాటకులు భారీగా వస్తారని భావించింది. అయితే, ఈ కళాత్మక నిర్మాణంపై పెట్టుబడిని చాలా మంది విమర్శించారు. బంగారంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వృథా అన్నారు. అప్పటికే ఆ కౌంటీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దాంతో స్థానిక వార్తా పత్రికలు కూడా వ్యతిరేక కథనాలు ప్రచురించాయి.
అనూహ్యంగా పెరిగిన ధర
కొద్ది రోజుల తరువాత క్రమంగా బంగారం ధర పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక అనిశ్చితి, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలతో పుత్తడి ధర ఆకాశాన్నంటింది. దాంతో విగ్రహం విలువ అమాంతం పెరిగిపోయింది. ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగి 1.1 కోట్ల డాలర్లకు చేరింది. బంగారు విగ్రహం కౌంటీలోని ఓ మారుమూల ప్రదేశంలో ఉన్నప్పటికీ గత కొద్ది వారాల్లోనే సుమారు 15వేల మంది కొరియన్ పర్యాటకులు దాన్ని సందర్శించారు. పసిడి ధర పెరిగే కొద్ది విగ్రహాన్ని చూడాలనే ఆసక్తి కూడా చాలా మందిలో పెరుగుతోంది. అందుకే అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతున్నారని కౌంటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రవేశ టికెట్ ధర 1.5 డాలర్లుగా నిర్ణయించారు. దాంతో కౌంటీలో జరగుతున్న ‘బటర్ ఫ్లై ఫెస్టివల్’ను చూసేందుకు వచ్చేవారంతా విగ్రహాన్ని సందర్శించేందుకు ఉత్సాహం కనబరిచారు.
దోపిడీకి దొంగల యత్నం
అత్యంత విలువైన విగ్రహం ఇక్కడుందనే విషయం అందరికీ తెలియడంతో దానిపై దొంగల కన్నుపడింది. 2019లో దాన్ని దొంగిలించేందుకు శతవిధాల ప్రయత్నించి ముగ్గురు దొరికిపోయారు. అలారం మోగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ఘటన తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు మోషన్ సెన్సార్లను, హై రిజల్యూషన్ సెక్యురిటీ కెమెరాలను అమర్చారు. బుల్లెట్ ప్రూఫ్ గాజు, స్టీల్ షెట్టర్తో విగ్రహానికి రక్షణ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని ఎకోలాజికల్ ఎగ్జిబిషన్ హాల్ నుంచి కౌంటీలోని హంపియోంగ్ ఎగ్జిబిషన్ పార్క్కు మారుస్తున్నట్లు కౌంటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బంగారం ధర గరిష్ఠంగా పెరిగింది. అయినప్పటికీ విగ్రహాన్ని విక్రయించే ఆలోచన తమకు లేదని చెప్పారు. తాము లాభం కోసం ఈ విగ్రహాన్ని నెలకొల్పలేదని స్పష్టం చేశారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు